Showing posts with label Telangana News. Show all posts
Showing posts with label Telangana News. Show all posts

Friday, January 12, 2024

పిల్లల స్టడీ టేబుల్ మీద ఇవి అస్సలు ఉంచకూడదు తెలుసా?

 


అలా ఎక్కువగా పెట్టడం వల్ల.. మనకు కావాల్సిన దానిని పిక్ చేసుకోవవడానికి ఎక్కువ సమయం పడుతుందట. అలా కాకుండా.. ఒకటి లేదంటే.. రెండు మాత్రమే ఉంచాలట. దీని వల్ల డిస్ట్రాక్షన్ ఎక్కువగా ఉండదు.   పిల్లలు చదువుకునేందుకు మనం ఇంట్లో స్టడీ రూమ్ లేదంటే.. స్టడీ టేబుల్ పెడుతూ ఉంటాం. అయితే.. ఆ స్టడీ టేబుల్ మీద పుస్తకాలు ఉంటాయో లేదో కానీ.  ఏవేవో వస్తువులు వచ్చి చేరుతూ ఉంటాయి అయితే..  కొన్ని వస్తువులను మనం టేబుల్ పై పెట్టడం వల్ల.. పిల్లల చదువు మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోతుందట. స్టడీ టేబుల్ మీద అస్సలు ఉంచకూడని వస్తువులు ఏంటో ఓసారి చూద్దాం..  

1.స్టడీ టేబుల్ మీద అస్సలు ఉంచకూడడని మొదటి వస్తువు ఫోన్.  ఫోన్ ఎదురుగా కనపడితే.. పిల్లలే కాదు.. పెద్దలు కూడా పుస్తకంపై ఫోకస్ పెట్టలేరు. లేదు.. మనం చదవాలి అని అనుకున్నా కూడా ఫోక్ కి వచ్చే నోటిఫికేషన్స్ డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అటుగా మనల్ని లాగేస్తూ ఉంటాయి. కాబట్టి… చదువుకోవాలి అనుకుంటే.. ఫోన్ మాత్రం స్టడీ టేబుల్ మీద మాత్రమే కాదు.. అంతకంటే దూరంగా పెట్టాలి.

2.ఇక స్టడీ టేబుల్ అనగానే చాలా మంది పెన్నులు, పెన్సిల్ మొత్తంగా ఓ స్టేషనరీనే టేబుల్ పై నింపేస్తారు. కానీ.. ఎక్కువ గా స్టేషనరీని పెట్టకూడడదట. అలా ఎక్కువగా పెట్టడం వల్ల.. మనకు కావాల్సిన దానిని పిక్ చేసుకోవవడానికి ఎక్కువ సమయం పడుతుందట. అలా కాకుండా.. ఒకటి లేదంటే.. రెండు మాత్రమే ఉంచాలట. దీని వల్ల డిస్ట్రాక్షన్ ఎక్కువగా ఉండదు.

  1. ఇవి మాత్రమే కాదు.. టేబుల్ పై మనం అవసరం లేని గ్యాడ్జెట్స్ ఉంచకూడదు. అంటే.. మన చదువుకు సంబంధం లేని వస్తువులను పొరపాటున కూడా  స్టడీ టేబుల్ పై ఉంచకూడదు. ఇవి పిల్లల ఫోకస్ ని దెబ్బతీస్తాయి.

4.ఇక చాలా మంది.. తమ స్టడీ టేబుల్ ని చాలా అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఆ డెకరేషన్ లు అందంగా ఉండొచ్చు. కానీ.. ఎక్కువగా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. చదివే సమయంలో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి.. అలాంటి డెకరేషన్ లకు దూరంగా ఉండాలి.

5.అంతేకాకుండా.. స్టడీ టేబుల్ ని ఎప్పుడూ ఆర్గనైజ్డ్ గా ఉంచుకోవాలి. టేబుల్ మొత్తం చిందర వందరగా.. ఆర్డనైజ్డ్ గా లేకుండా.. పేపర్లు, పుస్తకాలు ఉంచకూడదు. అలా ఉంచితే అవి కూడా చదువుకునేటప్పుడు డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి.

6.చదువకునే సమయంలో.. మన చుట్టూ ప్రదేశాలు చాలా ప్రశాంతంగా ఉండాలి. పెద్ద పెదద్ సౌండ్లు రాకుండా ఉండేలా చూసుకోవాలి. అలాంటివి స్టడీ టేబుల్ మీద మాత్రమే కాదు.. చుట్టుపక్కల కూడా ఉండకూడదు.

7.చాలా మందికి చదువుకునేటప్పుడు ఏవేవో చిరు తిండ్లు తినే అలవాటు ఉంటుంది.  ఈ క్రమంలో ఎక్కువగా అనారోగ్యానికి కలిగించే స్నాక్స్ ని దగ్గరగా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటివి.. స్టడీ టేబుల్ కి దూరంగా ఉంచాలి. అవి తినకూడదు. అవి ఉంటే…వాటిని తింటూనే ఉంటాం.  చదువు ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి.  

 

 

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ నెల 31 వరకు పెండింగ్‌ చలాన్ల రాయితీ గడువు పెంపు

 


 

హైదరాబాద్‌: రాష్ట్రంలో వాహనాల పెండింగ్‌ చలాన్లు చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పెంచారు. ముందుగా ప్రకటించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసింది. వాహన యజమానుల నుంచి స్పందన చూసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో గడువు పొడిగించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని వాహన యజమానులు సద్వినియోగం చేసుకొని పెండింగ్‌ చలాన్లు మొత్తం చెల్లించాలని కోరారు. ప్రభుత్వం డిసెంబర్‌ 26 నుంచి పెండింగ్‌ చలాన్లపై రాయితీలను ప్రకటించింది.

టూ, త్రీ వీలర్‌ వాహనాల చలాన్లపై 80 శాతం రాయి తీ, ఆర్‌టీసీ బస్సులపై 90 శాతం, లైట్‌, హెవీ వెహికిల్స్‌పై 60 శాతం రాయితీ ఇస్తున్నారు. వాహనదారులు పెండింగ్‌ చలాన్ల వివరాలను www. echallan.tspolice.gov.in/ pu blicviewలో చూసి, చెల్లించాలని సూచించారు. చలాన్లను మీ సేవా, టీ వాలెట్‌, ఈ సేవా, ఆన్‌లైన్‌, పేటీం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చని వెల్లడించారు. చలాన్ల రాయితీ ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ.113 కోట్ల ఆదాయం వచ్చింది. పెండింగ్‌ చలాన్లు 3.59 కోట్లు ఉండ గా, ఇప్పటివరకు 1.29 కోట్ల చలాన్లను వాహనదారులు చెల్లించారు.

 

బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్ గా దిశా గా మార్పు..!?

 

 



తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ తిరిగి శక్తి పుంజుకొనే ప్రయత్నం చేస్తోంది. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో పార్టీ పేరు పైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్పు చేయాలని సీనియర్లు కోరుతున్నారు. మరి ఈ దిశగా కేసీఆర్ అంగీకరిస్తారా.

తిరిగి మారుస్తారా : బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్ మార్చే ఆలోచన ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేరులో తెలంగాణ లేకపోవటం నష్టం చేసిందనే అభిప్రాయంలో సీనియర్లు ఉన్నారు. దీంతో, తిరిగి పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని కోరుతున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీలో తెలంగాణను తీసేసి భారత్‌ను చేర్చడం వల్ల బీఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని చెప్పుకొచ్చారు. కొంత మంది ప్రజలు అలా భావించి పార్టీకి దూరమై ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేసారు. తెలంగాణ ఇంటి పార్టీగా పేరులోనే తెలంగాణ ఉండాలనేది సీనియర్లు చెబుతున్న మాట. పార్టీ పేరులో తిరిగి తెలంగాణ చేర్చటం ద్వారా పూర్వవైభవం సాధ్యమేనని అంచనా వేస్తున్నారు.

సీనియర్ల కీలక వ్యాఖ్యలు : ఎక్కువమంది కార్యకర్తలు కూడా అదే అభిప్రాయపడుతున్నట్టు కడియం చెప్పినట్టు సమాచారం. పార్టీ పేరులో ‘తెలంగాణ’ను తొలగించి, ‘భారత్‌’ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా పార్టీలో తిరిగి తెలంగాణ ఉండేలా బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలని కోరుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలోనే కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యతగా మారింది. ఒకవేళ జాతీయస్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉండాలనుకుంటే అలాగే ఉంచి.. రాష్ట్ర రాజకీయాలకు ‘టీఆర్ఎస్’ను తెర మీదకు తీసుకొచ్చే విషయాన్ని ఆలోచించాలి. ఇందులో న్యాయపరమైన అంశాలేమైనా ఉంటే మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ వంటివారు ఈ విషయంలో సంబంధిత నిపుణులతో చర్చిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ సిద్దమేనా : ఈ మార్పు అంశాన్ని కేసీఆర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కడియం శ్రీహరి వివరించారు. అయితే, ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ పోటీ చేయాలని కేసీఆర్ ఆలోచన గా తెలుస్తోంది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురు కావటంతో ఇప్పుడు ముందుగా తెలంగాణలో తిరిగి బలం పెంచుకుని పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమయంలో పార్టీ మార్పు పైన చర్చ మొదలైంది. అదే విధంగా పార్టీ పరంగానూ కీలక పదవుల్లో మార్పులు జరుగుతాయని ప్రచారం సాగుతోంది. కేటీఆర్ పార్లమెంట్ కు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ పేరు తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలనే డిమాండ్ పైన కేసీఆర్ తీసుకొనే నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.

 

Wednesday, January 10, 2024

ఆ రోజు కన్నీళ్లు కార్చాను.. మంత్రి పొంగులేటి ఎమోషనల్‌

 ఖమ్మం జిల్లా: గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత వివక్షతకు గురయ్యారని,  నిరుద్యోగులు అందరూ కలసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారంటూ వ్యాఖ్యానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఖమ్మం నగరంలోని భక్త రామదాస్  కళాక్షేత్రంలో రైట్ ఛాయిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఆత్మీయ సత్కారంలో మంత్రి పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో  ఆ కుటుంబం చెప్పిందే వేదం.. గత ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పులు చేసింది. మా ప్రభుత్వంలో ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు మొదటి అడుగు పడిందని మంత్రి పేర్కొన్నారు.


 

మంత్రి ఎమోషనల్‌..
నన్ను ఒంటరిగా చేసినప్పుడు కన్నీళ్లు కార్చానని.. ఆ రోజు అభిమానులు బాధపడతారని వారి ఎదుట ఎమోషనల్ కాలేదని.. మంత్రి  పొంగులేటి భావోద్వేగానికి గురయ్యారు.

Tuesday, January 9, 2024

బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కొత్త గైడ్‌లైన్స్ జారీ: పాటించకపోతే రూ.500 ఫైన్

 

 


TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలపై టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి అని తేల్చి చెప్పారు.

గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాల్సి ఉంటుందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏ ఒరిజినల్‌ గుర్తింపు కార్డయినా సరే.. దాన్ని చూపించి నిబంధనల మేరకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పాన్‌ కార్డులో అడ్రస్ ఉండదు కాబట్టి.. అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు అని సజ్జనార్ పేర్కొన్నారు.

ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలంటూ తాము పదే పదే చెబుతున్నామని.. ఎప్పటికప్పుడు సూచనలను జారీ చేస్తోన్నామని, అయినప్పటికీ.. కొంతమంది దీన్ని అనుసరించట్లేదని సజ్జనార్ వ్యాఖ్యానించారు. స్మార్ట్‌ ఫోన్లల్లో ఉండే ఫొటోలను గుర్తింపు కార్డుగా చూపించడం చెల్లుబాటు కాదని అన్నారు.

ప్రయాణ సమయంలో తమ గుర్తింపుకార్డు ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్‌ను చూపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అవి చెల్లవని ఆయన తేల్చి చెప్పారు. దీని వల్ల సిబ్బంది ఇబ్బందులకు గురి కావడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇది ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని సజ్జనార్ అన్నారు.

మహిళా ప్రయాణికులందరూ ఒరిజినల్‌ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌‌ను తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒరిజినల్‌ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా ఛార్జీని చెల్లించి టికెట్‌ తీసుకోవాలని సూచించారు.

ఫ్రీ ట్రావెల్ ఉన్నప్పుడు జీరో టికెట్‌ తీసుకోవడానికి కొందరు మహిళ ప్రయాణికులు నిరాకరిస్తోన్నారని, సిబ్బందితో వాదనకు దిగుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని సజ్జనార్ అన్నారు. ఇది సరి కాదని చెప్పారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుందని వివరించారు.

జీరో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారని సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రతి మహిళా కూడా జీరో టికెట్‌ను తీసుకోవాలని, ఒక వేళ టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్‌లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. అలాగే సదరు ప్రయాణికురాలికి 500 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుందని అన్నారు.


Tuesday, June 20, 2023

తెలంగాణలో అందుబాటులోకి 'టి-9' టికెట్‌.. రూ. 100 చెల్లిస్తే చాలు ఎంచక్కా

 


 

 సంస్థలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. సిటీ బస్సులు మొదలు, జిల్లాల వరకు బస్సుల్లో రకరకాల ఆఫర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘టి-9’పేరుతో ప్రత్యేక టికెట్‌ను ప్రవేశపెట్టారు. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ టికెట్‌ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇంతకీ ఈ టికెట్‌తో కలిగే ప్రయోజనాలు ఏంటి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలను తెలుపుతూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్ చేశారు.

ఆర్టీసీ బస్సులో కండక్టర్‌ ఇచ్చిన టీ9 టికెట్‌కు సంబంధించిన ఫొటోను షేర్‌ చేసిన సజ్జనర్‌.. ‘పల్లె వెలుగు బస్సుల్లో అధికంగా ప్రయాణించే మహిళలు, వృద్దుల కోసం తెలంగాణ ఆర్టీసీ కొత్తగా ‘టి-9 టికెట్‌’ను ప్రవేశపెట్టింది. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ టికెట్‌ అందుబాటులోకి వచ్చింది. రూ.100 చెల్లిస్తే 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోనూ ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ టికెట్ వర్తిస్తుంది. టి-9 టికెట్ తో ఒక్కొక్కరికి రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతుంది. మహిళలు, వృద్ధుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తీసుకువచ్చిన ఈ టికెట్‌ను ఆదరించాలని సంస్థ కోరుతోంది’ అని ట్వీట్‌ చేశారు.

 

Saturday, April 30, 2022

కొత్త పెన్షన్ దారులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త

 

కొత్త పెన్షన్‌ దారులకు కేసీఆర్‌ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కర్ణాటకలో బీజేపీ రూ.600 ఇస్తున్నారు… కేసీఆర్ గారు మనకు రూ .200 ను రూ 1000 చేశారని హరీష్‌ రావు అన్నారు.

ఆ తర్వాత 2016 రూపాయలు చేసారు. రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు వస్తాయని… 57 ఏళ్లు పూర్తయిన వారికి పెన్షన్ ఇస్తామని ప్రకటన చేశారు హరీష్‌ రావు. బాన్సువాడలో 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి హరీష్‌ రావు భూమిపూజ చేశారు.

ఈ సందర్బంగా స్పీకర్ పోచారంను అంకుల్ అంటూ సంబోదిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి హారీష్ రావు..పోచారం లక్ష్మీపుత్రుడు అని కొనియాడారు. పోచారం మాకు మార్గదర్శి. రాజకీయంగా సుదీర్ఘ అనుభం ఉన్న నేత అని తెలిపారు. నియోజకవర్గ అభివ్రుద్దిపై దూరద్రుష్టి ఉన్న నేత పోచారందని.. డబుల్ బెడ్ రూంల నిర్మాణంలో పోచారం ముందు వరస లో ఉన్నారని వెల్లడించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి గ్రూప్ 1 నోటిఫికేషన్

 

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది. అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేసిన ప్రకారమే సోమవారం అధికారులు పోలీసు శాఖలో నోటిఫికేషన్ విడుదల చేశారు.

మంగళవారం తెలంగాణలో తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో నిరుద్యోగులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 503 గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇంటర్వ్యూలను ఎత్తివేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తన నోటిఫికేషన్‌లో ప్రకటించింది. కేవలం ప్రిలిమ్స్‌, మెయిన్స్ రాత పరీక్షల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల విషయంలో అభ్యర్థులకు ముఖ్య విషయాన్ని తెలియజేసింది. మే 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులను కోరింది. ఇక, గ్రూప్ 1లో ప్రకటించిన ఉద్యోగాల్లో కేటగిరీల వారీగా ఉద్యోగాల ఖాళీలు ఇలా ఉన్నాయి.

1. డిప్యూటీ కలెక్టర్లు 42

2. డీఎస్సీలు 91

3. ఎంపీడీఓలు 121

4. సీటీఓలు 48

5. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లు 38

6. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు 40

7. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు 26

8. మునిసిపల్ కమిషనర్ గ్రేడ్ 2.. 41

9. అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు 8

10. ఆర్టీఓ 4

11. జిల్లా పంచాయతీ ఆఫీసర్లు 4

12. జిల్లా రిజిస్ట్రార్లు 5

గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్‌.. పోస్టుల కేటాయింపుపై..

 

 

తెలంగాణలో గ్రూప్1 నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయ్యింది. అయితే.. మొత్తం 503 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.

మే 2వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుకు మే 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే చాలా మంది అభ్యర్థులకు పోస్టుల కేటాయింపు సరిగి జరగలేదనే అనుమానం కలుగుతోంది. అసలు పోస్టులను ఏ ప్రాతిపదికన కేటాయిస్తారు. అనే అంశం తెలుసుకోండి..

పోస్టులు ఎలా కేటాయిస్తారు..

గ్రూప్ పోస్టులను రోస్టర్ విధానం ద్వారా కేటాయిస్తారు. చాలా మంది అభ్యర్థులు మొత్తం 503 పోస్టులకు కలిపి రోస్టర్ విధానం కేటాయిస్తారు అని అభిప్రాయం పడుతున్నారని అధికారులు అంటున్నారు. అది సరైంది కాదని 503 పోస్టులను కలిపి చూడకూడదు. శాఖల వారీగా పోస్టు, మల్టీజోన్‌-1, 2కు కేటాయించిన పోస్టులను బట్టి రిజర్వేషన్‌ను విభజిస్తారు. అంతే కాకుండా రోస్టర్‌ ప్రకారం 48 పోస్టులకు ఒకటిమాత్రమే స్పోర్ట్స్‌ కోటాలో భర్తీ చేస్తారు. 98 పోస్టుల వరకు వస్తేనే రెండో పోస్టు కేటాయిస్తారు. ఆ లోపు పోస్టులున్న శాఖల్లో స్పోర్ట్స్‌ కోటా ఉండదు.

ఈ ఏడాది ప్రభుత్వం కొత్త రోస్టర్‌ ప్రారంభించింది. ప్రతి శాఖలో మొదటి పోస్టును ఓసీ మహిళ, రెండో పోస్టు ఎస్సీ మహిళ, మూడో పోస్టు ఓసీ, నాలుగో పోస్టు బీసీ ఏ-మహిళ, 5వ పోస్టు ఓసీ, 6వ పోస్టు వికలాంగ మహిళ ఇలా రోస్టర్‌ను కేటాయించారు. ఈ సారి తక్కువ పోస్టులున్న శాఖల్లో ఈ రోస్టర్‌ను అనుసరించటం వల్ల మహిళలకు ఎక్కువ పోస్టులు వచ్చాయి.

ఉదాహరణకు ఏదైనా మల్టీజోన్‌-2లో 1 పోస్టు ఉందనుకోండి.. ఆ పోస్టును ఎవరికి కేటాయించాలన్నది ప్రశ్న. రోస్టర్‌ ప్రకారం మొదటి పోస్టు జనరల్‌ మహిళకు వెళ్తుంది. మల్టీజోన్‌-2లో మొత్తం 100 పోస్టులుంటే 33 శాతం ప్రకారం 33 పోస్టులు మహిళలకు దక్కడమే కాకుండా, ఎవరి రిజర్వేషన్‌ కోటా ప్రకారం వారికి వస్తాయి. ఉన్నది ఒకే పోస్టు కావటంతో రోస్టర్‌ను అనుసరించి జనరల్‌ మహిళకు కేటాయించారు. మరో 30 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్‌ ఇస్తే, అప్పుడు 2వ రోస్టర్‌ పాయింట్‌ నుంచి మొదలుపెట్టి 30వ రోస్టర్‌ పాయింట్‌ వరకు ఉన్న రిజర్వేషన్‌ ప్రకారం కేటాయిస్తారు. వంద పోస్టులు భర్తీ అయ్యే వరకు ఇలాగే కొనసాగుతుంది. వంద పోస్టులు భర్తీ అయ్యాక తిరిగి రోస్టర్‌-1 ప్రకారం ఆ పోస్టును తిరిగి జనరల్‌ మహిళకు కేటాయిస్తారు. అభ్యర్థులు గందరగోళానికి గురికాకండా.. రోస్టర్ విధానాన్ని తెలుసుకొని స్డడీపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు శుభవార్త..12,735 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

 తెలంగాణ రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే వార్త చెప్పింది. తెలంగాణలోని వైద్య ఆరోగ్య శాఖలో ఏకంగా 12735 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే ఈ నియామకాల్లో వెయిటేజీ అంశం పై అధికారులు దృష్టిపెట్టారు.ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వగా… కొత్తగా 50 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైద్యులు సహా అన్ని విభాగాల ఉద్యోగాలకు 30 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సీనియారిటీ వెయిటేజీ 10 శాతానికి పెంచుతామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ పోస్టులకు అప్లై చేసే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మళ్లీ ఫోర్త్ వేవ్ కరోనా విజృంభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలలను ఈ విధంగా భర్తీ చేసేందుకు.. ఈ నిర్ణయం కేసీఆర్ సర్కార్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Monday, March 21, 2022

ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ప్రాక్టికల్‌ పరీక్షలపై బోర్డు కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ

 


 విద్యార్థులు చదివే కళాశాలల్లో రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే..


తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు ఇంటర్మీడియెట్‌ బోర్డు (Intermediate Board) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ నెల 23 నుంచి ఏప్రిల్‌ 9 వరకు జరిగే ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్స్‌కు 15 నిమిషాల వరకు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతిస్తామని తెలిపింది. అయితే ఆ తర్వాత వచ్చిన విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ ఆదేశాలు ఒక ప్రకటన జారీ చేశారు. కాగా విద్యార్థులు చదివే కళాశాలల్లో రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక కళాశాలలోని విద్యార్థుల్లో 25 శాతం మంది కంటే 30కి 30 మార్కులు వచ్చిన వారి.. అదేవిధంగా 27-30 మార్కులు వచ్చిన వారి సమాధాన పత్రాలను తాము మరోసారి పునఃపరిశీలన చేస్తామని స్పష్టం చేశారు

అలాగే.. ప్రాక్టికల్స్‌కు ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్‌ చేయకుంటే సంబంధిత కళాశాలల యాజమాన్యాలకు రూ.5 వేల వరకు జరిమానా విధిస్తామని ఇంటర్‌ బోర్డు హెచ్చరించింది. అదేవిధంగా ప్రాక్టికల్స్‌ ఎగ్జామినర్లు విద్యార్థులకు వేసిన మార్కులను అదేరోజు రాత్రి 8 గంటలలోపు ఆన్‌లైన్‌లో బోర్డుకు పంపాలని సూచించింది

కాగా.. ఆదివారం (మార్చి20) నుంచి ఆన్‌లైన్‌లో ప్రాక్టికల్స్‌ పరీక్షల హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. కాగా మే 6 నుంచి మే 24 వరకు మెయిన్‌ ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే జరుగుతాయని వెల్లడించింది. మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు.. మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీల్లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్‌ పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్స్‌ కూడా ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే.


 

బాలికల ప్రభుత్వ రెసిడేన్షియల్ స్కూల్‌‌లో లైంగిక వేధింపులు, బలవంతపు వ్యభిచారం అంటూ.. లేఖ..!

 


ఆలేరు ప్రభుత్వ మైనారిటీ వెల్ఫేర్ స్కూల్‌లో లైంగిక వేధింపులతో పాటు బలవంతపు వ్యభిచారం చేయిస్తున్నారంటూ రాసి ఉన్న ఓ లేఖ కలకలం రేపుతోంది. అయితే ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ స్కూల్ ప్రిన్సిపల్ చెబుతున్నారు.. ఎం జరిగిందనే దానిపై ఉన్నతాధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యే దృష్టిసారించారు


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మైనారిటీ స్కూల్‌లో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారంటూ వెలువడిన ఓ లేఖ కలకలం రేపుతోంది. అయితే ఈ లేఖ స్థానిక ఎమ్మెల్యేతోపాటు ఉన్నతాధికారులకు చేరడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో హుటాహుటిన విచారణ సైతం చేపట్టారు

 

ఆలేరు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో

వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉండే ఓ బాలిక జిల్లా మైనార్టీ అధికారి, జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, స్థానిక ఎస్‌ఐ, మీడియా రిపోర్టర్లను వేడుకుంటూ ఓ ఉత్తరం చేరుకుంది. అయితే ఆ లేఖలో అంత్యంత జుగుప్సాకరమైన విషయాలు పేర్కొని ఉన్నాయి.. లేఖలో తెలిపిన వివరాల ప్రకారం స్కూలు విద్యార్థినిలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారంటూ.. పేర్కొంది. స్కూలు పక్కనే ఓ అద్దెగదిని తీసుకుని వారానికి ఒక విద్యార్థిని చొప్పున పంపుతున్నట్టు తెలిపింది. కాగా ఈ వారం తన వంతు రావడంతో ఏం చేయాలో తోచక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని వాపోయింది.

స్కూల్‌లో పనిచేసే వారిపై ఆరోపణలు

ఈ క్రమంలోనే స్కూల్‌లో పనిచేసే గౌస్‌తో పాటు అంజు , సాజియా, సబిహా, రిజ్వానా అర్షియా అనే మహిళలపై ఆమె ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే గౌస్ విద్యార్థినిల సిక్ రూంలోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పేర్కోంది. రిజ్వానా అనే మహిళ భర్త రాత్రిపూట విద్యార్థినిలను తీసుకుని వెళుతున్నట్టు చెప్పింది. బయటి వ్యక్తులకు వ్యభిచారం చేయిస్తున్నారని అందుకోసం వారి వద్ద 20వేల రూపాయలు కూడా తీసుకుని, విద్యార్థినిలకు 500 రూపాయలు కూడా ఇస్తున్నట్టు తెలిపింది. ఎవరైనా ఎదిరిస్తే టీసి ఇచ్చి పంపిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు.

అంతా ఉత్తదే.. ప్రిన్సిపల్

అయితే ఈ లేఖ బయటపడిన తర్వాత స్కూల్లో ఉన్న విద్యార్థినిలను ప్రిన్సిపల్ విచారణ జరిపినట్టు చెప్పారు. ఇదంతా తప్పుడు ప్రచారమని తేల్చారు. వ్యక్తిగత కక్షలను స్కూలుకు రుద్దారని తెలిపారు.. ఈ క్రమంలోనే స్కూల్‌లో ఆయాగా పనిచేసే అర్షియా నుంచి ఆమె భర్త విడాకులు తీసుకున్నాడని.. అతడే ఇలాంటి లేఖను ఉద్దేశపూర్వకంగా సృష్టించి స్కూల్ పరువు తీయాలని చూస్తున్నాడని ఆరోపించారు.. వారిద్దరి మధ్య గొడవను స్కూల్ మీద రుద్దారని వివరించాడు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కలెక్టర్‌కి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని ప్రిన్సిపల్ తెలిపారు. 



Tag:తెలుగు వార్తలు, . రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, చదవండి.

Sunday, March 20, 2022

తుపాకీ చేతబట్టిన తొలి మహిళ.. యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

 


తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తుపాకీ చేతబట్టిన తొలిమహిళ మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. కొద్దిరోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న స్వరాజ్యం చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే వైద్యులు మల్లు స్వరాజ్యం ఇకలేరని ప్రకటించారు. ఈనెల 2న ఆమె ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చేరారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి పోరాడిన ధీరవనిత మల్లు స్వరాజ్యం. ఆమె భౌతికకాయాన్ని ఎంబీ భవన్‌కు తరలించనున్నారు.
1945, 46 సాయుధ పోరాట సమయంలో దొరల అహంకారంపై తిరగబడ్డారు స్వరాజ్యం. నైజాం సర్కార్‌ను గడగడలాడించారు.సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో 1931 వ సంవత్సరంలో కుటుంబంలో ఆమె జన్మించారు. భూస్వాముల కుటుంబంలో పుట్టిన ఆమె నైజాం సర్కార్‌కి వ్యతిరేకంగా పోరాడారు. దొరల దురహంకారంపై తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో స్వరాజ్యం పనిచేశారు.

ఐద్వా రాష్ట్ర, జాతీయ నాయకురాలిగా ఆమె సేవలందించారు.

సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలిమహిళగా స్వరాజ్యం పేరుతెచ్చుకున్నారు. మహిళా కమాండర్‌గా పనిచేశారు. ఆమెను పట్టించిన వారికి నైజాం సర్కార్ పదివేల రివార్డు కూడా ప్రకటించింది.తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978, 1983 ఎన్నికల్లో సీపీఎం పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. నల్గొండ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. తదనంతరం ఆమె రాజకీయాల నుంచి వైదొలిగారు

 

 

R.R.R సినిమాకు తెలంగాణ ప్రభుత్వ Good News

 


ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందానికి, థియేటర్ యజమానులకు తెలంగాణ ప్రభుత్వం కలిసొచ్చే వార్త చెప్పింది. ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ థియేటర్‎లలో  మొదటి మూడు రోజులకు రూ. 50, తర్వాత వారం రోజులకు 30 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించింది. అదేవిధంగా మల్టీప్లెక్స్ థియేటర్స్, ఐమాక్స్ థియేటర్‎లలో మొదటి మూడు రోజులకు రూ. 100, తర్వాత వారం రోజులకు రూ. 50 పెంచుకునే అవకాశం ఇచ్చింది. దాంతో సింగిల్ స్క్రీన్ థియేటర్‎లో రూ. 236, మల్టీప్లెక్స్‎లో రూ. 413గా టికెట్ రేట్లు ఉండనున్నాయి.

అంతేకాకుండా మార్చి 25న విడుదలకాబోతున్న ఈ సినిమాను 10 రోజుల పాటు రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది. అందులో భాగంగా ఉదయం 7 నుంచి రాత్రి ఒంటి గంట వరకు షోలు వేసుకోవచ్చని థియేటర్ యాజమానులకు చెప్పింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా.. రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజమౌళీ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

 

Friday, March 18, 2022

సమ్మక్క- సారక్కల మీద వ్యాఖ్యలపై చినజీయర్​స్వామి వివరణ.. ఏమన్నారంటే..?

 


గత కొన్నిరోజులుగా సోషల్ ​మీడియాలో వైరల్​ అవుతున్న తన వ్యాఖ్యలపై త్రిదండి చినజీయర్​ స్వామి వివరణ ఇచ్చారు. లక్ష్మీదేవి పుట్టినరోజు సందర్భంగా ఏపీలోని విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లిన చినజీయర్​ స్వామి.. ఈ వివాదంపై స్పందించారు. సమ్మక్క- సారక్క జాతర గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ వివాదంపై స్పందించిన చినజీయర్​ స్వామి.. ఆదివాసీ గ్రామ దేవతలను తూలనాడినట్లు చేస్తున్న ప్రచారం సరికాదని హితవు పలికారు. తాము ఆదివాసీలను ఎప్పుడూ.. ఎవరినీ.. ఏమీ అనలేదని అన్నారు. ఆదివాసీ దేవతల విషయంలో జరుగుతున్న మోసపూరిత వ్యాపారం గురించి వివరించే సందర్భంలో 20 ఏళ్ల క్రితం చెప్పిన మాటలని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల పూర్వాపరాలు చూస్తే ఆ విషయం అవగతమవుతుందని సూచించారు.

20 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెర మీదికి రావటానికి కారణం ఏంటనేది ఆలోచించాల్సిన విషయమని చెప్పారు. తాను ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశానో.. దాని పూర్వాపరాలు చూడకుండా కేవలం కొన్ని మాటలనే ప్రచారంలోకి తీసుకువచ్చారని వివరించారు. అలాంటి మాటలు వాడుకుని లబ్ధి పొందాలనో.. తమపై విషప్రచారం చేయాలనో చేసిన చర్యగా భావిస్తామన్నారు. మహిళలు, ఆదివాసీలను వెలుగులోకి తీసుకురావాలన్న భావన నుంచి వచ్చిన తాము... వారిని అవమాన పరిచేలా మాట్లాడమని స్పష్టం చేశారు.

పూర్వాపరాలు చూడకుండా..

"ఈ మధ్య కొన్ని రకాల వివాదాలు తలెత్తాయి. అవి సబబా? కాదా? అనేది వినే వాళ్లకు వదిలేస్తున్నాం. ఆదివాసీ జనాలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి వచ్చినవాళ్లం కాబట్టి.. అలాంటి వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు మాకు లేదు. అందరినీ ఆదరించాలని అంటాం. ‘స్వీయ ఆరాధన.. సర్వ ఆదరణ’ మా నినాదం. నేను దేనిని నమ్ముతానో దాన్ని చక్కగా ఆరాధించుకోవాలి. అన్నీ నేను నమ్మాల్సిన అవసరం లేదు కదా! ప్రపంచంలో ఎన్నో మార్గాలుంటాయి. ఎన్నో రకాల అలవాట్లు ఉన్నవారు ఉన్నారు. అలాంటి వాళ్లు వాళ్ల మార్గంలో సవ్యంగా ఉండేలా ఆదరించాలి. అందరినీ ఆరాధించాల్సిన అవసరం లేదు. అందుకోసం మారనవసరం లేదు. మన పద్ధతిలో మనం ఆరాధించుకోవాలి. 2002వ సంవత్సరం నుంచి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఒకరిని లేదా, కొంతమంది దేవతలను చిన్న చూపు చూసేలా మాట్లాడానని అనుకోవడం పొరపాటు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా మాట విన్నప్పుడు, ఒక నిర్ణయం చేసేటప్పుడు దానికి పూర్వాపరాలు చూడటం చాలా అవసరం. అది లేకుండా మధ్యలో కొంత భాగాన్ని తీసుకుని, ‘ఈ వ్యక్తి ఇలా అన్నాడు’ అని అనడం హాస్యాస్పదంగా ఉంటుంది."- త్రిదండి చినజీయర్‌ స్వామి

ఆదివాసుల సంక్షేమం కోసం వికాస తరంగిణి ద్వారా అనేక సేవలు అందించినట్టు చినజీయర్​ స్వామి తెలిపారు. ప్రజలను ప్రభావితం చేసేటువంటి దేవతలను చిన్నచూపు చూసే పద్ధతిని ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించమన్నారు. ఆ పేరుతో అరాచకాలను సృష్టించే వాళ్లను అరికట్టాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. పనికట్టుకొని పెద్ద వివాదాన్ని సృష్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నిజంగా సామాజిక హితం కోరే వ్యక్తులైతే వచ్చి మాట్లాడాలని సవాలు విసిరారు. విషయం తెలుసుకోవాలని.. ఆ తర్వాత సరైన విధానంలో స్పందించాలని హితవు పలికారు. పబ్లిసిటీ కోరుకునే విధంగా చేసే ఇలాంటి అల్ప ప్రచార కార్యక్రమాల్లో ఎలాంటి సామాజిక హితం ఉండదన్నారు. సమాజం, ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా అందులో తాము ఉంటామని.. అలాంటి వాళ్లను కలిసేందుకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటామన్నారు. సమాజం అనే పెద్ద వేదిక మీద పనిచేసే సమయంలో అందరూ కలిసి పనిచేస్తేనే అది సమాజానికి ఆరోగ్యకరమని వివరించారు.

టికెట్‌ పెట్టడం వెనుక కారణమిదే: చినజీయర్‌

సమతామూర్తిని దర్శించుకోవడానికి టికెట్‌ పెట్టలేదని చినజీయర్‌ స్వామి తెలిపారు. అదో ప్రాంగణమని.. దాంట్లో ఎన్నో రకాలైన కార్యక్రమాలు జరుగుతాయని వాటి నిర్వాహణ కోసమేనని ప్రవేశ రుసుమని స్పష్టం చేశారు. ఎంతో కొంత రుసుం పెట్టకుంటే వచ్చే సందర్శకులను కంట్రోల్‌ చేయడం కష్టమని పేర్కొన్నారు. అందువల్లే సామాన్యుడికి అందుబాటులో రూ.150గా ఎంట్రీ టికెట్‌ పెట్టినట్లు వెల్లడించారు. పైగా అక్కడ పూజల కోసం ఎటువంటి టికెట్లు లేవని.. ప్రసాదాలూ పూర్తి ఉచితమేనని చెప్పారు. మరోవైపు రాజకీయాలకు తాము చాలా దూరమని వెల్లడించారు.

యాదాద్రి ప్రారంభోత్సవంలో..

యాదాద్రి పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనటంపైన స్పందించిన చినజీయర్​స్వామి.. తాము ఏ కార్యక్రమం కోసం పాకులాడమని తెలిపారు. ఎవరైనా సలహా కోసం వస్తే ఇస్తామని.. ఏదైనా కార్యక్రమం అప్పజెప్పితే వందశాతం న్యాయం చేస్తామన్నారు. ఏ ప్రభుత్వంతోనూ విభేదాలు లేవని మరోసారి చినజీయర్​స్వామి స్పష్టం చేశారు. ఎవరైనా విభేదాలున్నట్టు భావించుకుంటే.. తమకు సంబంధం లేదని చమత్కరించారు

 


Thursday, March 17, 2022

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ మారింది. సవరించిన తేదీలను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది.


 

మే 6 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ (TS Inter Exams) ప్రారంభం కానున్నాయి. ఏ ఎగ్జామ్ ఎప్పుడో తెలుసుకోండి.

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్

మే 6- 2nd లాంగ్వేజ్ పేపర్ I

మే 9- ఇంగ్లీష్ పేపర్-I

మే 11- మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్ I

మే 13- మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్ I

మే 16- ఫిజిక్స్ పేపర్-I, ఎకనమిక్స్ పేపర్ I

మే 18- కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్ I

మే 20- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-I(బైపీసీ విద్యార్థులకు)

మే 23- మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -I, జాగ్రఫీ పేపర్-I

తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్

మే 7- 2nd లాంగ్వేజ్ పేపర్ II

మే 10- ఇంగ్లీష్ పేపర్-II

మే 12- మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్ II

మే 14- మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్ II

మే 17- ఫిజిక్స్ పేపర్-II, ఎకనమిక్స్ పేపర్ II

మే 19- కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ II

మే 21- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-II(బైపీసీ విద్యార్థులకు)

మే 24- మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -II, జాగ్రఫీ పేపర్-II

 



 

Thursday, September 30, 2021

సీఎం కేసీఆర్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారా?

 


 

 టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్క టీకా తయారీ కంపెనీ ఐనా వచ్చిందా? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ పుట్టడానికి ముందు నుంచే రాష్ట్రంలో, హైదరాబాద్‌లో పలు ఫార్మా కంపెనీలున్నాయన్న సంగతి గుర్తెరగాలన్నారు. ‘కేసీఆర్‌ వచ్చాకే తెలంగాణ ప్రజలు భోజనం చేస్తున్నారు. పోలియో టీకాలు వేసుకుంటున్నారు అన్న విధంగా టీఆర్‌ఎస్‌ వ్యవహారం ఉంది’అని రఘునందన్‌ ఎద్దేవాచేశారు. అసలు సీఎం కేసీఆర్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారా? అని ప్రశ్నించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణను అవమానపరిచినట్లు అని కేటీఆర్‌ మాట్లాడడడం సరైందికాదన్నారు. ఫార్మాసిటీకి సంబంధించి ముచ్చర్లలో పది వేల ఎకరాలు సేకరించినప్పుడు రాని ఇబ్బందులు మిగిలిన రెండు వేల ఎకరాలకు ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. ఐటీఐఆర్‌ రీజియన్‌ని ఎందుకు ఏర్పాటు చేయలేదో గత యూపీఏ ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. పరిశ్రమల మంత్రిగా రేయాన్‌ ఫ్యాక్టరీ, నిజాంషుగర్, అజంజాహిమిల్, ప్రాగా టూల్స్, ఆల్విన్‌ కంపెనీలను తెరిపించే సంగతేంటో కేటీఆర్‌ చెప్పాలని డిమాండ్‌చేశారు. సిరిసిల్లకు ఎన్ని లక్షల బతుకమ్మ చీరలకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారో, దుబ్బాక నుంచి ఎన్ని తెచ్చారో చెప్పాలని రఘునందన్‌ డిమాండ్‌చేశారు.  

కేటీఆర్‌ పుట్టకముందే రాష్ట్రంలో ఫార్మా అభివృద్ధి 
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లేనిది చూసి మంత్రి కేటీఆర్‌ ఎగిరెగిరి పడ్డారని, ఆయన పుట్టకముందే తెలంగాణలో ఫార్మారంగం అభివృద్ధి చెందిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఏఐసీసీ కిసాన్‌సెల్‌ వైస్‌చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి హితవుపలికారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. మంగళవారం గాం«దీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కాకముందే ప్రపంచ ప్రసిద్ధి చెందిన భారత్‌ బయోటెక్, ఐడీపీఎల్, రెడ్డి ల్యాబ్స్‌ లాంటి ఫార్మా పరిశ్రమలు హైదరాబాద్‌లో ఏర్పడ్డాయని చెప్పారు.

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక 36 లక్షల మంది పారిశ్రామిక రంగంలో ఉద్యోగాలు కోల్పోయారని, అనేక పరిశ్రమలు మూతపడ్డాయని, పఠాన్‌చెరు లాంటి ఇండ్రస్టియల్‌ జోన్‌లో 50 శాతం కాలుష్యం పెరిగిందని విమర్శించారు. కాలుష్య నియంత్రణ మండలిని పనిచేయనీయకుండా పరిశ్రమల యాజమాన్యాలను బెదిరించి టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సు«దీర్‌రెడ్డి మాట్లాడుతూ మొన్న కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్తే హుజూరాబాద్‌ ఎన్నికలు ఆగిపోయాయని, ఇప్పుడు ఢిల్లీ వెళ్లి రాగానే అదే హుజూరాబాద్‌కు నోటిఫికేషన్‌ వచి్చందని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే కేసీఆర్‌ చేతిలో బీజేపీ కీలు»ొమ్మ అయిందని, ఈ ఎపిసోడ్‌లో ఈటల రాజేందర్‌ బకరా అయ్యారని సు«దీర్‌రెడ్డి ఎద్దేవాచేశారు.  


Wednesday, March 24, 2021

నాకు రిటైర్మెంట్‌ వయసు పెంపు వద్దు ..రెండురోజులుగా నమిలికొండ హెచ్‌ఎం నల్లబ్యాడ్జీతో నిరసన

 


కొడిమ్యాల: ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపుపై ఉద్యోగులంతా సంబరాలు చేసుకుంటుండగా.. ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం తనకు పెంపు వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నల్లబ్యాడ్జీ ధరించి విధులకు హాజరవుతున్నారు.జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఏనుగు మల్లారెడ్డి తనకు రిటైర్మెంట్‌ వయస్సు పెంపు వద్దని మంగళవారం ప్రకటించారు.

ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల నిరుద్యోగ యువతకు అవకాశాలు దక్కకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకుని సీఎం కేసీఆర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.   

 

 

Monday, October 10, 2016

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు- కలెక్టర్లు- ఎస్పీలు, కమీషనర్లు, డీసీపీలు


కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను, కొత్త కమిషనరేట్లకు కమిషనర్లు, డీసీపీలను ప్రభుత్వం ఖారారు చేసింది. విజయదశమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడుతున్న 21 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ, పాత జిల్లాల కలెక్టర్లను కూడా బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. రేపు ఉదయం 11:13 గంటలకు మంత్రులతొ పాటు కలెక్టర్లు కొత్త జిల్లాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఇంకా కొన్ని జిల్లాలకు ఎస్పీలు ఖరాలు కావాల్సి ఉంది.

జిల్లా కలెక్టర్లు
ఆదిలాబాద్- జ్యోతి బుధ్ద ప్రసాద్
మంచిర్యాల - ఆర్వీ కర్నన్
నిర్మల్ - ఇలంబర్తి
ఆసిఫాబాద్( కొమరం భీం) - చంపాలాల్

నిజామాబాద్- యోగితా రాణా
కామారెడ్డి - సత్యనారాయణ

కరీంనగర్- సర్పరాజ్ అహ్మద్
పెద్దపల్లి - అలుగు వర్షిణి
జగిత్యాల - శరత్
సిరిసిల్ల (రాజన్న) - కృష్ణ భాస్కర్

వరంగల్ అర్భన్- అమ్రపాలి
వరంగల్ (రూరల్)- పాటిల్ ప్రశాంత్ జీవన్
మహబూబాబాద్ - ప్రీతి మీనన్
జనగామ - దేవసేన
జయశంకర్ - మురళి

ఖమ్మం- లోకేశ్ కుమార్
కొత్తగూడెం (భద్రాద్రి) - రాజీవ్ జీ హన్మంతు

నల్లగొండ- గౌరవ్ ఉప్పల్
సూర్యాపేట - సురేంద్ర మోహన్
యాదాద్రి - అనిత రామచంద్రన్

మెదక్ - భారతి
సంగారెడ్డి-మాణిక్ రాజ్
సిద్దిపేట్- వెంకట్రామరెడ్డి

హైదరాబాద్- రాహుల్ బొజ్జా
రంగారెడ్డి- రఘునందన్ రావు
మేడ్చల్ (మల్కాజిగిరి) - ఎంవీరెడ్డి
వికారాబాద్ - దివ్య

మహబూబ్ నగర్- రోనాల్డ్ రోస్
నాగర్ కర్నూలు - శ్రీధర్
జోగులాంబ - రజత్ కుమార్ షైనీ
వనపర్తి - శ్వేతామహంతి

కమీషనర్లు, డీసీపీలు
వరంగల్ కమిషనర్- అకున్ సబర్వాల్
కరీంనగర్ కమిషనర్- కమలహాసన్ రెడ్డి
సెంట్రల్ జోన్ డీసీపీ- జ్యోయల్ డెవిస్
సిద్దిపేట్ కమిషనర్- శివకుమార్
నిజామాబాద్ కమిషనర్ -కార్తీకేయ
మాదాపూర్ డీసీపీ- విస్సా ప్రసాద్
రామగుండం కమిషనర్- విక్రజిత్ దుగ్గల్
ఖమ్మం కమిషనర్-షానవాజ్ ఖాసీం
శంషాబాద్ డీసీపీ- పద్మజారెడ్డి


జిల్లాల ఎస్పీలు
సూర్యాపేట ఎస్పీ - పరిమళ నూతన్
నల్లగొండ- ప్రకాశ్ రెడ్డి
యాదాద్రి- యాదగిరి
సిరిసిల్ల - విశ్వజిత్
నిర్మల్- విష్ణు వరియార్
మెదక్- చందన దీప్తి
కొత్తగూడెం- అంబర్ కిషోర్ ఝా
కామారెడ్డి-
జగిత్యాల- అనంత్ శర్మ
ఆదిలాబాద్- శ్రీనివాస్
వనపర్తీ జిల్లా ఎస్పీ- రోహిణి
నాగర్ కర్నూల్- సింగన్ వార్
ఆసిషాబాద్- సన్ ప్రీత్ సింగ్
ఆచార్య జయశంకర్ జిల్లా- భాస్కర్
గద్వాల జిల్లా ఎస్పీగా- విజయ్ కుమార్






కొత్త జిల్లాలకు ఇంటర్ విద్యాధికారులు


హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఇంటర్ విద్యాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కరీంనగర్, జగిత్యాల- ఎల్ సుహాసిని
మంచిర్యాల, పెద్దపల్లి- ప్రభాకర్ దాసు
సిరిసిల్ల-రామచందర్
ఆదిలాబాద్, నిర్మల్, ఆసీఫాబాద్- బి. నాగేందర్
నిజామాబాద్, కామారెడ్డి-ఓదెన్న
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్- కేవీ ఆనంద్
మహబూబాబాద్, భూపాలపల్లి-ఎస్ కే అహ్మద్
జనగామ-వై. శ్రీనివాస్
ఖమ్మం, కొత్తగూడెం- ఆండ్రూస్
సూర్యపేట- ప్రకాష్ బాబు
నల్లగొండ, యాదాద్రి- హన్మంతరావు
హైదరాబాద్-కాదీనాథ్
శంషాబాద్-మహమూద్ అలీ
మహబూబ్‌నగర్, వికారాబాద్- విజయలక్ష్మీ
మల్కాజ్‌గిరి- ప్రభాకర్
వనపర్తి, నాగర్ కర్నూల్- సుధాకర్
సంగారెడ్డి- కిషన్
సిద్ధిపేట, మెదక్- నాగమునికుమార్