Saturday, April 30, 2022

కొత్త పెన్షన్ దారులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త

 

కొత్త పెన్షన్‌ దారులకు కేసీఆర్‌ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కర్ణాటకలో బీజేపీ రూ.600 ఇస్తున్నారు… కేసీఆర్ గారు మనకు రూ .200 ను రూ 1000 చేశారని హరీష్‌ రావు అన్నారు.

ఆ తర్వాత 2016 రూపాయలు చేసారు. రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు వస్తాయని… 57 ఏళ్లు పూర్తయిన వారికి పెన్షన్ ఇస్తామని ప్రకటన చేశారు హరీష్‌ రావు. బాన్సువాడలో 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి హరీష్‌ రావు భూమిపూజ చేశారు.

ఈ సందర్బంగా స్పీకర్ పోచారంను అంకుల్ అంటూ సంబోదిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి హారీష్ రావు..పోచారం లక్ష్మీపుత్రుడు అని కొనియాడారు. పోచారం మాకు మార్గదర్శి. రాజకీయంగా సుదీర్ఘ అనుభం ఉన్న నేత అని తెలిపారు. నియోజకవర్గ అభివ్రుద్దిపై దూరద్రుష్టి ఉన్న నేత పోచారందని.. డబుల్ బెడ్ రూంల నిర్మాణంలో పోచారం ముందు వరస లో ఉన్నారని వెల్లడించారు.