Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Wednesday, August 2, 2023

TSPSC Group 1 Prelims రిజల్ట్స్‌ వెల్లడికి కసరత్తు.. బుధ లేదా గురువారాల్లో..

 


TSPSC Group 1 Prelims Results 2023 : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న తెలంగాణ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ (TSPSC) ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటివారం నుంచి ఫలితాలను వెల్లడించేలా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు న్యాయపరమైన అడ్డంకుల్లేని నోటిఫికేషన్లకు వారంలోగా ప్రశ్నపత్రాల ఫైనల్‌ కీ వెల్లడించి.. 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలు ప్రకటించనుంది. వరుసగా ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. TSPSC Group 1 ప్రిలిమినరీ పరీక్ష.. ప్రిలిమినరీ కీపై ఇప్పటికే అభ్యంతరాల్ని పరిశీలించిన కమిషన్‌.. ఫైనల్‌ కీని బుధ లేదా గురువారాల్లో ప్రకటించే అవకాశం ఉంది.

TSPSC Group 1 Results 2023 వెల్లడికి కసరత్తు:
టీఎస్పీఎస్సీ ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, ఉద్యానాధికారులు, లైబ్రేరియన్లు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల ఫలితాలు త్వరలోనే వెల్లడవ్వనున్నాయి. ఇందులో కొన్ని పోస్టులకు ఫైనల్‌ కీ ఇప్పటికే వెల్లడయ్యాయి. ఏఈఈ పోస్టులకు త్వరలో ఫైనల్‌ కీ వెల్లడించాలని TSPSC కమిషన్‌ భావిస్తున్నట్లు సమాచారం. TSPSC Group 1 పరీక్ష.. ప్రిలిమినరీ కీపై ఇప్పటికే అభ్యంతరాల్ని పరిశీలించిన కమిషన్‌.. బుధ లేదా గురువారాల్లో ప్రకటించాలని భావిస్తోంది.

TSPSC Group 1 Results 2023 - ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తేనే :
టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 ఫలితాలను వెల్లడించడానికి ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలి. గ్రూప్‌-1 ప్రిలిమినరీ తుది కీ ఇచ్చిన 15 రోజుల్లో ఫలితాలు ప్రకటించాలని కమిషన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు కొన్ని న్యాయ వివాదాలు అడ్డంకిగా మారాయి. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో రిజర్వేషన్లను జీవో నెం. 55 ప్రకారం అమలు చేయడంపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణ స్థానికతపై న్యాయవివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి.

 

 

 

Monday, May 22, 2023

Kerala Story - 2023 Movie

 

The Kerala Story is a 2023 Indian Hindi-language drama film directed by Sudipto Sen and produced by Vipul Amrutlal Shah. It stars Adah Sharma, Yogita Bihani, Sonia Balani, and Siddhi Idnani. The plot follows a group of women from Kerala who are coerced into converting to Islam, and go on to join the Islamic State of Iraq and Syria (ISIS). The film is premised on the conspiracy theory of "love jihad", and falsely claims thousands of women from Kerala to have been converted to Islam and recruited into ISIS.

The film was released on 5 May 2023 and received mixed reviews from critics. Some praised the film's performances and its message, while others criticized its sensationalized portrayal of the issue of forced religious conversion. The film was also the subject of controversy, with some accusing it of promoting Islamophobia.

Despite the controversy, The Kerala Story was a commercial success, grossing over ₹200 crore at the box office. The film's success has been attributed to its timely release, as well as its focus on a sensitive issue that is of concern to many Indians.

The film's success has also led to a debate about the issue of forced religious conversion in India. Some have argued that the film's portrayal of the issue is accurate, while others have argued that it is exaggerated and sensationalized. The debate is likely to continue, as the issue of forced religious conversion is a complex one that is not easily resolved.

Here are some of the reviews of the film:

"The Kerala Story is a powerful and moving film that shines a light on a dark and disturbing issue. The film's performances are top-notch, and its message is important. I highly recommend it." - The Hindu
"The Kerala Story is a well-made film that is both entertaining and thought-provoking. It is a must-see for anyone who is interested in the issue of forced religious conversion." - The Indian Express
"The Kerala Story is a sensationalized and Islamophobic film that does more harm than good. It is a shame that such a film has been made, and I urge people to avoid it." - The Wire
The Kerala Story is a controversial film that has sparked a debate about the issue of forced religious conversion in India. The film's success has also led to increased awareness of the issue, which is a positive development
 
 Tags: kerala story kerala story release kerala story release date kerala story ott kerala story movie download kerala story duration kerala story review kerala story supreme court kerala story director kerala story movie near me kerala story advance booking kerala story actress name kerala story actress kerala story available on kerala story age limit kerala story actors kerala story amazon prime kerala story adah sharma kerala story age kerala story abp news a real story in english a real story in hindi a real story movie adah sharma kerala story a real story about life a real story about cyberbullying the kerala story actress story of parasurama and kerala kerala story bookmyshow kerala story box office collection kerala story budget kerala story booking kerala story ban kerala story boycott

The 2000-rupee note is the highest denomination of currency note in India

 


The 2000-rupee note is the highest denomination of currency note in India. It was introduced on 8 November 2016 by the Reserve Bank of India (RBI) as part of the government's demonetization exercise aimed at curbing corruption, black money, and counterfeit currency. The note is magenta in color and has the image of the Mars Orbiter Mission on the reverse. It has a number of security features, including a watermark, a security thread, and a holographic strip.

The 2000-rupee note was initially met with some resistance from the public, who were accustomed to using lower denomination notes. However, the note has since become widely accepted and is now used for a variety of transactions.

In May 2023, the RBI announced that it would be withdrawing the 2000-rupee note from circulation. The note will remain legal tender until 30 September 2023, after which it will no longer be accepted as a form of payment. The RBI has said that the decision to withdraw the note is part of its "Clean Note Policy" that aims to ensure availability of good quality banknotes for the public.

The withdrawal of the 2000-rupee note is likely to have a significant impact on the Indian economy. The note is currently used for a significant portion of all transactions in India. Its withdrawal is likely to lead to an increase in the use of lower denomination notes, which could make it more difficult for businesses to make large payments. Additionally, the withdrawal of the note could lead to an increase in the use of electronic payments, which could have a positive impact on the Indian economy by reducing the use of cash.

The withdrawal of the 2000-rupee note is a significant decision by the RBI. It remains to be seen how the decision will impact the Indian economy in the long term.

Tags: highest denomination ighest denomination currency highest denomination casino chip highest denomination coin us highest denomination coin in the world highest denomination currency note in the world highest denomination currency note in the world 2023 highest denomination currency note in the world ever highest denomination currency note in the world 2023 currency with highest denomination India currency highest denomination country with highest denomination currency India money highest denomination India dollar highest denomination country with the highest denomination current highest denomination us currency coin highest denomination

Sunday, July 10, 2022

Ration Card మీరు కొత్త రేషన్‌కార్డు కోసం అప్లై చేసుకున్నారా.. అయితే లిస్టులో మీ పేరు ఉందో చెక్‌ చేసుకోండి

 


మీరు కొత్త రేషన్‌కార్డు కోసం అప్లై చేసుకున్నారా.. అయితే లిస్టులో మీ పేరు ఉందో చెక్‌ చేసుకోండి. ఇందుకోసం ఆహార శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంట్లో కూర్చున్న ప్రతి వ్యక్తి తన మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా కొత్త రేషన్ కార్డు గురించి తెలుసుకోవచ్చు. కానీ ఆన్‌లైన్ జాబితాలో పేరును తనిఖీ చేసే విధానం చాలా మందికి తెలియదు. ఇది ఏ విధంగా తనిఖీ చేయాలో తెలుసుకుందాం.

కొత్త రేషన్ కార్డు ఎవరికి వచ్చిందో ఎలా చెక్ చేసుకోవాలి?

1. ముందుగా రేషన్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి. దీని కోసం గూగుల్ సెర్చ్ బాక్స్‌లో nfsa.gov.in అని టైప్ చేయడం ద్వారా సెర్చ్‌ చేయండి.

2. తర్వాత మీరు స్క్రీన్‌పై విభిన్న సేవల ఎంపికను చూస్తారు. ఇక్కడ మెనులో రేషన్ కార్డ్స్ ఆప్షన్‌ని ఎంచుకోండి. తర్వాత రేషన్ కార్డు వివరాలు ఆన్ స్టేట్ పోర్టల్స్ ఎంపికను ఎంచుకోండి.

3. తర్వాత అన్ని రాష్ట్రాల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ రాష్ట్రం పేరు కోసం వెతకాల్సి ఉంటుంది.

4. తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల పేర్లు కనిపిస్తాయి. ఇందులో మీ జిల్లా పేరుని ఎంచుకోవాలి.

5. తర్వాత ఆ జిల్లాలోని అన్ని బ్లాక్‌ల జాబితా కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ బ్లాక్ పేరును కనుగొని దానిని ఎంచుకోవాలి.

6. తర్వాత ఆ బ్లాక్‌లో అన్ని గ్రామ పంచాయతీల జాబితా ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ మీరు మీ పంచాయతీ పేరును ఎంచుకోవాలి.

7. తర్వాత, మీరు ఎంచుకున్న పంచాయతీలో నిర్వహిస్తున్న రేషన్ దుకాణం పేరు, రేషన్ కార్డు రకం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక్కడ రేషన్ కార్డు రకాన్ని ఎంచుకోండి.

8. మీరు రేషన్ కార్డు రకాన్ని ఎంచుకున్న వెంటనే రేషన్ కార్డు లబ్ధిదారులందరి జాబితా తెరపై కనిపిస్తుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్, హోల్డర్ పేరు, తండ్రి/భర్త పేరు, యూనిట్ నంబర్ మొదలైన వివరాలు కనిపిస్తాయి. కొత్త రేషన్ కార్డు ఎవరికి వచ్చిందో ఇక్కడ తెలుసుకోవచ్చు.

 

 

Friday, June 17, 2022

అగ్నిపథ్' పథకంతో ప్రయోజనం ఎవరికి? ఇండియన్ ఆర్మీకి మేలు ఎంత? అగ్నివీర్‌లకు మేలు ఎంత?

 

 




ఈ పథకంలో భాగంగా యువకులకు నాలుగు సంవత్సరాలపాటు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం కల్పిస్తారు. ఆ తర్వాత వారికి సేవా నిధి ప్యాకేజ్ అందిస్తారు. ఈ పథకంలో ఉద్యోగం పొందిన వారిని అగ్నివీర్ అని పిలుస్తారు. యువకులలో చాలామందికి ఆర్మీలో ఉద్యోగం పొందడం ఒక కల. కానీ, గత కొన్నేళ్లుగా సైన్యంలో నియామకాలు జరగడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగ సమయంలో ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు అగ్నివీర్ లకు ఇచ్చే ప్యాకేజీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. అగ్నిపథ్ పథకాన్ని సైన్యంలో ఆధునిక, రూపాంతర దశగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. కొత్తగా నియమించే అగ్నివీర్ ల వయస్సు 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య ఉంటుందని, వారి జీతం నెలకు 30-40 వేల రూపాయల మధ్య ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. రిక్రూట్ అయిన యువతలో 25 శాతం మంది ఇండియన్ ఆర్మీలో కొనసాగుతారు. మిగిలిన వారు ఉద్యోగాన్ని వదిలేయాల్సి ఉంటుంది.
ఈ ఏడాది ప్రభుత్వం 46 వేలమంది అగ్నివీర్ లను నియమించనుంది. యువకులకు సైన్యంలో సేవలందించే అవకాశం కల్పిస్తామని, దేశ భద్రతను పటిష్టం చేసేందుకు, యువతకు సైనిక సేవలో అవకాశం కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చామని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఈ పథకం వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, సర్వీసులో ఉన్న నైపుణ్యాలు, అనుభవంతో వారికి వివిధ రంగాల్లో ఉద్యోగాలు కూడా లభిస్తాయని ఆయన అన్నారు.


*అగ్నిపథ్ పథకం గురించి క్లుప్తంగా మీరు తెలుసుకోవాల్సింది ఇదీ..*

    17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. పదో తరగతి లేదా ఇంటర్ పాసవ్వాలి.
    అర్హతలను బట్టి ఆర్మీ, వైమానిక దళం, నేవీలో పని చేయవచ్చు.
    మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల జీతం. రెండో ఏడాది నెలకు 33 వేల రూపాయల జీతం. మూడో ఏడాదిలో ప్రతి నెలా 36500 రూపాయల జీతం. నాలుగో ఏడాది నెలకు 40 వేలు జీతం.
    జీతంలో నుంచి ప్రతినెలా కొంత మొత్తాన్ని తీసుకుని కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. అలా నాలుగేళ్లలో మొత్తం 5లక్షల రెండు వేల రూపాయలు కార్పస్‌ ఫండ్‌లో జమ అవుతాయి. దీనికి మరో 5 లక్షల 2 వేల రూపాయలు అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలుపుకుని నాలుగేళ్ల తర్వాత 11.71 వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.
    సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా 48 లక్షల జీవిత బీమా ఉంటుంది. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తారు.
    సైన్యంలో ఉండగా శారీరక వైకల్యం సంభవిస్తే పరిహారం అందిస్తారు. వైకల్యం 100 శాతం ఉంటే 44 లక్షలు, 75 శాతమైతే 25 లక్షలు, 50 శాతమైతే 15 లక్షల రూపాయల పరిహారం ఇస్తారు.
    నాలుగేళ్ల తర్వాత పనితీరును సమీక్షిస్తారు. మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. వీళ్లు సైన్యంలో 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు.


*అగ్నిపథ్ తో భారత సైన్యం రూపురేఖలు మారిపోతాయా?*

ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం, యువతలో జాతీయ భావాన్ని బలోపేతం చేయడం, భారత సైన్యాన్ని యువసైన్యంగా మార్చడం, సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే యువత ఆకాంక్షను నెరవేర్చడం ఈ పథకం లక్ష్యం.

భారత సైన్యపు సంప్రదాయ స్వభావాన్ని దెబ్బతీయడంతోపాటు, సైనికుల మనోధైర్యాన్ని ప్రభావితం చేసే పొరపాటు నిర్ణయంగా ఈ పథకాన్ని కొందరు విమర్శకులు తప్పుబడుతున్నారు.

"డబ్బును ఆదా చేయడం మంచిదే కానీ రక్షణ దళాలను పణంగా పెట్టి చేయకూడదు" అని రిటైర్డ్ మేజర్ జనరల్ షియోనన్ సింగ్ అన్నారు. దీన్ని ఆయన మూర్ఖపు చర్యగా పేర్కొన్నారు.

భారత సైన్యం పై జీతం, పెన్షన్ భారాన్ని తగ్గించడమే ఈ పథకాన్ని తీసుకురావడంలో ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని చాలామంది భావిస్తున్నారు.

"మేము ఏదో చేశామని, నిర్ణయాలు తీసుకునే పార్టీగా నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది'' అని రిటైర్డ్ మేజర్ జనరల్ షెయోనన్ సింగ్ అన్నారు.
అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా భారత సైన్యాన్ని ఎలా అప్‌గ్రేడ్ చేయాలనే అంశంపై చాలా కాలంగా చర్చ సాగుతోంది.

*నిరుద్యోగానికి ఇదే మందా?*
భారత సైన్యంలో 68 శాతం పరికరాలు చాలా పాతవి, 24 శాతం పరికరాలు మాత్రమే నేటి కాలానికి చెందినవి. 8 శాతం అత్యాధునిక విభాగంలో ఉన్నాయి. దీనికి కారణం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. 2021-22 సంవత్సరంలో రక్షణ బడ్జెట్‌లో 54 శాతం జీతాలు, పెన్షన్‌ల కోసమే ఖర్చు చేయాల్సి వచ్చింది.

ఒక డేటా ప్రకారం, గత 10 సంవత్సరాలలో రక్షణ పెన్షన్‌ పై వ్యయం 12 శాతం పెరిగింది. రక్షణ బడ్జెట్‌లో సగటు పెరుగుదల 8.4 శాతమే ఉంది. రక్షణ బడ్జెట్‌లో పెన్షన్ 26 శాతానికి పెరిగి మళ్లీ 24శాతానికి తగ్గింది.

దేశంలో ఉద్యోగాలు రాకపోవడం పెద్ద సమస్యగా మారిన తరుణంలో ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వెలువడింది.

''భారతదేశంలో నిరుద్యోగం ఒక తీవ్రమైన సమస్య. ప్రజలకు అవసరమైన ఉద్యోగాలు, ఉపాధి రేటు అంత వేగంగా పెరగడం లేదు'' అని భారత ఆర్థిక వ్యవస్థను నిశితంగా పరిశీలించే సీఎంఐఈ సంస్థకు చెందిన మహేశ్ వ్యాస్ అభిప్రాయపడ్డారు.

''కోవిడ్ కాలంలో భారతదేశంలో నిరుద్యోగం రేటు 25 శాతానికి చేరుకుంది. ఇప్పుడు ఈ రేటు 7 శాతం ఉంది. పట్టణ ప్రాంతాల్లో యువతలో (15-29 ఏళ్లు) నిరుద్యోగిత రేటు చాలా కాలంగా 20 శాతానికి పైగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వచ్చే ఏడాదిన్నర కాలంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు'' అని మహేశ్ వ్యాస్ అన్నారు.

*మంచి పథకమా, చెడ్డ పథకమా?*
''భారత సైన్యంలో నాలుగేళ్ల పాటు పనిచేయడం అంటే చాలా తక్కువ సమయం. నిజంగా ఇది మంచి ఆలోచన అయితే, దీన్ని దశలవారీగా అమలు చేయాలి. ఇంత తక్కువ సమయంలో ఒక యువకుడు సైన్యంతో ఎలా కనెక్ట్ అవుతాడన్న ఆందోళన కూడా ఉంది'' అని రిటైర్డ్ మేజర్ జనరల్ షియోనన్ సింగ్ అన్నారు.

''నాలుగేళ్లలో ఆర్నెల్లు ట్రైనింగ్ లోనే ఉండాలి. ఆ తర్వాత పదాతి దళం, సిగ్నల్స్ వంటి విభాగాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీటికోసం వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయుధాలను ఉపయోగించడానికి వారికి సరైన జ్ఞానం, అవగాహన ఉండాలి'' అని సింగ్ అభిప్రాయపడ్డారు.

''అగ్నిపథ్ పథకంలో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌ కాలేడు. గ్రౌండ్స్‌మెన్‌ అవుతాడు.. మెకానిక్‌ అవుతాడు.. వర్క్‌షాప్‌కి వెళ్తాడు. కేవలం నాలుగేళ్లలో ఏం నేర్చుకుంటాడు?
అనుభవం ఉన్న సైనికుడితో కొత్తగా నియమితుడైన సైనికుడు యుద్ధానికి వెళితే, సీనియర్ మరణించినప్పుడు కేవలం నాలుగేళ్ల ట్రైనింగ్ తో ఆ వ్యక్తి స్థానాన్ని భర్తీ చేయగలడా?'' అని సింగ్ ప్రశ్నించారు.
భారత దేశానికి యుద్ధం కంటే తిరుగుబాటు లేదా దేశద్రోహం వల్ల ముప్పు ఉందని, దీనిని ఎదుర్కోవడానికి అనుభవజ్ఞుడైన, పరిణతి చెందిన మనసున్న వ్యక్తులు అవసరమని సింగ్ అన్నారు.
అయితే, ప్రభుత్వ నిర్ణయం భారత సైన్యానికి మేలు చేస్తుందని రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్.బి. అస్థానా అన్నారు.
''ఐటీఐ నుంచి యువకులను తీసుకుంటే టెక్నికల్‌గా బాగుంటారు. సీనియర్లు, వృద్ధులు టెక్నికల్‌ పనిలో సమర్ధంగా పని చేయలేకపోవచ్చు. టెక్నాలజీలో ఈ తరం మరింత సత్తా చాటుతోంది. ఈ ప్రణాళికలో సైన్యానికి బాగా ఉపయోగపడే 25 శాతం మంది సైనికులను తమతోనే ఉంచుకోవడం, మిగిలిన వారిని వదిలేయడం వల్ల సైన్యానికి మేలు కలుగుతుంది'' అని అస్థానా అన్నారు.
"ప్రస్తుతం మన వ్యవస్థలో ఒక జవాన్‌ ను చేర్చుకున్నాక, అతను సరిగా పని చేయడం లేదని భావిస్తే, అతని పై క్రమశిక్షణా రాహిత్యం లేదా అసమర్థత కేసు పెట్టకపోతే అతనిని తొలగించలేం" అని అస్థానా అన్నారు.

*పథకంలో ఎంపికైన వారి భవిష్యత్తు ఏంటి ?*
సైన్యంలో శిక్షణ పొంది పని చేసి వచ్చిన 21 ఏళ్ల నిరుద్యోగ యువకుడు తన శిక్షణను దుర్వినియోగం చేసి, సమాజానికి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని 'అగ్నిపథ్' పథకాన్ని విమర్శించే కొందరు చెబుతున్నారు.
టెన్త్ లేదా ఇంటర్ వరకు మాత్రమే చదవిన 21 ఏళ్ల యువత మళ్లీ ఎలా ఉపాధి సంపాదించుకోగలదని రిటైర్డ్ మేజర్ జనరల్ షెయోనన్ సింగ్ ప్రశ్నిస్తున్నారు.


"పోలీసు రిక్రూట్‌మెంట్‌ కు బీఏ పాసయిన యువకులు వస్తున్నారు. దీనివల్ల అగ్నివీర్ లు వెనకబడాల్సి వస్తుంది. చదువు ఎక్కువగా లేకపోవడం వల్ల ప్రమోషన్‌ అవకాశాలు దెబ్బతింటాయి" అని ఆయన అన్నారు.

యువతకు 11 ఏళ్ల పాటు సైన్యంలో పని చేసే అవకాశం ఇవ్వాలని, ఎనిమిదేళ్ల తర్వాత వారు సగం పెన్షన్‌తో వెళ్లిపోయేందుకు అవకాశం కల్పించాలని షెయోనన్ సింగ్ అభిప్రాయపడ్డారు.

21 సంవత్సరాల గ్రాడ్యుయేట్ కు, అగ్నివీర్ గా పని చేసి వచ్చిన యువకుడికి మధ్య తేడా చాలా ఉంటుందని, సైన్యంలో పని చేసిన వచ్చిన యువకుడు ప్రత్యేకంగా ఉంటాడని రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్.బి. అస్థానా అన్నారు.
గ్రౌండ్ లెవెల్లో ఈ పథకం ప్రభావాన్ని పరిశీలించిన తర్వాత దాని భవిష్యత్తును నిర్ణయించాలని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ హుడా అన్నారు.

‘‘బడ్జెట్‌పై ఈ ప్లాన్ ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే ఎనిమిది నుంచి పదేళ్లు పడుతుందని, అప్పుడు డబ్బులు మిగిలినట్లు తేలితే మిలిటరీ ఆధునికీకరణకు ఖర్చు చేయవచ్చు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

"ఈ పథకం కింద, రాబోయే నాలుగేళ్లలో 1.86 లక్షల మంది సైనికులను రిక్రూట్ చేస్తారు. ఇది సైనిక బలంలో 10 శాతం అవుతుంది. ఈ నాలుగేళ్లలో ఈ ప్రణాళిక ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. యువత ఆకర్షితులవుతున్నారా లేదా వారి మానసిక స్థితి ఏమిటి అన్నదానిపై ఆధారపడి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది'' అని ఆయన అన్నారు.

*ఇజ్రాయెల్‌తో పోల్చవచ్చా?*
మోదీ ప్రభుత్వం చేపట్టిన అగ్నిపథ్‌ మోడల్ మరెక్కడా లేదని రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ ఎస్‌.బి. అస్థానా అన్నారు. ఇజ్రాయెల్‌ను అందుకు ఉదాహరణగా చెప్పారు.

ఇజ్రాయెల్‌లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి జెరూసలెంలో ఉన్న జర్నలిస్టు హరేంద్ర మిశ్రాను సంప్రదించాను.

''ఇక్కడ నిరుద్యోగ సమస్య లేదు. పైగా ఈ ట్రైనింగ్ తప్పనిసరి. దీనిని దుర్వినియోగం చేయడం జరగదు. దేశంలోని ప్రతి యువకుడు 18 సంవత్సరాల లోపు తప్పనిసరిగా శిక్షణ పొందాలి. దీనికి జీతం ఇవ్వరు. ఎందుకంటే అది ఉద్యోగం కాదు. కేవలం దేశానికి సేవచేయడంగానే భావిస్తారు. మహిళలకు రెండేళ్లు, పురుషులకు నాలుగేళ్లు ట్రైనింగ్ ఉంటుంది'' అని మిశ్రా వెల్లడించారు.

ఈ ట్రైనింగ్ సమయంలో పాకెట్ మనీ మాత్రమే ఇస్తారు. శిక్షణ తర్వాత చదువు కొనసాగించవచ్చు.

 

Thursday, May 12, 2022

'రూపాయి' భారీ పతనం.. సామాన్యుడి బతుకు మరింత భారం!

 


అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ రోజు రోజుకు దిగజారుతోంది. అమెరికా డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల కనిష్ఠ స్థాయికి చేరింది. అయితే రూపాయి క్షీణత వల్ల సామాన్యుడి బతుకు మరింత భారమవుతుంది. అసలు రూపాయి పతనానికి కారణాలేమిటి? సామాన్యుల పరిస్థితి ఏంటి? ఎఫ్​డీఐలు మరింత తగ్గనున్నాయా?

Indian Rupee Value Decrease: డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. 2020-21 నాటికి రూపాయి మారకపు విలువ అంతకుముందు ఏడాది కంటే 3.32శాతం పెరిగితే.. 2021-22 ముగిసే నాటికి ఈ విలువ 3.53శాతం మేర తగ్గింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రెండు రోజుల క్రితం సుమారు 77.44 స్థాయికి దిగజారింది. ఇది మరింత క్షీణిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మనకు స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నాటికి రూపాయి-డాలరు విలువలు సమానంగా ఉండేవి. అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్యం, ఆర్థిక చెల్లింపులు, విదేశీ పెట్టుబడులు, రుణాలు ఇవన్నీ డాలర్ల రూపంలోనే జరుగుతాయి. భారత్‌ తన అవసరాలకు అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. స్వాతంత్య్రం తరువాత కేవలం రెండేళ్లు స్వల్ప వాణిజ్య మిగులు తప్ప- విదేశీ వాణిజ్యం లోటుతోనే కొనసాగుతోంది. ఇటీవల చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో అన్ని దేశాల కరెన్సీ విలువలూ బాగా పతనమయ్యాయి. భారత్‌ విషయంలో ఆర్‌బీఐ చొరవ తీసుకుని తనవద్ద పోగుపడి ఉన్న విదేశమారక నిల్వల్లో కొంత మార్కెట్‌లో అమ్మకానికి పెట్టి- కరెన్సీ పతనాన్ని కొంతవరకు నియంత్రించగలిగింది. మార్చి మొదటి వారంలో ఉన్న 63,200 కోట్ల డాలర్ల విదేశమారక నిల్వలు 2022 ఏప్రిల్‌ ఒకటోతేదీ నాటికి 60,600 కోట్ల డాలర్లకు తగ్గాయి.

కొనసాగుతున్న అనిశ్చితి.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, చమురు ధరల జోరు, అమెరికా వడ్డీ రేట్లను పెంచడంవంటి పరిణామాలు ఇటీవల మన రూపాయి పతనానికి ప్రధాన కారణాలు. కొన్నాళ్ల క్రితం 20 డాలర్లకే లభించిన ముడిచమురు పీపా- ఇటీవల అమాంతంగా ధర పెరిగి 130 డాలర్ల స్థాయికి చేరి, ఇప్పుడు 103-105 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఎగుమతుల కన్నా దిగుమతుల విలువ ఎక్కువగా ఉంటే వాణిజ్యలోటు ఏర్పడుతుంది. వాణిజ్యలోటు పెరిగినంత కాలం రూపాయి పతనమవుతునే ఉంటుంది. 2021-22లో భారత ఎగుమతులు 41,700 కోట్ల డాలర్లకు చేరాయి. అంతకుముందు ఏడాది ఎగుమతుల విలువ 29,100కోట్ల డాలర్లు. ఏడాది కాలంలో ఎగుమతులు 43.18శాతం మేర పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ఓ చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు.

 

నిజానికి అదే కాలంలో మన దిగుమతులు 39,400కోట్ల డాలర్ల నుంచి 61,000కోట్ల డాలర్లకు పెరిగాయి. ఫలితంగా 19,241కోట్ల డాలర్ల వాణిజ్యలోటు ఏర్పడి- రూపాయి పతనానికి దారితీసింది. ప్రపంచ వృద్ధిరేటు మందగిస్తున్న నేపథ్యంలో 2022-23లో ఎగుమతుల్లో జోరు నెలకొంటుందా అనేది సందేహాస్పదమే. యుద్ధం, కరోనా సంక్షోభం ఇంకా కొనసాగుతుండటం వంటి ప్రతికూలతలు సందేహాలకు మరింత ఉతమిస్తున్నాయి. ఈ పరిస్థితి వల్ల వాణిజ్యలోటు మరింత పెరిగి రూపాయి ఇంకా పతనం కావచ్చు. భారత్‌ తన ముడి చమురు అవసరాల్లో 85శాతం దిగుమతుల పైనే ఆధారపడుతోంది. దేశ మొత్తం దిగుమతుల్లో ముడి చమురు వాటా సుమారు 28శాతం. రష్యా యుద్ధంపై అనిశ్చితి కొనసాగినన్నాళ్లూ చమురు ధరలూ దిగివచ్చే పరిస్థితి లేదు. రాబోయే రెండు త్రైమాసికాల్లోపు చమురు ధరలు దిగిరాకపోతే భారత్‌ భారీగా వాణిజ్యలోటును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన దిగుమతుల్లో మూడోస్థానం బంగారానిది. అంతర్జాతీయ విపణిలో తాజాగా ఔన్సు బంగారం ధర 1,840 డాలర్ల స్థాయిలో ఉండగా.. రాబోయే రోజుల్లో ఇది 2,100 డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా. అదే జరిగితే దిగుమతుల బిల్లు మరింత పెరిగి, తద్వారా వాణిజ్య లోటు ఇంకా ఎగబాకుతుంది.

సామాన్యుడిపై ప్రభావం.. రూపాయి క్షీణతవల్ల సామాన్యుడి బతుకు భారమవుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు సేవలకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విదేశాల నుంచి దిగుమతయ్యే వంటనూనె, పప్పుదినుసులకూ అధిక ధరలు చెల్లించాలి. అంతర్జాతీయ వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి, సరఫరా చేసిన దేశానికి డాలర్లలోనే చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే ఈ చెల్లింపుల కోసం ఎక్కువ వ్యయమవుతుంది. తమ వస్తువులను, సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే రంగాలు మాత్రం క్షీణించిన కరెన్సీవల్ల లబ్ధి పొందుతాయి. భారత ఐటీ, ఫార్మా రంగాలకు ఈ పరిస్థితివల్ల ప్రయోజనం చేకూరుతుంది. ముడి సరకుల్లో అత్యధిక భాగం దిగుమతి చేసుకునే పరిశ్రమలు కరెన్సీ క్షీణత వల్ల దెబ్బతింటాయి. ఫలితంగా ఉత్పత్తి ధర పెరిగిపోతుంది. ఇతర దేశాలకు విహారయాత్రలకు వెళ్లాలంటే అధికంగా ఖర్చవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులపై భారం పెరుగుతుంది.

విదేశీ విద్య కోసం బ్యాంకుల్లో రుణం తీసుకునేవారిమీదా భారం అధికమవుతుంది. ఒకవేళ రూపాయి విలువ పెరిగితే అప్పు తీర్చడం సులువవుతుంది. విదేశాల్లో ఇతర ఖర్చుల కోసం స్వదేశీ కరెన్సీని అధికంగా చెల్లించాల్సి వస్తుంది. మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాలు రూపాయి క్షీణతతో ప్రియమవుతాయి. వాటి విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడమే ఇందుకు కారణం. రూపాయి క్షీణతవల్ల ఎక్కువగా లబ్ధిపొందేది ప్రవాస భారతీయ కుటుంబాలు. ఎందుకంటే మారకంలో ఒక డాలరుకు ఎక్కువ రూపాయలు అందుతాయి. తాజాగా డాలరు ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. రష్యాపై అమెరికా, ఐరోపా సమాఖ్య ఆంక్షల వల్ల కొన్ని దేశాలు తమ విదేశీ చెల్లింపులు ఇకపై డాలర్ల రూపేణా కాకుండా తమ స్వదేశీ కరెన్సీ ద్వారా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ముఖ్యంగా రష్యాకు వాణిజ్య చెల్లింపుల విషయంలో భారత్‌, చైనా, సౌదీ అరేబియాలు సహా చాలా దేశాలు ఈ మేరకు వ్యూహాలను మార్చుకొంటున్నాయి. గతంలో అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించినప్పుడు భారత్‌ ఆ దేశానికి రూపాయల్లోనే చెల్లింపులు చేసింది. ఈ విధానం మిగతా అన్ని దేశాల్లోనూ కార్యరూపం దాలిస్తే డాలరు తన ప్రాభవాన్ని కోల్పోవడం ఖాయం!

తగ్గుతున్న ఎఫ్‌డీఐలు.. గడచిన ఏడాది కాలంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లు క్రమేపీ తగ్గుతున్నాయి. చమురు, బంగారం దిగుమతులతో భారీగా పెరిగిన వాణిజ్యలోటు, మందగించిన విదేశీ పెట్టుబడులు కలిసి కరెంట్‌ ఖాతా లోటు 2021 ఏప్రిల్‌-డిసెంబరు కాలానికి జీడీపీలో 1.2శాతం స్థాయికి చేరింది. అంతకుముందు ఏడాది ఇది మిగులుతో ఉండటం గమనార్హం. విదేశీ సంస్థాగత పెట్టుబడులపై ఆశపెట్టుకోవడం సరైంది కాదు. ఎందుకంటే అమెరికా తన వడ్డీరేటు పెంచితే, ప్రపంచంలో ఎక్కడున్నా తక్షణం ఈ పెట్టుబడులు అక్కడికి వెళ్లిపోతాయి. అందుకే వీటిని 'బటర్‌ ఫ్లై' పెట్టుబడులంటారు.

- భరత్‌ సాయి

 

గురక శబ్ధంతో వీడిన వ్యభిచార ముఠా గుట్టు.. పోలీసులే షాక్‌ తిన్నారు

 


 అప్పట్లో.. రాజులు యుద్ధాల సమయంలో శత్రు రాజ్యాలకు భయపడి రహస్య గదులను ఏర్పాటు చేసుకోవడం గురించి చరిత్రలో చదివి ఉంటాం.  సాధారణంగా.. ఐటీ రైడింగ్‌లకు భయపడి డబ్బును గోడల్లోనో, సీక్రెట్‌ గదుల్లోనూ, వాటర్‌ ట్యాంక్‌ల్లోనో దాచడం చూస్తుంటాం. అలాగే డబ్బు, నగలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు భద్రపరిచే సీక్రెట్ రూమ్ చూసి ఉంటాం. కానీ, టాయిలెట్‌లో రహస్య గది ఒకటి ఏర్పాటు చేసుకుని.. అందులో గుట్టుగా వ్యభిచారం సాగించే ముఠా ఓ ముఠా వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. 

ఈమధ్యకాలంలో ఇతర రాష్ట్రాల వ్యభిచార ముఠాల వ్యవహారాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకర్లు.. పోలీసుల కళ్లు గప్పేలా అతితెలివి ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. చిత్ర‌దుర్గ‌లోని ఓ చోట వ్య‌భిచారం చేస్తున్న‌ట్లు పక్కా స‌మాచారం అందుకుని స్పెషల్‌ టీం రైడ్‌కు వెళ్లింది. అయితే ఆ సమయంలో గదుల్లో వెతికినా ఏం కనిపించలేదు. దీంతో పోలీసులు ఘటనా స్థలంలోని బాత్‌రూమ్‌ను పరిశీలించగా..  ఒకచోట నుంచి గురక శబ్దం వినిపించింది. 


 

శబ్ధం ఎటువైపు వస్తుందోనని పరిశీలించిన ఓ అధికారికి.. టైల్స్‌ నుంచి రావడం వినిపించింది. అనుమానంతో ఆయన టైల్స్‌పై చెయ్యి వేయగానే.. అది కాస్త పక్కకు జరిగింది. దీంతో లోపల ఏర్పాటు చేసిన ఒక చిన్న గది బయటపడింది. పోలీసులు గదిని తెరిచి చూడగా.. అందులో ఒక చిన్న సెల్లార్ ఏర్పాటు చేశారు. అలా మొత్తం మూడు వ్యభిచార గృహాలు, ఒక క్లయింట్, ఒక బ్రోకర్ పట్టుబడ్డారు. బయట చూడ్డానికి మామూలు ప్రదేశమే అనిపించినా టాయిలెట్ లోపల ఇలా వ్యభిచార గృహం ఉండడం షాక్ కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతోంది.

 

 

Wednesday, May 4, 2022

ముషారఫే మోకరిల్లాడు.. నువ్వెంత.. మంత్రి కేటీఆర్‌పై కేఏ పాల్

 


సిద్దిపేటలో కేఏ పాల్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన మరింత రెచ్చిపోతున్నారు. స్వతహాగానే పాల్ అంటే కోపం, అసహనం ఎక్కువే.. ఇప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. తాను అంతర్జాతీయ మత ప్రబోధకుడినని చెబుతూనే.. తన ముందు నియంతలే మోకరిల్లారని గుర్తుచేశారు. అలాంటిది మీరెంత అని కామెంట్ చేశారు.

 

Tuesday, May 3, 2022

ప్రియునితో భార్య రాసలీలలు.. అత్త ఛాలెంజ్‌.. ఆ అల్లుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని

 

 


 ములుగు జిల్లా: ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగం రీత్యా వేర్వేరుగా ఉంటున్నారు. ఆ ఎడబాటు కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. భార్యపై అనుమానంతో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అనుమానం కాదు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నిరూపించాలని భార్య, ఆమె తల్లితో పాటు పెద్ద మనుషులు సూచించారు. దీంతో భర్త నిఘా పెట్టి భార్య బండారాన్ని బయట పెట్టాడు.
 

ములుగు జిల్లాలోని  దొడ్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చీమల సుమలత, చర్ల కార్యదర్శిగా పనిచేసే పాయం పురుషోత్తం ప్రేమించుకున్నారు. గత 8 ఏళ్ల క్రితం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగాల రిత్యా సుమలత చిన్నబోయినపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుండగా.. పురుషోత్తం చర్లలో ఉంటున్నాడు. అయితే.. ఇటీవల భార్య-భర్తల మధ్య ఏర్పడిన అనుమానం.. గొడవలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తన ఇంటర్ క్లాస్‌మెంట్‌ లింగరాజుతో సుమలత సన్నిహితం పెంచుకుంది. దీంతో భర్త పురుషోత్తం అనుమానం మరింత పెరిగింది.

ప్రవర్తన మార్చుకోవాలని.. పలు మార్లు భార్యను హెచ్చరించాడు.. భర్త పురుషోత్తం. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలోనే పంచాయితీ పెట్టించాడు. ఆ సమయంలో సుమలత తల్లి సూటిపోటి మాటలతో పురుషోత్తంని నిందించి, అనుమానం కాదు అవసరమైతే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నిరూపించాలని సూచించింది. పురుషొత్తం భార్యపై నిఘా పెట్టి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సాపూర్‌లోని ఓ ఇంట్లో సుమలత, లింగరాజుతో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ తర్వాత గ్రామ పెద్దలు, సుమలత కుటుంబ సభ్యుల సమక్షంలోనే వారిని పోలీసులకు అప్పగించిన్నట్లు భర్త పురుషోత్తం తెలిపారు.

 

Saturday, April 30, 2022

తాగొచ్చి కొడుతున్నాడని భర్తను హతమార్చిన భార్య

 పెద్దపల్లి: కట్టుకున్న భర్తను ఇటుక పెల్లతో బాది హతమార్చిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం మద్యం మత్తులో విలేజ్‌ రామగుండం గ్రామానికి చెందిన కల్లెడ మల్లేశం (42) తలపై భార్య స్వరూప సిమెంట్‌ ఇటుక పెల్లతో బలంగా బాదంది.
ఈ ఘటనలో భర్త మల్లేశం అక్కడికక్కడే మృతి చెందాడు. గత కొన్నేళ్లుగా మల్లేశం మద్యానికి బానిసై ప్రతిరోజు భార్యను చిత్రహింసలు పెట్టేవాడని స్థానికులు పేర్కొన్నారు. గురువారం రాత్రి సైతం ఇంట్లో గొడవ జరగడంతో స్వరూప తల్లిగారింటికి వెళ్లి తలదాచుకొని శుక్రవారం ఉదయం వచ్చిందని తెలిపారు. రాగానే స్వరూపతో మల్లేశం మళ్లీ గొడవకు దిగడంతో క్షణికావేశంలో సిమెంట్ ఇటుకతో హతమార్చినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న 1 టౌన్ సీఐ రాజ్ కుమార్, 2 టౌన్ ఎస్ఐ శరణ్య, అంతర్గాం ఎస్ఐ శ్రీధర్ సంఘటనా స్థలానికి చేరుకొని. పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

బీజేపీని ఓడించాలంటే సెకండ్ ఫ్రంటే కరెక్ట్ : ప్రశాంత్ కిశోర్‌

 

బీజేపీని ఓడించడం థర్డ్‌, ఫోర్త్ ఫ్రంట్‌తో కుదిరే పని కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. అయితే ఆ ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్ స్థాయికి ఎదిగితే ఈజీగా బీజేపీని ఓడించ వచ్చని ఆయన సూచించారు.

ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పీకే పై వ్యాఖ్యలు చేశారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో తృణమూల్‌ను థర్డ్‌ఫ్రంట్ గా ముందు పెట్టి, బీజేపీని ఓడిస్తారా? అని ప్రశ్నించగా..

అది కుదిరే పనికాదు. థర్డ్ ఫ్రంట్‌, ఫోర్త్ ఫ్రంట్ ఈ దేశంలో గెలుస్తుందని నేను నమ్మను. ఒకవేళ బీజేపీని మనం ఫస్ట్ ఫ్రంట్‌గా భావిస్తే, సెకండ్ ఫ్రంట్‌గా ఎదిగిన వారు బీజేపీని ఓడిస్తారు. బీజేపీని ఎవరైనా ఓడించాలంటే వారు సెకండ్ ఫ్రంట్ స్థాయికి ఎదగాల్సిందే అంటూ పీకే స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ను సెకండ్ ఫ్రంట్‌గా భావిస్తారా? అని ప్రశ్నించగా.. నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. కాంగ్రెస్ అనేది దేశంలో అతిపెద్ద రెండో పార్టీ అంటూ అభివర్ణించారు.

Sunday, April 17, 2022

మళ్లీ తెరపైకి ఏలియన్ల ఊసు.. అది గ్రహాంతరవాసుల ముద్రేనా?

 


గ్రహాంతరవాసుల ఉనికిపై మరోసారి అమెరికా వరుస ప్రకటనలకు దిగుతోంది. అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(National Aeronautics and Space Administration).. గ్రహాంతరవాసుల జాడకు సంబంధించిందిగా చెప్తూ ఓ ఫొటోను రిలీజ్‌ చేసింది. తాజాగా యూఎస్‌ స్పేస్‌ కమాండ్.. 2014లో భూమిని ఢీ కొట్టిన ఓ ఉల్కను.. ఇంటర్ స్టెల్లర్‌గా ధృవీకరించింది. ఈ మేరకు పెంటగాన్‌ సైతం ప్రకటన చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాసా సైతం ఓ మిస్టరీ ఫొటోను విడుదల చేసి.. ఏలియన్ల ఉనికిపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

అంగారక గ్రహాంపై గుర్తు తెలియని ముద్రలకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ రిలీజ్‌ చేయగా.. అది ముమ్మాటికీ ఏలియన్లకు సంబంధించిందేనన్న చర్చ ఊపందుకుంది. మార్టిన్ క్రేటర్‌లోని ఆ గుర్తుల్ని హైరెజల్యూషన్‌ ఇమేజింగ్‌ ద్వారా క్యాప‍్చర్‌ చేసింది నాసా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేయగా.. ఫాలోవర్ల మధ్య జోరుగా చర్చ నడుస్తోంది.

ఏలియన్ల ఉనికి తెలుస్తుందా?
2017లో భూమిని తాకిన ఓ శకలాన్ని.. ‘ఒయూమువామువా’గా నామకరణం చేశారు. సాంకేతిక పరిశోధనలతో.. అది ఇంటర్‌ స్టెల్లర్‌(నక్షత్రాల మధ్య) ఆబ్జెక్ట్‌గా తేలింది. అయితే.. అంతకంటే ముందే 2014 జనవరిలో ఓ ఉల్క భూమిని తాకింది. తాజాగా దీనిని కూడా ఇంటర్‌ స్టెల్లర్‌ ప్రాజెక్టుగానే ధృవీకరించింది అమెరికా స్పేస్‌ కమాండ్‌. మరో సౌర వ్యవస్థ నుంచి దూసుకొచ్చిన ఈ స్పేస్‌ రాక్‌ను హార్వార్డ్‌ ఖగోళ పరిశోధకులు అమీర్‌ సిరాజ్‌, అబ్రహం లియోబ్‌లు పరిశోధనలు జరిపి.. ఇంటర్‌ స్టెల్లర్‌ ఆబ్జెక్ట్‌గా నిర్ధారించారు. దీంతో 2017లో భూమిని తాకిన ‘ఒయూమువామువా’ను రెండో ఇంటర్‌ స్టెల్లర్‌ ఆబ్జెక్ట్‌గా తేల్చినట్లు అయ్యింది.

 

    
  
అటువంటి ఇంటర్‌ స్టెల్లర్(నక్షత్రాల మధ్య) శకలాలు.. గ్రహాంతర జీవుల ఉనికిని ఇతర ప్రాంతాలకు మోసుకెళ్తాయని పరిశోధకులు నమ్ముతారు. ఇంటర్‌ స్టెల్లర్‌ మెటోర్స్‌ అనేవి ఇతర గ్రహాల వ్యవస్థ, అక్కడి ప్రాణుల ఉనికిని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు విశ్వంలో జీవరాశి(పాన్‌స్పెర్మియా) గురించి తెలియజేసేందుకు మధ్యవర్తిత్వం లాగా అవి పని చేస్తాయని అబ్రహం లోయిబ్‌ అంటున్నారు. అయితే.. 2014 ఉల్క సంగతి ఏమోగానీ.. ఒయూమువామువా మాత్రం ఆస్టరాయిడ్‌ అనడం కంటే.. ఏలియన్‌ టెక్నాలజీకి సంబంధించిన వస్తువుగా దాదాపు నిర్ధారణ అయినట్లు చెప్తున్నారు. హాలీవుడ్‌లో ఇంటర్ స్టెల్లర్ మూవీ.. అదే ఏడాది నవంబర్‌లో రిలీజ్‌ కావడం కొసమెరుపు.

 

 

Wednesday, March 23, 2022

Gold Silver Price Today: భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

 


 

Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిచ్చే బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇక ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధాల (Ukraine-Russia War) కారణంగా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం (March 23) బంగారం, వెండి ధరలు మరింతగా పెరిగాయి. 10 గ్రాముల ధరపై రూ.350కిపైగా పెరిగింది. కాగా, బంగారం (Gold), వెండి (Silver) ధరల్లో రోజులో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది. తాజాగా దేశీయంగా ధరల (Rate) వివరాలు ఇలా ఉన్నాయి.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
 

చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,280 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,670 వద్ద నమోదవుతోంది.
 

ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 వద్ద ఉంది.
 

ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధరలు రూ.52,100 ఉంది.
 

కోల్‌కతా: 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,100 ఉంది.
 

బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,100 ఉంది.
    

హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 వద్ద ఉంది.

 విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 ఉంది. 

కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 వద్ద ఉంది.



వెండి ధరలు:

ఇక బంగారం లాగే వెండి కూడా పరుగులు పెడుతోంది. దేశీయంగా కిలో బంగారంపై 600లకుపైగా పెరిగింది.

 
చెన్నైలో కిలో వెండి ధర రూ.72,600 ఉండగా,
ముంబైలో రూ.68,300 ఉంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,300 ఉండగా,
కోల్‌కతాలో రూ.68,300 ఉంది.
ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,600 ఉండగా,
హైదరాబాద్‌లో రూ.72,600 ఉంది.
విజయవాడలో కిలో వెండి ధర రూ.72,600 ఉండగా,
 కేరళలో రూ.72,600 వద్ద కొనసాగుతోంది.

 

Sunday, March 20, 2022

తుపాకీ చేతబట్టిన తొలి మహిళ.. యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

 


తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తుపాకీ చేతబట్టిన తొలిమహిళ మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. కొద్దిరోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న స్వరాజ్యం చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే వైద్యులు మల్లు స్వరాజ్యం ఇకలేరని ప్రకటించారు. ఈనెల 2న ఆమె ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చేరారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి పోరాడిన ధీరవనిత మల్లు స్వరాజ్యం. ఆమె భౌతికకాయాన్ని ఎంబీ భవన్‌కు తరలించనున్నారు.
1945, 46 సాయుధ పోరాట సమయంలో దొరల అహంకారంపై తిరగబడ్డారు స్వరాజ్యం. నైజాం సర్కార్‌ను గడగడలాడించారు.సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో 1931 వ సంవత్సరంలో కుటుంబంలో ఆమె జన్మించారు. భూస్వాముల కుటుంబంలో పుట్టిన ఆమె నైజాం సర్కార్‌కి వ్యతిరేకంగా పోరాడారు. దొరల దురహంకారంపై తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో స్వరాజ్యం పనిచేశారు.

ఐద్వా రాష్ట్ర, జాతీయ నాయకురాలిగా ఆమె సేవలందించారు.

సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలిమహిళగా స్వరాజ్యం పేరుతెచ్చుకున్నారు. మహిళా కమాండర్‌గా పనిచేశారు. ఆమెను పట్టించిన వారికి నైజాం సర్కార్ పదివేల రివార్డు కూడా ప్రకటించింది.తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978, 1983 ఎన్నికల్లో సీపీఎం పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. నల్గొండ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. తదనంతరం ఆమె రాజకీయాల నుంచి వైదొలిగారు

 

 

Saturday, March 19, 2022

ఉక్రెయిన్ ఇలాగే ప్రతిఘటిస్తే అణ్వాయుధ ప్రయోగం తప్పదా? పెంటగాన్ నివేదిక ఏం చెబుతోంది?


 

 
రష్యా దండయాత్రకు ఉక్రెయిన్ నుంచి ఇంతే కఠినమైన ప్రతిఘటన కొనసాగి సంప్రదాయ ఆయుధాలు, మానవ వనరులు హరించుకుపోతే అణ్వాయుధాలవైపు పుతిన్ మొగ్గుచూపుతారా? పశ్చిమ దేశాలకు బెదిరింపులు తప్పవా? అంటే అవునని అంటోందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఇంటెలిజెన్స్ నివేదిక. ఇప్పటికే యుద్ధం మొదలైన తర్వాత అణ్వాయుధ బలగాలను సంసిద్ధంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అప్రమత్తం చేసిన విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించడం గమనార్హం.

‘‘ఉక్రెయిన్ భూభాగంలోని ప్రాంతాలను దీర్ఘకాలంగా ఆక్రమించడం వల్ల రష్యా సైనిక బలగం తగ్గిపోతుంది.. వారి ఆయుధగారంలోని ఆధునీకరించిన ఆయుధాలు తరిగిపోతాయి.. ఇదే సమయంలో ఆర్థిక ఆంక్షలు రష్యాను దీర్ఘకాలిక ఆర్థిక మాంద్యం, దౌత్యపరమైన ఒంటరితనంలోకి నెట్టివేస్తాయి’’ అని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెరియర్ తన నివేదికలో పేర్కొన్నారు.

‘‘ఉక్రెయిన్ ధిక్కరణ, ఆర్థిక ఆంక్షలు వెరసి రష్యా ఆధునిక ఖచ్చితత్వ-గైడెడ్ ఆయుధాలను ఉత్పత్తి చేస్తే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది’’ అని కాంగ్రెస్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీకి గురువారం సమర్పించిన నివేదికలో తెలిపారు. ఈ యుద్దం, దాని పరిణామాలతో రష్యా సంప్రదాయ శక్తి మెల్లగా బలహీనపడుతుందని బెరియర్ అన్నారు.

‘పశ్చిమ దేశాలను బెదరించడానికి, తన అంతర్గత, బాహ్య బలాన్ని పెంచుకోడానికి అణు నిరోధకంపై ఎక్కువగా ఆధారపడుతుంది’’ అని అంచనా వేశారు. చైనా అధినేత జీ జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీకి పిలుపునివ్వడంతో యుద్ధం ప్రభావాన్ని పెంటగాన్ అంచనా వేసింది. ఉక్రెయిన్ యుద్ధంలో చైనా వైఖరిని అమెరికా అధికారులు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. అయితే, యుద్ధం ముగించడానికి జిన్‌పింగ్ సాయం కోరాలని బైడెన్ భావిస్తున్నారు.

అణ్వాయుధ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. కాగా, పెంటగాన్ ఇంటెలిజెన్స్ నివేదికపై వాషింగ్టన్‌లోని రష్యా రాయబార కార్యాలయం తక్షణమే స్పందించడానికి నిరాకరించింది.

రష్యా దండయాత్రపై గత వారం పలు గూఢచార సంస్థలు వెల్లడించిన హెచ్చరిక నివేదికల మాదిరిగా కాకుండా పెంటగాన్ నివేదిక తాజా పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. పెంటగాన్ సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. దాడి చాలా వరకు నిలిచిపోయిందని, రష్యా ఇప్పటి వరకు ఉక్రెయిన్‌లోకి 1,000 కంటే ఎక్కువ సుదూర క్షిపణి దాడులపై ఆధారపడిందని చెప్పారు.

ఉక్రెయిన్‌లో తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో పశ్చిమ దేశాలను మరింత విస్తృతంగా ఎదుర్కోవడానికి దూకుడు చర్యలకు పూనుకోవచ్చని బెరియర్ చెప్పారు. మాజీ సోవియట్ యూనియన్‌లోని ఇతర దేశాలను సంఘటితం చేయడమే ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు కీలకమైన ప్రేరణ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ఉక్రెయిన్ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిఘటన.. సంఘర్షణ ప్రారంభ దశలో సాపేక్షంగా అధిక నష్టం వాటిల్లినప్పటికీ జెలెన్‌స్కీ ప్రభుత్వం తన దారికి వచ్చేవరకూ మరింత ప్రమాదకర ఆయుధాలను ఉపయోగించి ముందుకు సాగాలని మాస్కో నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు.

 

 

 

Friday, March 18, 2022

యుక్రెయిన్: పుతిన్‌కు ఏం కావాలి? ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది?

 యుక్రెయిన్‌పై దాడితో యూరప్‌లో శాంతికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విఘాతం కలిగించారు.



4.4 కోట్ల మంది నివసించే తూర్పు యూరప్ దేశమైన యుక్రెయిన్‌.. పశ్చిమ దేశాల వైపు మొగ్గు చూపడంతో తమ సార్వభౌమత్వానికి ముప్పు ఉందని చెబుతూ పుతిన్ ఈ దాడికి ఆదేశాలిచ్చారు.

దీంతో బాంబు దాడులు మొదలయ్యాయి. వీటిలో వేల మంది మరణించారు. లక్షల మంది శరణార్థులుగా పొరుగు దేశాలకు వలసపోతున్నారు.

ఇంతకీ రష్యా ఎందుకు ఈ దాడులు చేపడుతోంది? పుతిన్‌ డిమాండ్లు ఏమిటి?

పుతిన్‌కు ఏం కావాలి?


దాడికి ఆదేశాలిచ్చే సమయంలో పుతిన్ పెట్టుకున్న లక్ష్యాలు నీరుగారిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఈ దాడితో తేలిగ్గానే యుక్రెయిన్‌పై పట్టు సాధిస్తామని ఆయన భావించారు.

ఈ దాడిని యుద్ధం లేదా దండయాత్ర లేదా అతిక్రమణగా అభివర్ణించడానికి పుతిన్ నిరాకరించారు. దీన్ని ''ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్''గా ఆయన అభివర్ణించారు.

అయితే, రష్యా చరిత్రలో ఇది కీలక ఘట్టమని ఆయన భావిస్తున్నట్లు ఆయన చర్యలతో సుస్పష్టం అవుతోంది. ''రష్యా భవిష్యత్తుతోపాటు ప్రపంచంలో రష్యా స్థానం ప్రమాదంలో పడ్డాయి''అని రష్యా విదేశీ గూఢచర్య సంస్థ అధిపతి సెర్జీ నారిష్కిన్ వ్యాఖ్యానించారు.

రష్యా నాయకుల తొలి లక్ష్యం యుక్రెయిన్‌పై పట్టు సాధించి, అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయడం. పశ్చిమ దేశాల నాటో కూటమిలో యుక్రెయిన్‌ చేరకుండా అడ్డుకోవాలని రష్యా భావించింది.

యుక్రెయిన్‌లో నిస్సైనికీకరణ, ''నాజీ విధాన రహిత'' యుక్రెయినే తమ లక్ష్యమని రష్యా ప్రజలకు పుతిన్ చెప్పారు. యుక్రెయిన్ ప్రభుత్వం చేతిలో అణచివేత, వేధింపులను ఎదుర్కొంటున్న ప్రజలను రక్షించడానికే తాము ఈ దాడులు చేస్తున్నామని వివరించారు.

''యుక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించాలని మేం అనుకోవట్లేదు. మేం బలవంతంగా ఏదీ చేయాలని భావించట్లేదు''అని పుతిన్ చెప్పారు.

''కానీ, నిజానికి అక్కడ నాజీలు లేరు. అణచివేతలు జరగడంలేదు. రష్యా మాత్రం డజన్ల కొద్దీ నగరాల్లో తమ బలాన్ని ప్రయోగిస్తోంది. దీనిపై యుక్రేనియన్లు పోరాడుతున్నారు''అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం చాలాచోట్ల బాంబు దాడులు కొనసాగుతున్నాయి. అయితే, ఇప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయాలని రష్యా అనుకోవడం లేదని శాంతి చర్చలను గమనిస్తే తెలుస్తుంది. తటస్థ యుక్రెయినే లక్ష్యంగా రష్యా ముందుకు వెళ్తోంది.



 తటస్థ యుక్రెయిన్ ఎందుకు కోరుకుంటున్నారు?

1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత యుక్రెయిన్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటినుంచి క్రమంగా పశ్చిమ దేశాల వైపుగా యుక్రెయిన్ కదులుతూ వెళ్తోంది. ఐరోపా యూనియన్‌తోపాటు నాటోలో చేరేందుకు కూడా యుక్రెయిన్ ప్రయత్నించింది.

యుక్రెయిన్ చర్యలను మళ్లీ వెనక్కి తీసుకునేలా చేయాలని పుతిన్ భావిస్తున్నారు. సోవిట్ యూనియన్ పతనాన్ని రష్యా విచ్ఛిన్నంగా ఆయన భావిస్తున్నారు.

రష్యన్లు, యుక్రేనియన్లు ఒకే జాతి ప్రజలని, యుక్రెయిన్ ఏనాడూ స్వతంత్ర దేశంగా లేదని పుతిన్ చెబుతుంటారు. యుక్రేనియన్ చరిత్రను ఆయన తిరస్కరిస్తుంటారు.

2013లో యూరోపియన్ యూనియన్‌లో చేరే ఒప్పందాన్ని రష్యా అనుకూల యుక్రెయిన్ నాయకుడు విక్టర్ యనుకోవిచ్‌తో పుతిన్ పక్కన పెట్టించేశారు. దీంతో ఫిబ్రవరి 2014లో యుక్రెయిన్ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.

వీటిపై స్పందిస్తూ దక్షిణ యుక్రెయిన్‌లోని క్రైమియా పీఠభూమిని రష్యా స్వాధీనం చేసుకుంది. యుక్రెయిన్ బలగాలతో పోరాడుతున్న క్రైమియాలోని వేర్పాటువాదులకు రష్యా అండగా నిలిచింది. ఎనిమిదేళ్లపాటు కొనసాగిన యుద్ధంలో దాదాపు 14,000 మంది మరణించారు.

2015లో ఇక్కడ మిన్స్క్‌ శాంతి ఒప్పందం కుదిరింది. అయితే, ఇది అమలుకు నోచుకోలేదు. యుక్రెయిన్‌పై తాజా దాడికి ముందుగా, ఈ ఒప్పందానికి పుతిన్ తూట్లు పొడుస్తూ.. రష్యన్ జనాభా ఎక్కువగా ఉండే రెండు తూర్పు ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించారు.

తమ దేశ భవిష్యత్తుకు నాటోతో ముప్పు ఉందని చెబుతూ యుక్రెయిన్‌పైకి పుతిన్ బలగాలను పంపించారు. నాటో దేశాలు క్రైమియాను వెనక్కి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆయన ఆరోపణలు చేశారు.

    రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తోందా
    యుక్రెయిన్ సంక్షోభం: కొన్ని దేశాలు అమెరికాతో జత కట్టకుండా, రష్యా పక్షం వహిస్తున్నాయి ఎందుకు

యుద్ధం ఆపడానికి మార్గం ఉందా?

త్వరలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరొచ్చని, ఎందుకంటే రష్యా బలగాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయని యుక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మిఖాయిలో పొడోలిక్ ఇటీవల వెల్లడించారు.

చర్చల్లో పురోగతి ఉందని రెండు వైపులా అంగీకరిస్తున్నాయి. పుతిన్ వైఖరి మెతకబడిందని పొడోలిక్ తెలిపారు.

దాడి చేసిన తొలి రోజుల్లో క్రైమియా రష్యాలో అంతర్భాగమని యుక్రెయిన్ గుర్తించాలని రష్యా పట్టుబట్టింది. తూర్పు యుక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించాలని నొక్కి చెప్పింది. నాటో, యూరోపియన్ యూనియన్‌లలో చేరబోమని చెబుతూ యుక్రెయిన్ రాజ్యాంగానికి సవరణ చేయాలని సూచించింది.

క్రైమియాతోపాటు రష్యా మద్దతున్న లుహాన్‌స్క్, దోన్యస్క్ ప్రాంతాలపై ఏకాభిప్రాయం కుదిరేలా కనిపించడం లేదు. అయితే, వీటిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని అంగీకారంతో శాంతి ఒప్పందం కుదిరే అవకాశముంది.


 యుక్రెయిన్ నాయకుడ్ని తొలగించి, అతడి స్థానంలో ఓ కీలుబొమ్మ లాంటి మరో నాయకుణ్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యం నెరవేరదని రష్యా గ్రహించినట్లే కనిపిస్తోంది. బెలారుస్‌లో అయితే, తమ ఆదేశాలకు అనుగుణంగా నడచుకునే నాయకుణ్ని అధ్యక్షుడిగా రష్యా నియమించగలిగింది.

కానీ, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియెన్‌స్కీ మాత్రం.. తనను రష్యా తొలి శత్రువుగా గుర్తించిందని, తన కుటుంబం రష్యాకు రెండో శత్రువని వ్యాఖ్యానించారు.

''ఇప్పుడు పుతిన్ తన డిమాండ్ల సంఖ్య తగ్గించుకున్నట్లు కనిపిస్తోంది''అని ఆర్ పొలిటిక్ అండ్ కార్నెగీ మాస్కో సెంటర్‌కు చెందిన రాజకీయ విశ్లేషకురాలు తాతియానా స్టానోవయా వ్యాఖ్యానించారు.

ఎందుకంటే రష్యా ఇప్పుడు తటస్థ, నిస్సైనికీకర యుక్రెయిన్‌ను కోరుకుంటోంది. సైన్యం, నావికా దళాలను కూడా తమ దళాలనే ఉపయోగించాలని భావిస్తోంది. ఈయూ సభ్య దేశాలైన ఆస్ట్రియా లేదా స్వీడన్ ఇలానే సొంత సైన్యాలు లేకుండా ఉన్నాయి. ఆస్ట్రియా తటస్థ దేశం. స్వీడన్ మాత్రం తటస్థ దేశం కాదు. ఇది నాటో అభ్యాసాల్లోనూ పాలుపంచుకుంటుంది.

రష్యా సానుకూల దృక్పథంతో చర్చలు జరుపుతుందని చాలా మంది భావించడం లేదు. ''మొదట రష్యా కాల్పుల విరమణకు అంగీకరించాలి. ఎందుకంటే తలపై తుపాకీ గురిపెట్టి చర్చలు జరపలేరు''అని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.
యుక్రెయిన్ డిమాండ్లు ఏమిటి?

యుక్రెయిన్ డిమాండ్లు సుస్పష్టంగా ఉన్నాయని ఆ దేశ అధ్యక్ష సలహాదారుడు చెప్పారు. ''కాల్పుల విరమణ, రష్యా బలగాల ఉపసంహరణ లాంటివి మా డిమాండ్లలో ఉన్నాయి''అని ఆయన చెప్పారు.

''యుద్ధానికి మునుపటి స్థానాలకు రష్యా సైన్యం వెళ్లడం కూడా యుక్రెయిన్ డిమాండ్లలో ఒకటి. పశ్చిమ దేశాలు కూడా ఇదే కోరుతున్నాయి''అని ఇంటర్నేషనల్ లా ప్రొఫెసర్, ఐరాస మధ్యవర్తిత్వ నిపుణుడు మార్క్ వెల్లెర్ చెప్పారు.

రష్యా దాడి విషయంలో యుక్రెయిన్ వైఖరి కూడా మెతకబడినట్లు కనిపిస్తోంది. నాటో తమను సభ్య దేశంగా అంగీకరించబోదని ఆ దేశ అధ్యక్షుడు జెలెయెన్స్కీ కూడా వ్యాఖ్యానించారు. ''అదే నిజం. దాన్ని మనం గుర్తించాలి''అని ఆయన వ్యాఖ్యానించారు.

''ఇద్దరు అధ్యక్షులూ అంగీకరించే ఒప్పందంపై మేం చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే ఇది పూర్తి కాబోతోంది. యుద్ధాన్ని ఆపడానికి ఇదొక్కటే మా ముందున్న మార్గం''అని పోడోలిక్ వివరించారు.


పుతిన్ అనుకున్నది సాధించగలుగుతారా?

 పశ్చిమ దేశాలతోపాటు 30 దేశాలు సభ్యులుగానున్న నాటో కూటమిపై పుతిన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేనప్పటికీ, యుక్రెయిన్ విషయంలో ఆయన రాజీపడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా దాడులకు ముందుగా.. నాటో సైన్యం 1997కు ముందున్న స్థానాలకు వెళ్లిపోవాలని పుతిన్ నొక్కి చెప్పారు. 1997 తర్వాత నాటోలో చేరిన యూరప్ దేశాల సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తమ సరిహద్దుల్లోని దేశాల్లో ఎలాంటి ఆయుధాలను మోహరించకూడదని ఆయన చెబుతున్నారు. 1990ల్లో తమ సభ్యత్వాన్ని మరిన్ని దేశాలకు విస్తరించబోమని నాటో హామీ ఇచ్చిందని పుతిన్ అంటున్నారు. సోవియట్ యూనియన్ కుప్పకూలకు ముందు, అప్పటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్‌కు నాటోకు మధ్య ఆ అంగీకారం కుదిరిందని ఆయన చెబుతున్నారు. అయితే, అలాంటి చర్చలేమీ జరగలేదని పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. యూరప్‌ను తన కళ్లతో మాత్రమే పుతిన్ చూడాలని అనుకుంటున్నారని, కానీ, ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయని జర్మనీ ఛాన్సెలర్ ఓలాఫ్ స్కాల్జ్ చెప్పారు. మరోవైపు పుతిన్‌ను యుద్ధ నేరస్థుడిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. యుద్ధానికి ముందు అమెరికా అణ్వాయుధాలు కేవలం అమెరికా భూభాగాలకే పరిమితం కావాలని రష్యా డిమాండ్ చేసేది. ముఖ్యంగా మధ్యస్థ శ్రేణి క్షిపణులు, ఖండాంతర క్షిపణులపై చర్చలు జరిగాయి. ఇప్పుడు ఆ చర్చలు దాదాపుగా ముగిసిపోయినట్లే. ప్రచ్ఛన్న యుద్ధంనాటి పరిస్థితులు మళ్లీ వచ్చే అవకాశముందని తాతియానా అభిప్రాయం వ్యక్తం చేశారు. ''పశ్చిమ దేశాలకు రష్యా మరింత గట్టి డిమాండ్లు పెట్టే అవకాశముంది. మనం ఊహించిన దానికంటే పరిస్థితులు మరింత దిగజారే ముప్పుంది''అని ఆమె వ్యాఖ్యానించారు. రష్యా - యుక్రెయిన్ యుద్ధం అప్‌డేట్స్: 'మరియుపూల్ వీధుల్లో సేకరించిన మృతదేహాల సంఖ్య 1,207' యుక్రెయిన్, రష్యా యుద్ధంలో Z అక్షరం ఎందుకంత కీలకంగా మారింది? దీనిని ఏ అర్థంలో వాడుతున్నారు రష్యా తర్వాత ఏం చేస్తుంది? ఈ దాడులపై పశ్చిమ దేశాల స్పందన విషయంలో పుతిన్ ఆశ్చర్యానికి గురయ్యారు. పశ్చిమ దేశాలు నేరుగా యుద్ధంలోకి దిగవని పుతిన్‌కు తెలుసు. అయితే, భారీ స్థాయిలో ఆంక్షలు విధిస్తాయని ఆయన ముందుగా ఊహించలేదు. ఈ ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఐరోపా యూనియన్‌తోపాటు అమెరికా, బ్రిటన్, కెనడా.. రష్యా ఆర్థిక వ్యవస్థపై భిన్న ఆంక్షలు విధించాయి. రష్యా సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను స్తంభింపచేశారు. ఇంటర్నేషనల్ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి రష్యన్ బ్యాంకులను కూడా తొలగించారు. రష్యా చమురు, గ్యాస్ సంస్థల దిగుమతులపై అమెరికా నిషేధం విధించింది. ఏడాదిలోనే ఐరోపా యూనియన్ రష్యా గ్యాస్ దిగుమతులను మూడింట రెండొంతులకు తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకుంది. మరోవైపు 2022 చివరినాటికి రష్యా చమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేయాలని బ్రిటన్ నిర్ణయించింది. మరోవైపు రష్యా, ఐరోపా యూనియన్ కలిసి నిర్మిస్తున్న నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణాన్ని పక్కన పెట్టేస్తున్నట్లు జర్మనీ వెల్లడించింది. ఐరోపా యూనియన్, బ్రిటన్, అమెరికా, కెనడా గగనతలంలో ప్రయాణాలు చేయకుండా రష్యా విమానయాన సంస్థలపై ఆంక్షలు విధించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ సహా కొందరు కీలక రష్యా నాయకులపై వ్యక్తిగతంగా కూడా ఆంక్షలు విధించారు. శాంతి ఒప్పందంతో ఈ ఆంక్షలను పక్కనపెట్టే సూచనలేవీ కనిపించడం లేదు. ఈ విషయం పుతిన్‌కు కూడా తెలుసు. మరోవైపు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రష్యన్లపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటివరకు నిరసన తెలిపిన 15,000 మంది రష్యన్లను అదుపులోకి తీసుకున్నారు. మీడియా గొంతు కూడా నొక్కేశారు. రష్యాలో పుతిన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ప్రతిపక్షమూ లేదు. ప్రతిపక్ష నాయకులు దేశం విడిచి పారిపోయారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన అలెక్సీ నావల్నీని జైలుకు పంపించారు.





 

 

 

 

Russia-Ukraine war : యూరప్ దేశాల్లోనూ నశిస్తున్న ఓపిక-జీ7 భేటీకి జర్మనీ పిలుపు

 


ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రపై యూరోపియన్ దేశాల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఓవైపు పశ్చిమదేశాల ఆంక్షలు, మరోవైపు ఈయూ ఆంక్షలున్నా రష్యా ఏమాత్రం తన దూకుడు తగ్గించడం లేదు. ఉక్రెయిన్ పై యుద్ధఁ ప్రారంభించి మూడు వారాలు దాటిపోయినా రష్యా దూకుడు తగ్గడం లేదు. దీంతో తదుపరి చర్యలపై చర్చించేందుకు జీ7 దేశాధినేత భేటీకి జర్మనీ పిలుపునిచ్చింది.

 జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధంపై చర్చించడానికి బ్రస్సెల్స్‌లో మార్చి 24న జరిగే శిఖరాగ్ర సమావేశానికి గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాల నాయకులను ఆహ్వానించారు.ఈ సమావేశం ప్రస్తుత సమస్యలపై, ముఖ్యంగా ఉక్రెయిన్‌లో పరిస్థితిపై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆయన ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోకుండా నిషేధం విధించాల్సిన అవసరం ఉందని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ వెల్లడించారు. ఈ దిశగా తమ దేశం నిర్ణయాలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ విషయంలో మౌనంగా ఉండకుండా జర్మనీ తక్షణం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 మరోవైపు పశ్చిమదేశాలతో పాటు యూరప్ దేశాలూ తమపై విధిస్తున్న ఆంక్షలపై రష్యా మండిపడింది. మాస్కో ఎప్పుడూ పశ్చిమ దేశాలపై ఆధారపడటంపై భ్రమలు పెట్టుకోలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ప్రకటించారు. యూఎస్ ఆధిపత్యంలో ఉన్న ప్రపంచ క్రమాన్ని అది ఎప్పటికీ అంగీకరించదని అన్నారు. మనం ఒకరోజు మన పాశ్చాత్య భాగస్వాములపై ​​ఆధారపడగలమని ఏదైనా భ్రమ ఉంటే, ఈ భ్రమ ఇప్పుడు ఉండదన్నారు. అమెరికన్లు కోరుకునేది ఏకధ్రువ ప్రపంచమని, ఇది గ్లోబల్ విలేజ్ లాగా ఉండదన్నారు . కానీ ఒక అమెరికన్ గ్రామం లాగా ఉంటుందని తెలిపారు.

 

సమ్మక్క- సారక్కల మీద వ్యాఖ్యలపై చినజీయర్​స్వామి వివరణ.. ఏమన్నారంటే..?

 


గత కొన్నిరోజులుగా సోషల్ ​మీడియాలో వైరల్​ అవుతున్న తన వ్యాఖ్యలపై త్రిదండి చినజీయర్​ స్వామి వివరణ ఇచ్చారు. లక్ష్మీదేవి పుట్టినరోజు సందర్భంగా ఏపీలోని విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లిన చినజీయర్​ స్వామి.. ఈ వివాదంపై స్పందించారు. సమ్మక్క- సారక్క జాతర గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ వివాదంపై స్పందించిన చినజీయర్​ స్వామి.. ఆదివాసీ గ్రామ దేవతలను తూలనాడినట్లు చేస్తున్న ప్రచారం సరికాదని హితవు పలికారు. తాము ఆదివాసీలను ఎప్పుడూ.. ఎవరినీ.. ఏమీ అనలేదని అన్నారు. ఆదివాసీ దేవతల విషయంలో జరుగుతున్న మోసపూరిత వ్యాపారం గురించి వివరించే సందర్భంలో 20 ఏళ్ల క్రితం చెప్పిన మాటలని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల పూర్వాపరాలు చూస్తే ఆ విషయం అవగతమవుతుందని సూచించారు.

20 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెర మీదికి రావటానికి కారణం ఏంటనేది ఆలోచించాల్సిన విషయమని చెప్పారు. తాను ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశానో.. దాని పూర్వాపరాలు చూడకుండా కేవలం కొన్ని మాటలనే ప్రచారంలోకి తీసుకువచ్చారని వివరించారు. అలాంటి మాటలు వాడుకుని లబ్ధి పొందాలనో.. తమపై విషప్రచారం చేయాలనో చేసిన చర్యగా భావిస్తామన్నారు. మహిళలు, ఆదివాసీలను వెలుగులోకి తీసుకురావాలన్న భావన నుంచి వచ్చిన తాము... వారిని అవమాన పరిచేలా మాట్లాడమని స్పష్టం చేశారు.

పూర్వాపరాలు చూడకుండా..

"ఈ మధ్య కొన్ని రకాల వివాదాలు తలెత్తాయి. అవి సబబా? కాదా? అనేది వినే వాళ్లకు వదిలేస్తున్నాం. ఆదివాసీ జనాలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి వచ్చినవాళ్లం కాబట్టి.. అలాంటి వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు మాకు లేదు. అందరినీ ఆదరించాలని అంటాం. ‘స్వీయ ఆరాధన.. సర్వ ఆదరణ’ మా నినాదం. నేను దేనిని నమ్ముతానో దాన్ని చక్కగా ఆరాధించుకోవాలి. అన్నీ నేను నమ్మాల్సిన అవసరం లేదు కదా! ప్రపంచంలో ఎన్నో మార్గాలుంటాయి. ఎన్నో రకాల అలవాట్లు ఉన్నవారు ఉన్నారు. అలాంటి వాళ్లు వాళ్ల మార్గంలో సవ్యంగా ఉండేలా ఆదరించాలి. అందరినీ ఆరాధించాల్సిన అవసరం లేదు. అందుకోసం మారనవసరం లేదు. మన పద్ధతిలో మనం ఆరాధించుకోవాలి. 2002వ సంవత్సరం నుంచి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఒకరిని లేదా, కొంతమంది దేవతలను చిన్న చూపు చూసేలా మాట్లాడానని అనుకోవడం పొరపాటు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా మాట విన్నప్పుడు, ఒక నిర్ణయం చేసేటప్పుడు దానికి పూర్వాపరాలు చూడటం చాలా అవసరం. అది లేకుండా మధ్యలో కొంత భాగాన్ని తీసుకుని, ‘ఈ వ్యక్తి ఇలా అన్నాడు’ అని అనడం హాస్యాస్పదంగా ఉంటుంది."- త్రిదండి చినజీయర్‌ స్వామి

ఆదివాసుల సంక్షేమం కోసం వికాస తరంగిణి ద్వారా అనేక సేవలు అందించినట్టు చినజీయర్​ స్వామి తెలిపారు. ప్రజలను ప్రభావితం చేసేటువంటి దేవతలను చిన్నచూపు చూసే పద్ధతిని ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించమన్నారు. ఆ పేరుతో అరాచకాలను సృష్టించే వాళ్లను అరికట్టాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. పనికట్టుకొని పెద్ద వివాదాన్ని సృష్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నిజంగా సామాజిక హితం కోరే వ్యక్తులైతే వచ్చి మాట్లాడాలని సవాలు విసిరారు. విషయం తెలుసుకోవాలని.. ఆ తర్వాత సరైన విధానంలో స్పందించాలని హితవు పలికారు. పబ్లిసిటీ కోరుకునే విధంగా చేసే ఇలాంటి అల్ప ప్రచార కార్యక్రమాల్లో ఎలాంటి సామాజిక హితం ఉండదన్నారు. సమాజం, ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా అందులో తాము ఉంటామని.. అలాంటి వాళ్లను కలిసేందుకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటామన్నారు. సమాజం అనే పెద్ద వేదిక మీద పనిచేసే సమయంలో అందరూ కలిసి పనిచేస్తేనే అది సమాజానికి ఆరోగ్యకరమని వివరించారు.

టికెట్‌ పెట్టడం వెనుక కారణమిదే: చినజీయర్‌

సమతామూర్తిని దర్శించుకోవడానికి టికెట్‌ పెట్టలేదని చినజీయర్‌ స్వామి తెలిపారు. అదో ప్రాంగణమని.. దాంట్లో ఎన్నో రకాలైన కార్యక్రమాలు జరుగుతాయని వాటి నిర్వాహణ కోసమేనని ప్రవేశ రుసుమని స్పష్టం చేశారు. ఎంతో కొంత రుసుం పెట్టకుంటే వచ్చే సందర్శకులను కంట్రోల్‌ చేయడం కష్టమని పేర్కొన్నారు. అందువల్లే సామాన్యుడికి అందుబాటులో రూ.150గా ఎంట్రీ టికెట్‌ పెట్టినట్లు వెల్లడించారు. పైగా అక్కడ పూజల కోసం ఎటువంటి టికెట్లు లేవని.. ప్రసాదాలూ పూర్తి ఉచితమేనని చెప్పారు. మరోవైపు రాజకీయాలకు తాము చాలా దూరమని వెల్లడించారు.

యాదాద్రి ప్రారంభోత్సవంలో..

యాదాద్రి పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనటంపైన స్పందించిన చినజీయర్​స్వామి.. తాము ఏ కార్యక్రమం కోసం పాకులాడమని తెలిపారు. ఎవరైనా సలహా కోసం వస్తే ఇస్తామని.. ఏదైనా కార్యక్రమం అప్పజెప్పితే వందశాతం న్యాయం చేస్తామన్నారు. ఏ ప్రభుత్వంతోనూ విభేదాలు లేవని మరోసారి చినజీయర్​స్వామి స్పష్టం చేశారు. ఎవరైనా విభేదాలున్నట్టు భావించుకుంటే.. తమకు సంబంధం లేదని చమత్కరించారు

 


Thursday, March 17, 2022

Aadhaar Card : ఆధార్ నంబర్‌ మరిచిపోయారా ? కార్డు లేకున్నా మీ ఫోన్‌కు ఆధార్ నంబర్‌....

 

Aadhaar Card : ఆధార్ నంబర్‌ మరిచిపోయారా ? కార్డు లేకున్నా మీ ఫోన్‌కు ఆధార్ నంబర్‌ను ఎస్ఎంఎస్ ద్వారా పొందేందుకు ఇలా చేయండి

 


ఆన్‌లైన్‌ ద్వారా ఆధార్ కార్డు నంబర్‌ను ఎలా పొందాలో చూడండి. ఈ స్టెప్స్ ఫాలో అయితే మీ మొబైల్‌కు ఆధార్ నంబర్‌ మెసేజ్ రూపంలో వస్తుంది.

 భారత దేశంలో ఆధార్ (Aadhaar) అత్యంత ముఖ్యమైన కార్డు. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా.. కొన్ని ఇతర సేవలను పొందాలన్న ఆధార్ కార్డు (Aadhaar Card) తప్పనిసరిగా మారింది. అయితే ఒక్కోసారి ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లం. అకస్మత్తుగా అవసరం వస్తుంది. అయితే చాలాచోట్ల ఫిజికల్‌గా కార్డు లేకున్నా.. Aadhaar Number ఉన్నా పని జరుగుతుంది. నంబర్‌ నమోదు చేస్తే వివరాలు వస్తాయి. అయితే చాలా మందికి ఆధార్ నంబర్‌ సరిగా గుర్తుండదు. అలాంటి సమయాల్లో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే Aadhaar Card దగ్గర లేని సమయాల్లో.. మీ స్మార్ట్‌ఫోన్ నుంచే ఆధార్ నంబర్‌ను పొందవచ్చు. అందుకు ఓ మార్గం ఉంది. చాలా సందర్భాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అదెలానో చూడండి

ఆన్‌లైన్‌ ద్వారా ఆధార్ నంబర్‌ పొందాలంటే..

  • ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లోకి వెళ్లాలి.
  • అనంతరం మొదట ఉన్న మై ఆధార్ (My Aadhaar) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత గెట్ ఆధార్ (Get Aadhaar) అనే సెక్షన్‌లో రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ / యూఐడీ (Retrieve Lost or Forgotten EID / UID) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ఓపెన్ అయ్యే వెబ్‌పేజీలో పేరు, మొబైల్‌ నంబర్‌‌తో పాటు అక్కడే కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
  • వివరాలు నమోదు చేశాక.. సెండ్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ ఆధార్‌కు రిజిస్టర్ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే.. మొబైల్‌కు ఆధార్ నంబర్‌ మెసేజ్ రూపంలో వస్తుంది.
Aadhaar Card పోగొట్టుకున్న సమయంలోనూ ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. నంబర్‌ కూడా గుర్తులేక.. కార్డు కోల్పోయిన సమయంలో నంబర్‌ను ఈ ప్రక్రియతో పొందవచ్చు. రూ.50 ఫీజు చెల్లించి మళ్లీ ఆధార్ కార్డు కోసం అధికారిక వెబ్‌సైట్‌లోనే ఆర్డర్ చేయవచ్చు. 15 రోజుల్లోనే ఇంటికే ఆధార్ కార్డు వస్తుంది

 

Instagram Users In Russia: 8 కోట్ల మంది యూజర్లకు షాక్‌.

 


Instagram Users In Russia: 8 కోట్ల మంది యూజర్లకు షాక్‌.. రష్యాలో ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం..!

ఉక్రెయిన్ పై సైనిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ రష్యా సోషల్ మీడియా దిగ్గజాలపై కూడా క‌ఠిన‌ ఆంక్షలు విధిస్తోంది. ఇప్ప‌టికే ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌పై నిషేధం విధించినా ర‌ష్యా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌పై కూడా ఆంక్ష‌లు విధించింది. 

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై దాడులకు తెగబడుతున్న రష్యా సోషల్ మీడియా దిగ్గజాలపై కూడా ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే రష్యా ఫేస్‌బుక్‌, ట్విటర్‌లపై నిషేధం విధించింది. తాజాగా ఫేస్ బుక్ సొంత యాప్ అయిన ఫొటో షేరింగ్‌ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌పైనా కూడా రష్యా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. రష్యా, ఉక్రెయిన్‌, పొలాండ్‌ దేశాల్లో పుతిన్‌ మరణానికి పిలుపునిచ్చేందుకు ఫేస్‌బుక్‌ అనుమతి ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో ఇన్‌స్టా యాప్‌పై నిషేధం విధిస్తున్నట్లు రష్యా వెల్లడించింది. దాంతో ఈ సోమవారం (మార్చి 14) నుంచి రష్యాలో ఇన్‌స్టాగ్రామ్‌పై ఆంక్షలు అమలులోకి వస్తాయి. రష్యా ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 8 కోట్ల (80మిలియన్ల) మంది ఇన్‌స్టా యూజర్లు ఈ యాప్‌కు దూరం కానున్నారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

గతకొన్నివారాలుగా రష్యా ఉక్రెయిన్ పై ఏకధాటిగా బాంబులతో దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో రష్యాపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దేశాల ఆంక్షలను, హెచ్చరికలను పట్టించుకోని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇతర దేశాలు కూడా రష్యాపై ఆంక్షలు విధించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి.

రష్యాను ఇరుకున పెట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆంక్షల దిశగా నిర్ణయం తీసుకునే వీలుంది. ద్వేషపూరిత ప్రసంగాలపై నిబంధనలను సడలిస్తూ ఇటీవలే ఫేస్‌బుక్‌ నిర్ణయం తీసుకుంది. రష్యా ఆక్రమణదారులకు మరణం తప్పదు’ అనే పదాలను ఫేస్ బుక్ అనుమతించినట్టు అయింది. ఇదే విషయంలో మెటా అధికార ప్రతినిధులు కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ద్వారా హింసను అనుమతించినట్టే అవుతుందని స్పష్టం చేసింది.

ఫేస్ బుక్ సొంత యాప్ ఇన్‌స్టాగ్రామ్‌పై రష్యా నిషేధం విధించినందుకు ఆ సంస్థ చీఫ్‌ అడమ్‌ మొస్సెరీ స్పందించారు. రష్యాలో సోమవారం నుంచి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లపై నిషేధం కొనసాగించనున్నట్టు వెల్లడించారు. రష్యా నిర్ణయంతో 8 కోట్ల మంది రష్యన్‌లకు ప్రపంచ ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులతో దూరం కానున్నారని అడమ్‌ మొస్సెరీ పేర్కొన్నారు. అయితే.. దీనిపై రష్యాలోని మీడియా నియంత్రణ విభాగం స్పందించింది. దేశంలో హింసాత్మక చర్యలకు పిలుపునిచ్చేలా పోస్టులకు అనుమతి ఇచ్చినందుకు ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌లను నిషేధాన్ని రష్యా అమలు చేస్తోంది. కానీ, వాట్సాప్‌పై మాత్రం రష్యా ఎలాంటి ఆంక్షలు విధించలేదు.