Showing posts with label History. Show all posts
Showing posts with label History. Show all posts

Friday, October 2, 2015

హైదరాబాద్ రాజ్య స్థాపన - నిజాంల పాలన


-నిజాం రాజ్యస్థాపకుడు: నిజాం ఉల్ ముల్క్. 1724లో
-రాజభాష: పర్షియా. కానీ 1893 నుంచి 1948 వరకు ఉర్దూ రాజభాషగా మారింది.
-ఉర్దూను రాజభాషగా మీర్ మహబూబ్ అలీఖాన్ మార్చాడు.
-గొప్పవాడు: మీర్ ఉస్మాన్ అలీఖాన్
-చివరివాడు: ముఖరం జాహి
-రాజముద్ర: కుల్చా (ఒక రకమైన రోటీ)

Nizam-paleces


గోల్కొండ రాజ్య పతనాంతరం మొగల్ రాజ్యంలో 21వ సుభా రాష్ట్రంగా ఔరంగజేబు కలిపివేశాడు (సుభాలు అంటే మొగల్స్ రాజ్యంలోని రాష్ర్టాలు). మొదట అక్బర్ 15 సుభాలుగా, జహంగీర్ 17 సుభాలుగా, షాజహాన్ 19 సుభాలుగా, ఔరంగజేబు 21 సుభాలుగా నెలకొల్పాడు. దీంతో మొగల్ రాజ్యంలో 1687 నుంచి 1724 వరకు గోల్కొండ ఒక రాష్ట్రంగా ఉంది. చివరికి నిజాం ఉల్‌ముల్క్ మొగల్ చక్రవర్తి మహ్మద్ షా ప్రమేయంతో స్వతంత్ర రాజ్యం నెలకొల్పాడు.

-1707లో ఔరంగజేబు మరణానంతరం భారతదేశంలో అనేక నూతన రాజ్యాలు ఏర్పడ్డాయి. దీనికి ఔరంగజేబు స్థాపించిన విశాల రాజ్యం, అతని వారసులు అసమర్ధులు కావడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. వీరు యోచన లేని రాజు, మూర్తీభవించిన మూర్ఖుడు, పిరికిపంద, రంగీలా రాజాలుగా ప్రసిద్ధి చెందారు.

ఔరంగజేబు కుమారులు

1. బహదూర్ షా-I (యోచనలేని రాజు)
2. జహందర్ షా (మూర్తీభవించిన మూర్ఖుడు)
3. ఫరూక్ సియర్ (పిరికివాడు)
4. మహ్మద్ షా (రంగీలా రాజా)

దక్కన్ విధానం

-దక్కన్ విధానం అనేది ఔరంగజేబుకు క్యాన్సర్ లాంటిది. మొగల్ సామ్రాజ్యాన్ని ఈ విధానమే నాశనం చేసిందని నాటి సమకాలీన చరిత్రకారుల అభిప్రాయం.

Mir_Nizam_Ali_Khan

-చివరికి మొగలుల కాలంలోనే బెంగాల్‌లో ముర్షీద్ ఖులీఖాన్, జేద్‌లో సాదత్ ఉల్లాఖాన్, హైదరాబాద్ (దక్కన్)లో మీర్‌కమ్రుద్దీన్ ఖాన్‌లు స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. ఇందులో హైదరాబాద్ సంస్థానమే ప్రత్యేకమైనది. ఎందుకంటే.. అది విశాలమైనది, సంపన్నమైంది, భారతదేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించింది. భారతదేశ చరిత్ర, హైదరాబాద్ చరిత్ర అనేంత వరకు వచ్చిన సందర్భాలున్నాయి. అసలు హైదరాబాద్ నగరానికి సింహాల నగరం అని పేరు. హైదర్ అంటే సింహమని, ఆబాద్ అంటే పట్టణమనే అర్థాలున్నాయి. హైదరాబాద్ మొదట అచలపురం అనే కుగ్రామంగా ఉండేది. ఇలాంటి చిన్న గ్రామాన్ని గొప్ప విశ్వనగరం (కాస్మోపాలిటన్)గా మారడానికి మహ్మద్‌కులీ కుతుబ్ షా హయాంలోని అష్రబాదీ అనే ఇంజినీర్ గొప్పతనమేనని చెప్పవచ్చు.

అష్రబాదీ ఇరాన్ నగరానికి చెందిన వ్యక్తి. హైదరాబాద్ నగర నిర్మాణ సమయంలో కుతుబ్ షా (మహ్మద్ కులీ) ఓ దేవుడా..! నేను నిర్మించే ఈ నగరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లేటట్లు, చెరువులో చేపలు వృద్ధిచెందినట్లుగా ఈ పట్టణం ప్రజలతో నిండిపోవా లని ఆశీర్వదించమని వేడుకున్నాడు. అయితే కుతుబ్ షా ప్రార్థ్ధనతో ప్రస్తుతం హైదరాబాద్ భారతదేశంలోనే గొప్ప ఆదర్శవంతమైన నగరంగా, విశ్వనగర స్థాయికి ఎదిగింది. అంటే ఒక మంచి మనస్సు, ఉన్నత ఆశయం, కృషితో మొదలు పెడితే అది విజయవంతం అవుతుందనే సూత్రం మనకు ఇందులో కన్పిస్తుంది.

హైదరాబాద్ రాజ్యం (1724-1948)


-1724లో హైదరాబాద్ రాజ్యంగా ఔరంగాబాద్‌లో రాజధానిని మీర్‌కమ్రుద్దీన్ నెలకొల్పాడు. ఇతనికే మొదటి అసఫ్‌జాహి అని, నిజాం ఉల్ ముల్క్ అని, చిన్ కిల్కిచ్ అనే బిరుదులున్నాయి. మొగల్ రాజు మహ్మద్ షా ఇతన్ని స్వతంత్ర రాజుగా గుర్తించాడు. అదే సమయంలో మరాఠాలో పీష్వాల పాలన మొదటి బాజీరావు నేతృత్వంలో హింద్ పద్‌పద్ షాహీగా భారతదేశంలో హైందవ సంస్కృతిని తిరిగి పునరుద్ధరించాలనే ఆశయం మొగలు రాజుకు తలనొప్పిగా తయారయ్యారనే ఉద్దేశంతోనే మహారాష్ట్రలో హైదరాబాద్ రాజ్యం నెలకొల్పడానికి సహాయం అందించాడు. చివరికి 1738లో హైదరాబాద్ నిజాం భోపాల్ యుద్ధంలో మొదటి బాజీరావు చేతిలో ఓడిపోయి దురై-సరై సంధితో యుద్ధం ముగించాడు. ఇతడు చివరికి 1739లో ఢిల్లీపైకి దండెత్తి నాదీర్షాకు, మొగలు రాజుకు మధ్య సయోధ్య వాతావరణాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించాడు. చివరకు 1748 లో బుర్హమ్‌పూర్‌లో మరణించాడు. ఇతని మరణంతో దక్కన్ ప్రాంతంలో సింహాసనం కోసం వారసత్వ యుద్ధ్దాలు ప్రారంభమయ్యాయి.

నిజాం ఉల్ ముల్క్ కుమారులు


1. ఘాజీఉద్దీన్
2. నాసర్ జంగ్
3. సలాబత్ జంగ్
4. బసాలత్ జంగ్
5. నిజాం అలీఖాన్
6. ముజఫర్ జంగ్
-నిజాం కుమార్తె కుమారుడు అంటే నిజాం ఉల్ ముల్క్‌కు మనవడు, నిజాం రెండో కుమారుడైన నాసర్ జంగ్‌కు మనవడు ముజఫర్ జంగ్‌కు మధ్య సింహాసనం కోసం పోటీ ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఐరోపా దేశస్తులైన ఫ్రెంచివారు ముజఫర్ జంగ్‌కు, బ్రిటీష్ వారు నాసర్ జంగ్‌కు సహాయంగా ఉన్నారు. ఇది రెండో కర్ణాటక యుద్ధానికి దారితీసింది.

నాసర్ జంగ్ (1748-50)


-నిజాం ఉల్ ముల్క్ రెండో కుమారుడు నాసర్ జంగ్. ఇతనికి మొగలు చక్రవర్తి మహ్మద్ షా నిజాం ఉద్దౌలా అనే బిరుదు ఇచ్చాడు. తన మేనల్లుడైన ముజఫర్ జంగ్‌తో వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. దీనికి బ్రిటీష్ వారి సహాయం తీసుకున్నాడు. అయితే వారికి ప్రతిఫలంగా కింది ప్రాంతాలు ఇవ్వడానికి ఇరువురి మధ్య ఒప్పందం జరిగింది.
1. ముర్తజానగర్ (గుంటూరు)
2. చికాకోల్ (శ్రీకాకుళం)
3. మచిలీపట్నం
4. ఏలూరు.
-ఈ ఒప్పందానికి నాసర్ జంగ్ ఒప్పుకోవడంతో అతనికి బ్రిటీష్‌వారు సహాయం చేశారు. అయితే కర్ణాటకలో ఫ్రెంచి గవర్నర్ డూప్లే ఆధ్వర్యంలో ఫ్రెంచి ప్రాబల్యం బలంగా ఉండటంతో వారితో జరిగిన అంబూరు యుద్ధంలో బ్రిటీష్ వారు ఓడిపోయారు. డూప్లే జీన్ ఆల్బర్ట్ అనే వితంతువును వివాహం చేసుకున్నాడు. భారతీయులకు తొలిసారిగా ఉద్యోగావకాశాలు కల్పించింది కూడా ఫ్రెంచివారే. డూప్లే రాజకీయ చతురత వల్ల హిమ్మత్‌ఖాన్‌తో నాజర్ జంగ్ చంపబడ్డాడు.

ముజఫర్ జంగ్ (1750-51)


-ఫ్రెంచివారు ఇతన్ని దక్కన్ సుబేదార్, హైదరాబాద్ నవాబ్‌గా నియమించారు. దీనికి ప్రతిఫలంగా ఫ్రెంచి గవర్నర్ డూప్లేకు జఫార్ జంగ్ (విజేత) అనే బిరుదు ఇచ్చి ముస్తఫానగర్, మచిలీపట్నం ప్రాంతాలను ధారాదత్తం చేశాడు. ఇది సహించని రాయలసీమ ముస్లిం పాళెగార్లు, నవనూర్ నవాబు (కడప జిల్లా) రాయచోటి దగ్గర్లోని లక్కిరెడ్డిపల్లి వద్ద ముజఫర్ జంగ్‌ను హతమార్చారు. (పాళేగార్ల వ్యవస్థను 1820లో థామస్ మన్రో అణిచివేశాడు)

సలాబత్ జంగ్ (1751-61)


-ఇతను నాజర్ జంగ్ సోదరుడు. హైదరాబాద్ నవాబుగా ఫ్రెంచి అధికారైన బుస్సీ నియమించాడు. ఇందుకు ప్రతిఫలంగా సలాబత్ జంగ్ ఉత్తర సర్కార్ జిల్లాలను (గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా, నెల్లూరు) కానుకగా ఇచ్చాడు. చివరికి ఫ్రెంచి ప్రాబల్యం గల 1758 చందుర్తి యుద్ధంలో, 1754లో మచిలీపట్నం యుద్ధంలో కాన్‌సాక్స్ సేనల చేతిలో ఓడిపోయాడు....... అనంతరం ఉత్తర సర్కార్ ప్రాంతాలను వెనక్కి తీసుకున్నాడు. తర్వాత 1766లో వాటిని నిజాం అలీఖాన్ బ్రిటీష్ వారికి ధారాదత్తం చేశాడు. బ్రిటీష్ వారికి ఇప్పించడంలో కాంట్రేగుల జోగి పం తులు గొప్ప దుబాసిగా (ట్రాన్సిలేటర్) ప్రసిద్ధి. ఇతను క్రియాశీలక పాత్ర పోషించాడు. ఇతనికాలంలో ఆంధ్రలో ముఖ్య సంఘటనలు..

బొబ్బిలి యుద్ధం (1757)


-బొబ్బిలి జమీందార్ విజయరంగారావుకు, విజయనగరం జమీందార్ విజయరామరాజుకు మధ్య ఉన్న వైరాన్ని బుస్సీ తనకు అనుకూలంగా మార్చుకొని, విజయనగరం జమీందార్‌తో కలిసి బొబ్బిలి రాజ్యాన్ని పతనం చేసి, విజయరంగారావును చంపివేశాడు. దీనికి కోపోద్రిక్తుడైన రంగారావు బావమర్ది తాండ్ర పాపారాయుడు (బొబ్బొలి పులి) విజయనగరంపై దండెత్తి విజయరామరాజును చంపివేశాడు. ఫ్రెంచి అధికారి బుస్సీ హైదరాబాద్‌కు పారిపోయాడు. దీంతో రెండు జమీందార్ రాజ్యాలు నాశనమయ్యాయి. చివరకు తాండ్ర పాపారాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

చందుర్తి యుద్ధం (1758)


-హైదరాబాద్ రాజ్యంలో బ్రిటీష్ వారికి, ఫ్రెంచి వారికి జరిగిన మొదటి యుద్ధం. ఈ యుద్ధంతో ఫ్రెంచివారి పతనం ప్రారంభమైంది.
పద్మనాభ యుద్ధం (1794)

-ఈ యుద్ధం బ్రిటీష్ వారికి, విజయనగర జమీందార్ అయిన చిన విజయరామరాజుకు మధ్య జరిగింది.

-ఈ యుద్ధాల తర్వాత సలాబత్‌జంగ్ పతనం చెందిన ప్రెంచివారిని కాదని బ్రిటీష్ వారికి పూర్తి మద్దతు ప్రకటించాడు.1759లో మచిలీపట్నం, నిజాంపట్నం, వక్కల్ మన్నారు, కొండవీడులను బ్రిటీష్ వారికి ఇచ్చాడు. కానీ అనంతరం జరిగిన పరిణామాల్లో సలాబత్ జంగ్‌ను నిజాంఅలీ బీదర్‌కోటలో బంధించి తనకు తానే హైదరాబాద్ పాలకుడిగా ప్రకటించుకున్నాడు.

నిజాం అలీఖాన్(1761-1803)


-ఇతన్ని రెండో అసఫ్ జా అంటారు. అలీఖాన్ కాలం నుంచే అసఫ్‌జాహీ రాజులను నిజాం అని పిలుస్తున్నారు.

-నిజాం అంటే అరబ్ భాషలో సిస్టమ్, ఆర్డర్ అని అర్థం. అంతేకాకుండా వీరు టర్కీలోని తురానీ తెగకు చెందినవారు. అక్కడి సిద్ధ సైన్యాన్ని కూడా నిజాం అంటారు. దీన్నే తమ బిరుదులుగా అసఫ్ జాహీ రాజులు ధరించారు. వీరిలో మహా ఘనత వహించిన నిజాం అని మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు పేరు ఉన్నది. నిజాం అలీఖాన్ నుంచి ఒక వ్యవస్థీకృతమైన పరిపాలనా విధానం, క్రమపద్ధతితో కూడిన పాలన ప్రారంభమైందని చెప్పవచ్చు. కాబట్టి నిజాం రాజు అని ఇతని నుంచే తొలిసారిగా పిలిచారు.

-నిజాం అలీఖాన్ ఉత్తర సర్కార్ జిల్లాలను బ్రిటీష్ వారికి 1766లో ఇచ్చివేశాడు. 1788లో గుంటూరు ప్రాంతాన్ని, 1802లో సీడెడ్ (రాయలసీమ) ప్రాంతాన్ని ధారాదత్తం చేయడం వల్ల వీటిని దత్తమండలాలు అంటారు.

వివరణ: 1808లో దత్తజిల్లాలకు అనంతపురం ముఖ్య కేంద్రప్రాంతం. అదే సంవత్సరంలో జిల్లాలుగా కడప, బళ్లారి, 1858లో కర్నూల్ జిల్లా, 1882లో అనంతపురం, 1911లో చిత్తూరు జిల్లాలుగా ఏర్పడ్డాయి. 1935లో నంద్యాల సమావేశంలో గాడిచర్ల హరిసర్వోత్తమ రావు సీడెడ్ జిల్లాలకు రాయలసీమగా పేరు పెట్టాడు.

-ఫ్రెంచి సైన్యాధికారి పీటర్‌మాండ్ సహాయంతో ఆబిడ్స్‌లోని గన్‌ఫౌండ్రిని నిజాం అలీ నిర్మించాడు. పీటర్‌మాండ్ మూస రాముడుగా ప్రసిద్ధిగాంచాడు. ఇతడి సమాధి మలక్‌పేటలో ఉంది. అలాగే 1799లో సైన్య సహకార సంధిలో భాగంగా బ్రిటీష్ రెసిడెంట్‌గా జేమ్స్‌ప్యాట్రిక్‌ను నియమించాడు.
నిజాం అలీ నిర్మాణాలు:
i. మోతీమహాల్
ii. గుల్షన్ మహల్
iii. రోషన్ మహల్
- నిజాం అలీ తర్వాత సికిందర్ జా నిజామ్‌గా వచ్చాడు.

p-murali





ముల్కీ ఉద్యమం - తెలంగాణ చరిత్ర

ముల్కీ ఉద్యమం - తెలంగాణ చరిత్ర

నిజాం రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంత ప్రజలు జమిందారీ వ్యవస్థ కింద నలుగుతూ,సరైన అవకాశాలు పొందలేని పరిస్థితులలో వారికి అవకాశాలను కల్పించడానికని ముల్కి ఉద్యమం 1918 మొదలైంది. 1930 నుండి ఊపందుకొని, స్వతంత్ర భారతంలో కలసినతరువాత కూడా వినిపించింది
హైదరాబాద్ సంస్థానంలోనూ, సమగ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ “ముల్కీ” సమస్యపై చాలాసార్లు ఆందోళనలు, ఉద్యమాలు చెలరేగాయి. “ముల్కీ” అంటే స్థానికులు. హైదరాబాద్ రాష్ట్ర అధికార భాష ఉర్దూ కావడంతో అసఫ్‌జాహీ పాలన కాలంలో ఇతర ప్రాంతాల్లో నివసించే ముస్లింలు, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, ఇతర వృత్తులు నిర్వహించుకోవడానికి అనుకూలంగా భావించి ఈ ప్రాంతానికి వలస వచ్చేవారు. ఇంకొకవైపు సంస్థానంలో జాగీర్‌దారీ వ్యవస్థ అమలులో ఉండటంతో, విద్యావకాశాలు అధికంగా లేకపోవడంతో స్థానిక ఉద్యోగాల్లో వారికి అవసరమైన అర్హతలు లేకుండాపోయాయి. దీంతో స్థానికులకు ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతూ వచ్చాయి. ఈ పరిస్థితులలో అసంతృప్తికి లోనైన స్థానికులు, బయటివారి నియామకాలకు వ్యతిరేకంగా ఆనాటి నిజాం నవాబుకు విన్నవించుకున్నారు. ఇదే ముల్కీ ఉద్యమానికి నాంది.
1918 గెజిట్ లో ప్రథమంగా ఉద్యోగాల నియామకం విషయంలో ముల్కీ ప్రస్తావన వచ్చింది. సంస్థానంలోని ఉద్యోగాలన్నీ అర్హులైన స్థానికులకే ఇవ్వాలని, విదేశీయులు – అంటే సంస్థానం బయటి నుండి వచ్చేవారు ఉద్యోగం పొందాలంటే ప్రధానమంత్రి ప్రత్యేక అనుమతి అవసరమని ప్రకటించింది. 1918లో నైజాం ప్రభుత్వం “ముల్కీ” ఫర్మానాను జారీ చేసింది. దాని ప్రకారం నిజాం ప్రభుత్వం ప్రత్యేక అనుమతి లేకుండా ముల్కీలు (స్థానికులు) కానివారిని ఏ ఉద్యోగంలో కూడా నియమించగూడదని ఆ ఫర్మానా అర్ధం. ముల్కీ అర్హతలను నాలుగు విధాలుగా రూపొందించారు.
ముల్కీ పురుషునికి కలిగిన సంతానం ముల్కీ అవుతారు.
ఇతర ప్రాంతాల నుండి వచ్చి కనీసం 15 సంవత్సరాలు సంస్థానంలో స్థిర నివాసం ఏర్పరుచుకొని, తిరిగి తమ ప్రాంతానికి పోనని ప్రమాణ పత్రం సమర్పించిన వారు.
హైదరాబాద్ సంస్థానంలో 15 సంవత్సరాలు ఉద్యోగ చేసినవారి సంతానం.
ముల్కీ పురుషుని భార్య.
1930 ప్రాంతంలో ముల్కీ ఉద్యమం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ముల్కీ నిబంధనలు అమలులో వున్నా ప్రభుత్వ ఉద్యోగాలలో చాలామంది నాన్‌ముల్కీలు (స్థానికేతరులు) ఉండేవారు. స్థానికులలో ఉన్న నిరుద్యోగ సమస్య కారణంగా అసంతృప్తి చోటు చేసుకుంది. అదేసమయంలో పరిపాలనా సంస్కరణల సూచన కొరకు నిజాం ప్రభుత్వం అరముర్ అయ్యంగార్‌తో ఒక కమీషన్‌ను నియమించింది. నాన్‌ముల్కీలను ప్రభుత్వం ఉద్యోగాలలో నియమించటం నిలిపివేయాలని స్థానికులు ఈ సంఘానికి విన్నవించుకొన్నారు. స్థానికుల విజ్ఞప్తులను దృష్టిలో వుంచుకొని, ఆ తరువాత రూపొందించిన సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్లలో నాన్‌ముల్కీలను నిజాం నవాబు ప్రత్యేక అనుమతి లేనిదే ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించరాదని నిర్దేశించారు. నైజాం సంస్థానంలో ఉద్యోగస్తులలో ముస్లిములే ఎక్కువ. కాబట్టి ముల్కీ, నాన్ ముల్కీ విభేదాలు వారి మధ్యనే ఎక్కువగా ఉండేవి.
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తరువాత ముస్లిం ఉద్యోగస్తులు చాలామంది పాకిస్తాన్ కు వలసపోయారు. సెప్టెంబర్ 1948కి ఒకటి రెండు సంవత్సరాల ముందు సంస్థానంలో నియమితులైన సంస్థానేతర ఉద్యోగస్తులు చాలామంది వారి ఉద్యోగాలను కోల్పోయారు.
హైదరాబాద్ రాష్ట్రప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, ఎన్నో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, విద్యా సౌకర్యాల కల్పన కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు సుశిక్షితులైన ఉద్యోగస్తుల కొరత ఏర్పడింది. ఇంతేకాకుండా 1949 జూన్ విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని సెకండరీ పాఠశాలలన్నింటిలోనూ ప్రాంతీయ భాషలోనే విద్యాబోధన జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం అమలు చేయడానికి కూడా తెలుగులో బోధించే, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత కూడా ఏర్పడింది. ఈ కొరతను భర్తీ చేయడానికి ఇతర ప్రాంతాల నుండి (నాన్ ముల్కీలను) ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే ప్రాంతాల నుండి అర్హులైన వారిని ఉద్యోగాలలో నియమించారు.
ఈ విధంగా పాత వ్యవస్థలో ఉద్యోగావకాశాలు లేక, కొత్త వ్యవస్థలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆశించిన స్థానిక విద్యావంతులు నిరాశకు లోనయ్యారు. పెద్ద సంఖ్యలో స్థానికేతరులకు ఉద్యోగాలు కట్టబెట్టడం వల్ల స్థానికులలో ఏర్పడ్డ అసంతృప్తి, నిరాశలను గమనించి 1950 సంవత్సరంలోనే హైదరాబద్ కాంగ్రెస్ కమిటీ హైదరాబాద్ రాష్ట్రం నుండి నాన్ ముల్కీలను వెనక్కి పంపివేయాలని ప్రభుత్వాన్ని కోరింది. 1952లో హైదరాబాద్‌లోనూ, తెలంగాణా ప్రాంతంలోనూ నాన్-ముల్కీల పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. “నాన్-ముల్కీ గో బ్యాక్”, “ఇడ్లీ – సాంబార్ గో బ్యాక్” అన్న నినాదాలు గోడలపైకి ఎక్కాయి. అక్కడక్కడా నాన్-ముల్ల్కీ ఉద్యోగులపై, వ్యాపార సంస్థలపై దాడులు కూడా జరిగాయి. హైదరాబాద్‌లో ఆందోళనకారులపై కాల్పులు కూడా జరిగాయి. ఆరుగురు విద్యార్థులు ప్రాణాలర్పించారు. అదే ఆతరువత విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమంగా రూపు దిద్దుకొంది.
1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణా జిల్లాలలో, అటు మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే జిల్లాలలో కమ్యూనిష్టులు మంచి విజయాలు సాధించారు. విశాలాంధ్ర ఏర్పడితే అధికారాన్ని చేపట్టగల అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించిన కమ్యూనిష్టులు విశాలాంధ్ర ఏర్పాటుకు ప్రచారం తీవ్రతరం చేశారు.
దేశంలోని మిగిలిన ప్రాంతాల కోరికలను పరిశీలించడానికి భారత ప్రభుత్వం 1953 ఫిబ్రవరిలో ఫజల్ ఆలీ ఆధ్వర్యంలో ఒక కమీషన్‌ను నియమించింది. ఈ కమీషన్‌లో హ్రిదయనాథ్ కుంజ్రూ, సర్దార్ కె.యం. ఫణిక్కర్‌లు ఇతర సభ్యులు. రాష్ట్రాల పునర్విభజన సంఘం (state reorganisation commission) నియమింపబడిన తరువాత విశాలాంధ్ర ఉద్యమం ఊపందుకొంది. తెలంగాణా కాంగ్రెస్ నాయకులలో మాత్రం రెండు వర్గాలు ఏర్పడి ఒక వర్గం ప్రత్యేక తెలంగాణాను కోరగా, ఇంకొక వర్గం విశాలాంధ్ర రాష్ట్రాన్ని సమర్థించింది.
బ్రిటిష్ ఇండియాలో జరిగిన 1946 ఎన్నికలకు ముందు విడుదల చేసిన ఎన్నికల ప్రణాలికలో కాంగ్రెస్ భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం జరగాలని అభిప్రాయ పడింది. స్వాతంత్ర్యం రాబోయే తరుణంలో ఆంధ్ర నాయకులు, నెహ్రూ, సర్దార్ పటేల్లను కలిసి కొత్త రాజ్యాంగం అమలులోకి రాకముందే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించుకొన్నారు. వివిధ కారణాలవల్ల ఆంధ్ర నాయకుల కోరిక ఫలించలేదు. 1948 జూన్ 17న భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు, భాషా రాష్ట్రాల కమిటీని నియమించారు. ఈ కమిటీకీ అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ధార్ అధ్యక్షుడిగా, డా|| పన్నాలాల్, జగత్ నారాయణ్ లాల్ సభ్యులుగా నియమితులైనారు.
ధార్ కమీషన్ మద్రాసు సందర్శించినప్పుడు నీలం సంజీవ రెడ్డి 20మంది శాసన సభ్యులతో సహా కమీషన్‌ను కలసి, భాషా రాష్ట్రాల ఏర్పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే పక్షంలో రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక రాజ్యాంగ రక్షణలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యాంనాయంగా, మద్రాసు రాజధానిగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.
ధార్ కమీషన్ 1948 చివరిలో తన నివేదికను సమర్పించింది. ప్రస్తుత పరిస్థితులలో భాషా రాష్ట్రాల ఏర్పాటు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని భావించి, ఆ ప్రతిపాదనను వాయిదా వేయాలని సూచించింది.

తెలంగాణ చరిత్ర




















తెలంగాణ చరిత్ర ,తెలంగాణ ఉద్యమ చరిత్ర

Thursday, October 1, 2015

తెలంగాణ చరిత్ర



తెలంగాణ చరిత్ర

1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు భౌగోళిక విభాగాలలో తెలంగాణా ఒకటి. ఈ ప్రాంతం 1948 సెప్టెంబరు 17న నిజాం పాలన నుంచి విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు ఆంధ్రరాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ ప్రాంతములో 10 జిల్లాలు కలవు. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. దేశంలోనే పొడవైన 7వ (కొత్త పేరు 44వ) నెంబరు జాతీయ రహదారి మరియి 9వ నెంబరు (పూనె-విజయవాడ) జాతీయ రహదారి, హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి,  తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి తెలుగు రామాయణ కర్త గోన బుద్దారెడ్డి, సహజకవి బమ్మెరపోతన, దక్షిణా భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి,  ప్రధానమంత్రిగా పనిచేసిన పివి.నరసింహారావు తెలంగాణకు చెందినవారు. చకాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారతం కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ మొత్తం వైశాల్యం 114,840 చకిమీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757 (రాష్ట్ర జనాభాలో 41.6%)గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ లో 5వ శక్తిపీఠం, భద్రాచలంలో ప్రముఖమైన రామాలయం, బాసరలో సరస్వతీ దేవాలయం ఉన్నాయి.

 భౌగోళిక స్వరూపము - నదులు


తెలంగాణ ప్రాంతము దక్కను పీఠభూమిలో  భాగంగా, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉన్నది. ఈ ప్రాంతము సరాసరిన సముద్రమట్టం నుంచి 1500 అడుగుల ఎత్తును కలిగియుండి తూర్పు వైపునకు వాలి ఉంది. తెలంగాణాలో దక్షిణ భాగంలో ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణమున ఈ ప్రాంతాన్ని రాయలసీమ నుంచి వేరుచేస్తున్నవి. ఈ ప్రాంతం విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పెద్దది కాగా, హైదరాబాదు చిన్నది. ఈ ప్రాంతానికి సముద్రతీరం లేదు. రాష్ట్రం మొత్తంగా చూస్తే కృష్ణానది పరీవాహకప్రాంతంలో 69%, గోదావరి నది పరీవాహకప్రాంతంలో 79% ఈ ప్రాంతంలోనే ఉంది.

నదులు


గోదావరి, కృష్ణా నదులతో సహా పలు నదులు తెలంగాణలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. తుంగభద్రనది మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. భీమా నది మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. దుందుభి నది మహబూబ్‌నగర్ మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. ప్రాణహిత నది ఆదిలాబాదు జిల్లా సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. మూసీ నది రంగారెడ్డి, హైదరాబాదు మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. పాలేరు నది నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమౌతుంది. కాగ్నా నది  రంగారెడ్డి జిల్లాలో పశ్చిమం దిశగా ప్రవహించి కర్ణాటకలో కృష్ణాలో సంగమిస్తుంది. మంజీరా నది మెదక్, నిజామాబాదు జిల్లాలలో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది.

తెలంగాణ చరిత్ర ఎలా చదవాలి?

మొదటి దశలో (1948-1970)
అసఫ్‌జాహీల కాలం నాటి సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ పరిస్థితులు, భౌగోళిక అంశాలు కలవు. తెలంగాణ ప్రజలు, కులాలు, మతాలు, కళలు, పండుగలు, భాషలు 1948-52 కాలంలో పరిపాలనా విధానం నిజాం రాజుల ప్రధాని సాలార్‌జంగ్‌ సంస్కరణలు ముల్కీ (లోకల్‌), నాన్‌ ముల్కీ ఉద్యమాల గురించి చదవాలి.
పై అంశాలు ఒక మెట్టు అయితే 2వ మెట్టుగా భూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా వారి మంత్రివర్గం 1952లో ముల్కీ, నాన్‌ ముల్కీ ఉద్యమాలు, 1953లోనే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై చర్చ, రాష్ట్రాల పునర్విభజన కమిటీ, ఫజల్‌ అలీ కమిటీ, సూచనలు, 1956లో జరిగిన (ఫిబ్రవరి 20న) పెద్దమనుషుల ఒప్పందం, అందులో అంశాలు ఉల్లంఘనలు 1969లో జై తెలంగాణా ఉద్యమం, అష్టసూత్రాలు, అయిదు సూత్రాలు. వాటి ప్రభావం ఎలా ఉంది, మొదలైన అంశాలు చదవాలి. ఇంకా తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు అంశం, జిఒ నెం. 36, 8, 5 సూత్రాల పథకాలు తెలుసుకోవాలి.
II 1971-90 దశ
ఇది కొంచం కష్టమైన అంశం. అభ్యర్థులు దీని కోసం కష్టపడాల్సి ఉంటుంది. జై ఆంధ్ర ఉద్యమం 1973లో రాష్ట్రపతి పాలన, షట్‌(6)సూత్ర పథకం తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన చర్యలు. రాష్ట్రపతి ఆజ్ఞలు, 1973 రాష్ట్రపతి పాలన మొదలైన అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం 312వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 371.డిలోని, జిఒ-610, ఉల్లంఘనలు పర్యవసానంగా నక్సలైట్ల ఉద్యమం, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, రైతుకూలీ ఉద్యమాలు, గిరిజనుల భూముల ఆక్రమణలు, ఆదివాసీల తిరుగుబాటు, నీరు, భూమి, అడవుల చరిత్రను తెలుసుకోవడం.
1980లో ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో వచ్చిన అనేక రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక మార్పులు-తెలంగాణ అనే భావాన్ని అణచివేయడానికి (ఆంధ్రుల విచక్షణతో కూడిన పాలన) భాషా సంస్కృతులపై దాడి తదితర అంశాలపై అవగాహన అవసరం.
1990లో ప్రపంచంలో అనేక మార్పులు వచ్చాయి. అవి గ్లోబలైజేషన్‌ (ప్రపంచీకరణ), లిబరలైజేషన్‌(సరళీకరణ), ప్రైవేటైజేషన్‌ (ప్రైవేటీకరణ) విధానాలతో తెలంగాణలో వచ్చిన మార్పులు. అనేక రంగాల్లో వచ్చిన ప్రాంతీయ అసమానతలు (ఉదాహరణ :- వ్యవసాయ రంగం, చేతివృత్తుల రంగం) వాటి ప్రభావం గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
III. మూడో దశ (1991-2014)తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ:
ఈ దశ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో చాలా కీలకమైన దశ. గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు 1991 నుండి 2014 వరకూ వరకు ఉన్న దశను క్షుణ్ణంగా, జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు (1990-2014) గురించి అభ్యర్థులు బాగా లోతుగా చదవాలి. ఆ కాలంలో ఏర్పడిన సంస్థల గురించి, రాజకీయ పార్టీల గురించి తెలుసుకోవాలి.
టిఆర్‌ఎస్‌ :
ఉద్యమాలను తేదీల వారీగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందుకు గ్రంథాలయాలకు వెళ్లి ఉద్యమ కాలం నాటి దినపత్రికలను తప్పకుండా తిప్పివేయాలి. ప్రజాశక్తి, నమస్తే తెలంగాణ, సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతిలను చదవాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమాల కోసం, ఆ ఉద్యమాల ప్రభావం ప్రజలపై ఎలా ఉంది, ఆంధ్రుల పక్షపాత పరిపాలన అంశాల అవగాహనకు తప్పనిసరిగా దినపత్రికలే శరణ్యం. తెలంగాణ ఐక్యవేదిక, భువనగిరి వేదిక, వరంగల్‌ సభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ విద్యార్థుల ఐక్యవేదిక మొదలైన అంశాలు కూడా ఇందులోకి వస్తాయి. 2001 లో కెసిఆర్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేయడానికి దారి తీసిన పరిస్థితులు, తెలంగాణకు వ్యతిరేక పవనాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, కెసిఆర్‌ 2009లో ఆమరణ నిరాహార దీక్ష (నవంబర్‌-29), అప్పటి కేంద్ర హౌంమంత్రి చిదంబరం డిసెంబర్‌-9న చేసిన తెలంగాణ ప్రకటన వరకూ క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
తెలంగాణలో పునరుజ్జీవన సాహిత్యం, కళలు, కవులు, రచయితలు, మేధావులు,
ఉద్యోగులు, కళాకారులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, మహిళలు మొదలైనవారి పాత్రలను గురించి కూడా చదవాలి.
సకలజనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌, సాగరహారం, సడక్‌ బంద్‌, పల్లెపల్లెకు మార్చ్‌, కేంద్రం ప్రకటన, పార్లమెంట్‌, అఖిలపక్ష సమావేశం, (తెలంగాణ ప్రకటన సోనియాగాంధీ), ఏపి రాష్ట్ర పునర్విభజన బిల్లు 2014 ఆమోదం, అంతకుముందు లగడపాటి దుశ్చర్యలు (పెప్పర్‌ స్ప్రే), ఆ తదుపరి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం వంటి అంశాలను అధ్యయనం చేయాలి.

Tuesday, September 29, 2015

శ్రీ కృష్ణ కమిటీ తెలుగు నివెదిక


శ్రీ కృష్ణ కమిటీ తెలుగు వెర్షన్


  • కేంద్రం 3 ఫిబ్రవరి 2010 న రిటైర్డ్ సుప్రిం కోర్టు ప్రదాన న్యాయముర్తి B.S  శ్రీకృష్ణ  నేతృత్వంతో కమిటీని నియంచింది.
  • కమిటిలో  ప్రో.అబుసలె షరీఫ్,    ప్రో. రవీందర్ కౌర్,     వి.కె. దుగ్గల్.,     ప్రో. రణబీర్ సింగ్, 
  • డిసెంబర్ 2010 న నివేదికను సమర్పించింది

Chapter 1       Chapter 2       Chapter 3
Chapter 4      Chapter 5       Chapter 6      
Chapter 7       Chapter 8       Chapter 9

తెలంగాణ సహాయ నిరాకరణ- మిలియన్ మార్చ్



17 ఫిబ్రవరి 2011 లో మొదలు పెట్టి తెలంగాణ ప్రాంత ఉద్యోగులు 16 రోజులు సహాయ నిరాకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు దీనిలో పాల్గోన్నారు. దీని తరువాత తెలంగాణ JAC ఒక మిలియన్ జనాలను హైదరాబాద్ ర్యాలీగా తరలి రమ్మని పిలుపునిచ్చింది. అదే సంవత్సరం ఈజిప్ట్ లో లక్షలాది మంది ప్రజలు కైరోను దిగ్బంధించి అధికార మార్పుకోసం చేసిన పోరాటం స్ఫూర్తిగా దానికి మిలియన్ మార్చి అని పేరు పెట్టారు. మార్చ్ 10, 2011 న హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ జరిగింది.

Monday, August 17, 2015

మహమద్ కులీకుతుబ్ షా - విశ్వ నగరంగా భాగ్యనగరం



మహమద్ కులీకుతుబ్ షా




  • క్రీ.శ 1580 లో గోల్కోండ సింహాసనాన్ని మహమద్ కులీకుతుబ్ షా అధిష్టించాడు.
  • క్రీ.శ 1591 లో హైదరాబాద్ నగరం ( భాగ్యనగరం ) నిర్మించాడు.
  • హైదరాబాద్ నగరవాస్తుశిల్పి- మీర్ మెమిన్ అస్త్రాబాది.
  • మహమద్ కులీకుతుబ్ షా తన ప్రేయసి భాగమతికి హైదర్ మహల్ అనే బిరుదును ప్రధానం చేసాడు.
  • మహమద్ కులీకుతుబ్ షా గోప్ప విద్వాంసుడు, కవి, ఇతను కలం పేరు- మానీలు.
  • మహమద్ కులీకుతుబ్ షా కాలాన్ని గోల్కోండ చరిత్రలో స్వర్ణయుగంగా భావిస్తారు.
  • గోల్కోండ కోటకు మగ్మద్ నగరు అని పేరు పేట్టాడు
  • మహమద్ కులీకుతుబ్ షా నిర్మించిన కట్టడాలు: చార్మినార్, మూసీనదికి ఆనకట్ట, చార్ కమాన్, దారుల్ షిఫా, దాదుమహల్, జామా మసీదు
  • 1593-94 హైదరాబాద్ ప్లేగు వ్యాధిని నిర్మూలించిన సందర్భంగా చార్మినార్ ను నిర్మించాడు
తెలంగణ రాజధాని నగరం హైదరాబాద్. దీనిని భాగ్యనగరం అని కూడా పిలుస్తారు. క్రీస్తుశకం 1591లో మహ్మద్‌కులీకుతుబ్ షా దీనిని నిర్మించాడు. కుతుబ్ షాహీ వంశంలో ఆయన అయిదో రాజు. ఈ నగరానికి 400ఏళ్ల చరిత్ర ఉంది. నగర చరిత్రకు చార్మినార్, గొల్కొండ కట్టడాలు మకుటాయమానం. ప్రత్యేక రాజ్యంగా అనేక ఏళ్లు వర్థిల్లిన హైదరాబాద్ ఎట్టకేలకు 1948 సైనిక చర్య తర్వాత భారత్‌లో అంతర్భాగమైంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలుగా ప్రసిద్ధికెక్కాయి. ప్రస్తుతం నగరం గ్రేటర్ హైదరాబాద్‌గా విస్తరిస్తోంది. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, సాంకేతికంగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌గా వర్థిల్లుతోంది.
   

చర్వితచరణమైనా చరిత్ర అది ఎప్పటికీ శ్రవణానందకరమే. వేల గొంతులతో వీనులవిందుచేసిన రాగాల దర్బారు కూడా ఒకనాటికి వానకారు కోయిలలా మూగబోవచ్చు. కాని బూజుపట్టిన మూగ దర్బారులోనే రాలి పడిన మువ్వ ఒకటి నాటి ఘనమైన జ్ఞాపకాలను ఏర్చికూర్చి పాటలా వినిపిస్తుంటుంది. ఆ పాట వేల రాగాలకు స్వాగతగీతం పాడుతుంది. నేటి తరాన్ని వెన్నంటి ప్రొత్సహిస్తుంది. ఇలాంటి ఘనచరిత గురుతులున్న భాగ్యనగరం నేడు సైబర్ సొబగులతో, డిజిటల్ మోతలతో ఆధునికతతో అలరారుతున్నంత మాత్రాన 'గతం గతః' అనుకుంటే పొరపాటే. మధురస్మృతులు ఒడిన దాచుకుని వడివడిగా పరుగెత్తిన మూసీ నేడు మురికినీటితో మూగబోయింది. అయినా మనసుండాలేకాని ఆ తీరంలో సాగిన నాగరికత జాడలు... ఎందరో నవాబుల, షరాబుల ప్రణయగాధలు... ఇంకెందరో గరీబుల గాయాల గుండెచప్పుళ్లు... మనకిప్పటికీ వినిపిస్తునే ఉంటాయి. 'కారే రాజులు రాజ్యముల్ గల్గవే, వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే...' అంటారు పోతనామాత్యులు. అలా రాజ్యాలు, రాజులు పోయినా ఈ సుందరనగరపు సుమధుర కథనాలు మాత్రం మనను విడిచిపోలేదు. మతంకన్నా మమతలు మిన్నని మనసుపడి ఓ నేలమగువలను మనువాడిన నవాబులు ఆనాడే అందరూ ఒక్కటేనని నిరూపించారు. ఆ ప్రేమకథలకు గురుతుగా ఈ భాగ్యనగరాన్ని బహుమతిగా మిగిల్చారు. నగరానికే ఓ అందమైన నగగా చార్‌మినార్‌ను నిలబెట్టారు. ముంగిళ్లలో ముత్యాలు రాశులుగా పోసి అమ్మిన ఈ నగరంలో నేడు 'మంచినీరు' కూడా వెలకట్టే విలువైన వస్తువుగా పరిణమించింది. అణువణువు 'ప్రియం'గా మురుతున్నా, ఎందరికో ప్రియమైన ప్రదేశంగానే మారుతోంది. ఎందరో చరిత్రపురుషులు అడుగుజాడల్లో ఈ నగరం తరించిపోయింది. ఈ మట్టివాసనలో ఆనాటి చరిత్ర జ్ఞాపకాలెన్నో పరిమళిస్తాయి. ప్రపంచాన్నే అబ్బురపరిచే విభిన్న సంస్కృతుల సమ్మిశ్రమమం ఒకవైపు, పడుగుపేకల్లా అల్లుకుపోయిన భిన్న సంస్కృతులు మరోవైపు ఈ భాగ్యనగరపు ఉనికికి నిరంతరం నీరాజనాలై వెలుగుతున్నాయి.
కుతుబ్‌షాహీల చరిత్ర
బహమనీ సుల్తానులలో రెండోవాడైన మహమ్మద్ షా (1358-75) గోల్కొండ దుర్గాన్ని ఆక్రమించగలిగాడు. క్రమ క్రమంగా బహమనీ సామ్రాజ్యం తెలంగాణా ప్రాంతాలకేకాక, కోస్తాఆంధ్ర ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఆ సామ్రాజ్యాన్ని 1482 నుంచి 1518 వరకు పరిపాలించిన మహమూద్ షా బహమనీ 1496లో ''కులీకుతుబ్-ఉల్-ముల్క్'' అనే అనుచరుని తెలంగాణా ప్రాంతానికి గవర్నర్‌గా నియమించాడు. కులీకుతుబ్ గోల్కొండను కేంద్రంగా చేసుకొని తన ఆదీనంలో ఉన్న ప్రాంతాలను పరిపాలించాడు. మహమూద్ షా బహమనీ మరణానంతరం బహమనీ సామ్రాజ్యం బలహీనపడి నామమాత్రమైంది. ఇదే అదనుగా తీసుకొని అహమ్మద్‌నగర్, బీరార్, బీదర్, బీజపూర్ రాష్ట్రాల పాలకులు స్వతంత్రులయ్యారు. ఈ తరుణంలోనే కులీకుతుబ్ 1518లో స్వతంత్ర ప్రతిపత్తిని సాధించి గోల్కొండ సామ్రాజ్యానికి మూలపురుషుడయ్యాడు.
హుస్సేన్‌సాగర్ నిర్మించిన ఇబ్రహీం
ఇబ్రహీం గొప్ప నిర్మాత. ఆయన హుస్సేన్ సాగర్‌ను నిర్మింపజేసి ఆ ప్రాంత ప్రజలకు మంచి నీటి సౌకర్యం కల్పించాడు. మూసీ నదిలో కలిసే మూడు చిన్న చిన్న ఏరులకు 2500 అడుగుల పొడుగు కల అడ్డకట్ట (టాంక్‌బండ్) వేయించడంతో ఈ సరస్సు ఏర్పడింది. దీనికి ఆ రోజులలోనే రెండున్నర లక్షల రూపాయల ఖర్చు చేశారు. ఇది పట్టణ ప్రజలకు మంచి నీరు అందివ్వడమే కాక ఇక్కడి వాతావరణాన్నే చల్లబరచింది. నేటి ప్రమాణాలతో పోల్చి చూస్తే దీనిని గొప్ప ఇంజనీరింగ్ ఘనకార్యంగానే భావించాలి. దీని పేరు దాని నిర్మాత అయిన ఇబ్రహీం పేర ఇబ్రహీంసాగర్‌గానే కుతుబ్‌షాహీ రికార్డుల్లో నమోదు అయింది. కాని దాని నిర్మాణానికి రూపకల్పన చేసి దానిని అమలుపర్చడంలో ప్రముఖపాత్ర వహించిన హుస్సేన్‌షా వలి పేరుమీదగానే ప్రజలు దీనిని హుస్సేన్‌సాగర్ అని పిలిచేవారు.
భాగ్యనగర నిర్మాత కులీకుతుబ్‌షా
హైదరాబాద్ నగర నిర్మాణం మహమ్మద్ కులీకుతుబ్ చేపట్టిన కార్యాలన్నిటిలోకి అత్యంత చిరస్మరణీయమైనది తన తండ్రి రూపొందించిన పథకం ప్రకారం మూసీకి దక్షిణదిశగా ఈ నగరాన్ని నిర్మించడం. దీనికాయన 1591లో పునాది వేశాడు. హిందూ, ముస్లిం పంచాంగాలను అనుసరించి దీనికి ముహుర్తం పెట్టించాడని ప్రతీతి. చంద్రుడు సింహరాశిలోను, బృహస్పతి తన స్వస్థానంలో ఉన్న శుభ ముహూర్తంలో ఈ నగర శంకుస్థాపన జరిగింది. దీనికి ఇరాన్‌లోని సుప్రసిద్ధ నగరమైన 'ఇస్ఫహాన్' రూపకల్పనననుసరించి 'అలీం' అనే వాస్తుశిల్పి రూపకల్పన చేశాడని చరిత్రకారుల అభిప్రాయం. అందువల్లనే ఈ నగర నిర్మాణంలో సముచిత పాత్ర వహించిన మహమ్మద్ కులీకుతుబ్ షా ప్రధానమంత్రి మీర్ మొమిన్ ఈ నగరాన్ని 'నూతన ఇస్ఫహాన్'గావర్ణించాడు.
   

నిజాంల పాలన
ఆనాటి మొగల్ చక్రవర్తులు గోల్కొండ, బీజపూర్, తమిళనాడు, గుల్బర్గా, బీదర్, బీరార్ ప్రాంతాలను ఒక సుభాగా ఏకం చేసి దాని పరిపాలనకు ఒక సుభాదారుడిని నియమించేవారు. ఈ దక్కన్ సుభాదార్ ఔరంగాబాద్‌ను కేంద్రంగా చేసుకొని ఈ ప్రాంతాలను పరిపాలించేవాడు. 1713లో ఆనాటి మొగల్ చక్రవర్తి ఫరూక్ సియార్ మీర్ కమ్రుద్దీన్ చింక్ లిచ్‌ఖాన్ అనే సర్దార్‌ను దక్కన్ సుబేదారుగా నియమించారు. రెండు సంవత్సరాల తర్వాత ఆయన స్థానంలో సయ్యద్ హుస్సేన్ ఆలీఖాన్‌ను ఆ పదవిలో నియమించారు. మీర్ కమ్రుద్దీన్ కేంద్రమంత్రులలో ఒకడిగా నియమితుడయ్యాడు. 1720లో సయ్యద్ సోదరుల తిరుగుబాటును అణచివేయడంలో ఆనాటి మొగల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా (1719-1748)కు సాయపడి ఆయన నుంచి 'నిజాం-ఉల్-ముల్క్' అనే బిరుదు పొందారు.
   

కాని ఆయన దృష్టి దక్కన్‌పైనే ఉండేది. 1920లో దక్కన్ సుబేదార్‌గా నియమితుడయ్యాడు. కాని అప్పటికే ఆ పదవిలో ఉన్న ముబారిజోఖాన్ సుబేదారీ పదవిని వదులుకోడానికి ఇష్టపడలేదు. దీంతో వీరిరువురి మధ్య 1724లో అక్టోబరు 11వ తేదీన షక్కర్‌గెడ్డ యుద్ధం జరిగింది. ఇందులో జయించిన నిజామ్ -ఉల్-ముల్క్ దక్కన్ సుబేదారుగా స్థిరపడ్డాడు. హైదరాబాద్ రాజ్యస్థాపన ఈ తేదీ నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. మహమ్మద్ ఆయనకు 'అసఫ్‌జా' అనే బిరుదు కూడా ఇచ్చాడు. నిజామ్-ఉల్-ముల్క్ వారసులు ఆ బిరుదునే తమ వంశ నామంగా ఉపయోగించారు. ఒకపక్క దక్కన్ సుబేదారుగా వ్యవహరిస్తూనే అసఫ్‌జా మొగల్ సామ్రాజ్య ప్రధాన మంత్రులలో ఒకడిగా కూడా వ్యవహరించేవాడు. 1739లో నాదిర్షా దండయాత్ర జరిగిన తర్వాత ఆయన ఢిల్లీని సందర్శించనేలేదు. ఢిల్లీ చక్రవర్తులు కూడా నామావశిష్టులైపోవడంతో నిజాం స్వతంత్రుడయ్యాడు. అలా దక్కన్ సుబేదారు ఆచరణలో స్వతంత్ర ప్రతిపత్తిని సాధించింది.
చార్మినార్‌లోని 'చార్'ల అద్భుతం
నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్ అని పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ చార్మినార్ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం. ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం నాలుగు మినార్‌ల కారణంగానే చార్మినార్‌కు ఆ పేరు స్థిరపడలేదు.
   



ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ పరిశోధనలలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టటానికి దారి తీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి. చార్మినార్‌కి ఆ పేరుపెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చార్మినార్ కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే నాలుగు మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా నాలుగుతో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్ ఒకటి. చార్మినార్ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు.
హైదరాబాద్ పేరు వెనుక చరిత్ర
అఫ్ఘాన్ ప్రాంతం నుంచి వలస వచ్చి మొగలుల ద్వారా దక్కన్ ప్రాంతానికి రాజైన సుల్తాన్‌కులీ పరిపాలన సజావుగానే సాగినప్పటికీ ఆయన ఏడుగురు కొడుకుల మధ్య సయోధ్య లేని కారణంగా కుటుంబ కలహాలు తీవ్రస్థాయిలో ఉండేవి. రాజ్య కాంక్ష, కక్షలు తీవ్రరూపం దాల్చటంతో కులీ కుమారుడు ఇబ్రహీం పొరుగు రాజ్యమైన విజయనగరంలో దాదాపు ఏడు సంవత్సరాల పాటు తలదాచుకున్నాడు. ఈ సమయంలోనే అతను విజయనగర యువరాణిలలో ఒకరైన భాగీరథిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇబ్రహీం, భాగీరథి దంపతులకు పుట్టిన మహ్మద్ కులీ కుతుబ్‌షా కలల సాకారంగా రూపొందిందే హైదరాబాద్ నగరం. మహ్మద్ కులీ ప్రేమ చిహ్నంగా హైదరాబాద్ నగరాన్ని పేర్కొనవచ్చు. షాజహాన్ ప్రేమ తాజ్‌మహల్ రూపంలో ప్రపంచం అంతా పాకింది. కులీ తన భార్య భాగమతికి ఒక నగరాన్నే అంకితం ఇచ్చాడు. అయితే పేరు వివాదాస్పదం కావటం, దానిని మార్చటానికి కులీ అంగీకరించటంతో చరిత్రలో షాజహాన్ అంతటి గొప్ప ప్రేమికుడిగాప్రత్యేక ముద్ర సంపాదించుకోలేకపోయాడు. సంప్రదాయాలను ఎదిరించి కులీ భాగమతిని వివాహం చేసుకుని కోటకు తీసుకువచ్చాడు. భాగమతి ప్రతి కదలికా అప్పట్లో సంచలనం కలిగించేదట. స్వతహాగా మంచి కవి, కళాభిరుచి ఉన్న వ్యక్తి అయిన మహ్మద్ కులీ ఆమె అందాన్ని వర్ణిస్తూ కవితలు కురిపించేవాడు. ఒక రోజు తాను కొత్తగా నిర్మిస్తున్న ప్రాంతానికి భాగమతిని తీసుకువెళ్లిన కులీ 'దీన్ని నీకు అంకితం ఇస్తున్నా' అని చెప్పాడట. నగర నిర్మాణం పూర్తయిన తర్వాత భాగమతి పేరు మీద నగరాన్ని భాగ్యనగరంగా పిలిచాడు మహ్మద్‌కులీ. అయితే ముస్లిం ప్రపంచానికి ప్రతినిధులుగా ఉండాల్సిన ప్రభువులు తమ రాజధానిని హిందూ ఛాయలు ఉన్న పేరుతో వ్యవహరించటం రాచకుటుంబంలో అనేక మందికి నచ్చలేదు. తరువాత భాగమతి తన మనుగడకే ప్రమాదం వచ్చే సూచనలు ఉండటంతో నిరాశకులోనైంది. పరిస్థితుల ప్రభావానికి తలవంచిన మహ్మద్‌కులీ మరో మార్గంలేక ప్రవక్త అల్లుడైన హైదర్అలీ పేరు మీద భాగ్యనగరాన్ని హైదరాబాద్‌గా మార్చటానికి అంగీకరించాడని చరిత్రకారుల నమ్మకం. అయితే కులీ మాత్రం హైదరాబాద్‌ని భాగ్యనగరంగానే వ్యవహరించేవాడని తెలుస్తోంది.




Tuesday, August 11, 2015

అటల్ బిహార్ వాజ్ పేయి భారతరత్న






  • లోకమాన్య తిలక్ అవార్డు,గోవింద్ వల్లభ పంత్ అవార్డు, పధ్మవిభూషన్, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డులు పోందారు.
  • ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారత ప్రధాని
  • అవిశ్వాస తీర్మానం ద్వారా ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని లోల్పోయిన ఏకైఅక ప్రధాని
  • "జై జవాన్ , జైకిసాన్, జై విజ్ఞాన్ " నినాదం

 1926 డిసెంబరు 25న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా సమీప గ్రామం బదేశ్వర్‌లో జన్మించారు. తండ్రి సంస్కృత పండితుడు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. భారతీయ సంస్కృతి పునర్వికాసం కోసం తపించే వాజ్ పేయి.. అర్.ఎస్.ఎస్లో చేరారు. అప్పట్లో క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. స్వాతంత్ర్యానంతరం అర్.ఎస్.ఎస్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేశారు. 1951లోజన్‌సంఘ్‌ లో చేరి క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టారు. 1953లో 31 ఏళ్ల వయస్సులోనే తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1968లో జన సంఘ్ అధ్యక్షుడయ్యారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో జన్‌సంఘ్‌ను జనతా పార్టీలో విలీనం చేశారు. ఇందిర సర్కారు ఆగడాలపై గళమెత్తారు. 1977లో మొరార్జీదేశాయ్‌ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. జనతా ప్రభుత్వం పతనం తర్వాత అద్వానీతో కలసి 1980లో బీజేపీకి ప్రాణం పోశారు. 1984లో కేవలం 2 స్థానాలతో పార్లమెంట్ లో ఉన్న బీజేపీ.. 1996లో మైనారిటీ సర్కారు ప్రధాని ప్రమాణస్వీకారం చేసే స్థాయికి పార్టీని తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వం 13 రోజులకే కుప్పకూలింది. 1998 ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి రెండోసారి ప్రధాని అయ్యారు. జయలలిత రాజకీయంతో ఈసారి 13 నెలలకే అధికారం కోల్పోయారు వాజ్ పేయి. 1999 ఎన్నికల్లో మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టి... ఇందిరాగాంధీ తర్వాత ప్రధానిగా మూడుసార్లు ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.  సంకీర్ణ ప్రభుత్వాన్ని వాజ్ పేయి విజయవంతంగా నడిపించారు. నవభారత నిర్మాణానికి పునాదులు వేశారు. టెలికామ్‌, పౌరవిమానయాన రంగం, బ్యాంకింగ్‌, బీమా, ప్రభుత్వ రంగ సంస్థలు, విదేశీ వాణిజ్యం-పెట్టుబడులు, పన్నులు, విద్యుత్‌, పెట్రోల్‌ ధరలు వంటి.. అనేక అంశాల్లో సంస్కరణలు అమలు చేశారు. వృద్ధిరేటు 8 శాతానికి తీసుకెళ్లారు. 1998 లో అణు పరీక్షలు చేపట్టి.. భారత్ సత్తా చాటారు. వాజ్‌పేయి మంచి ప్రధాని, సంకీర్ణ నేత మాత్రమే కాదు.. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్‌. ఆయన్ను వరించి వచ్చిన పురస్కారాలెన్నో.. గోవింద్‌ వల్లభ్‌పంత్‌ అవార్డును కూడా అటల్  అందుకున్నారు అటల్‌జీ. 1992లో పద్మవిభూషణ్‌, 1993లో గౌరవ డాక్టరేట్‌, 1994లో లోకమాన్య తిలక్‌ పురస్కారం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. జీవిత చరమాంకంలో భారత రత్నతో ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.




నిర్వహించిన పదవులు

  • 1951 – వ్యవస్థాపక సభ్యుడు, భారతీయ జనసంఘ్
  • 1957 – రెండవ లోక్‌సభకు ఎన్నిక
  • 1957–77 – నాయకుడు, భారతీయ జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ
  • 1962 – సభ్యుడు, రాజ్యసభ
  • 1966-67- ఛైర్మన్, ప్రభుత్వ అస్సూరెన్స్ కమిటీ
  • 1967 – నాలుగవ లోక్‌సభకు మరలా ఎన్నిక (రెండవ సారి)
  • 1967–70 – ఛైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
  • 1968–73 – అధ్యక్షుడు, భారతీయ జనసంఘ్
  • 1971 – ఐదవ లోక్‌సభకు ఎన్నిక. (మూడవ సారి)
  • 1977 – ఆరవ లోక్‌సభకు ఎన్నిక (నాలుగవ సారి)
  • 1977–79 – కేంద్ర కేబినెట్ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ
  • 1977–80 – వ్యవస్థాపక సభ్యుడు, జనతాపార్టీ
  • 1980 – ఏడవ లోక్‌సభకు ఎన్నిక ( ఐదవ సారి)
  • 1980-86- అధ్యక్షుడు, భారతీయ జనతాపార్టీ (బి.జె.పి)
  • 1980-84, 1986 మరియు 1993–96 – నాయకుడు, బి.జె.పి. పార్లమెంటరీ పార్టీ
  • 1986 – సభ్యుడు, రాజ్యసభ; సభ్యుడు, జనరల్ పర్పస్ కమిటీ
  • 1988–90 – సభ్యుడు, హౌస్ కమిటీ; సభ్యుడు, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ.
  • 1990-91- ఛైర్మన్, కమిటీ ఆన్ పిటీషన్స్.
  • 1991– పదవ లోకసభకు ఎన్నిక (ఆరవ సారి)
  • 1991–93 – ఛైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ.
  • 1993–96 – ఛైర్మన్, కమిటీ ఆన్ ఎక్స్‌టెర్నల్ అఫైర్స్; ప్రతిపక్ష నేత, లోక్‌సభ.
  • 1996 – 11వ లోక్‌సభకు ఎన్నిక (ఏడవ సారి).
  • 16 మే 1996 – 31 మే 1996 – భారతదేశ ప్రధానమంత్రి.
  • 1996–97 – ప్రతిపక్ష నేత, లోక్‌సభ.
  • 1997–98 – ఛైర్మన్, కమిటీ ఆన్ ఎక్స్‌టెర్నల్ అఫైర్స్.
  • 1998 – 12వ లోకసభకు ఎన్నిక (ఎనిమిదవ సారి).
  • 1998–99 – భారతదేశ ప్రధానమంత్రి; విదేశీ వ్యవహారాలమంత్రి; ఎవరికీ కేటాయించని మంత్రిత్వశాఖలకు ఇన్‌ఛార్జ్.
  • 1999 – 13వ లోక్‌సభకు ఎన్నిక (తొమ్మిదవ సారి)
  • 13 అక్టోబరు 1999 నుండి 13 మే 2004– భారతదేశ ప్రధానమంత్రి; ఎవరికీ కేటాయించని మంత్రిత్వశాఖలకు ఇన్‌ఛార్జ్.
  • 2004 – 14వ లోక్‌సభకు ఎన్నిక (పదవ సారి)




Monday, August 10, 2015

జైన మతం



  • జైన మత స్థాపకుడు- ఋషభనాధుడు.
  • జైనమతంలో తీర్థంకరుల సంఖ్య-24
  • తీర్థంకరులు అనగా" జీవప్రవాహాన్ని దాటడానికి వారిధి నిర్మించినవారు" అని అర్థం
  • మొదటి తీర్థంకరుడు - ఋషభనాధుడు. (చిహ్నం- ఎద్దు)
  • 23 వ  తీర్థంకరుడు -పార్శ్వనాధుడూ (చిహ్నం- పాము)
  • 24 వ  తీర్థంకరుడు - వర్థమాన మహావీరుడు  (చిహ్నం- సింహం)
  •  జైన మత పవిత్ర గ్రంథాలను "అంగాలు" అని పిలుస్తారు.
  • జైనుల తోలి సమావేశం సుమారు క్ర్రీ.పూ 300 సం, రం లో పాటలీ పుత్రంలో జరిగింది.
  • జైన తీర్థంకరుల జీవిత చరిత్ర తెలిపే గ్రంధం- కల్పసూత్ర
  • శ్వేతంబర శాఖను ప్రారంభించినది- స్థూలభద్ర
  • దిగంబర శాఖను ప్రారంభించినది - భద్రబాహు
  • దిగంబరులు మహావీరుని అనుచరులు



Saturday, August 8, 2015

KAKATHEEYULA, YUGAM KUTHUBSHAHIL & TELANGAANALO SAMAJIKA CHAITHANYAM




 KAKATHEEYULA YUGAM DOWNLOAD 


KUTHUBSHAHIL DOWNLOAD 


TELANGAANALO SAMAJIKA CHAITHANYAM DOWNLOAD



Tags: group of history  ts group of companies  ts group chemistry  ts group 2 notification  ts group 2 syllabus 2015  ts group 4 notification  ts group exams  ts group 1  ts group 2 posts Searches related to ts group history  ts group of companies  ts group chemistry  ts group 2 notification  ts group 2 syllabus 2015  ts group 4 notification  ts group exams  ts group 1  ts group 2 posts Searches related to ts group 2 syllabus 2015  group 2 syllabus 2015 telangana  group 2 syllabus 2015 in english  group 2 syllabus 2015 in tamil  group 2 syllabus 2015 pdf  group 2 syllabus 2015 tnpsc  group 2 syllabus in telugu  appsc group 2 syllabus 2012 pdf  group 2 syllabus in telugu medium 2016 pdf ts group history in telugu Telangana History Books in telugu Pdf Download  KAKATHEEYULA, YUGAM KUTHUBSHAHIL & TELANGAANALO SA

Sunday, July 12, 2015

ఎవరీ బాహుబలి ? బాహుబలుడు రాజ్యం చేసింది తెలంగాణలోనే?...


జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు, సునందల కుమారుడు బాహుబలి, ప్రస్తుత తెలంగాణరాష్ట్రంలోని బోధన్ (పోదనపురం) రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడని కొన్ని సారస్వత ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కాలంలో జైనమతం ఇప్పటి రూపాన్ని సంతరించుకోలేదు. నిజానికి అప్పట్లో జైన మతం అనే పేరే లేదు. మొదట్లో అంటే సింధునాగరికతా కాలం వరకు బాహుబలి జీవిత కాలంలో ఆయన తండ్రి స్థాపించిన మతాన్ని రిషభధర్మం అని వ్యవహరించారు. వేదకాలంలో వ్రత్యధర్మం అన్నారు. ఉపనిషత్తుల కాలం వచ్చే నాటికి అర్హంత్‌ ధర్మం అనీ, మౌర్యుల కాలంనాటికి నిగ్రంథి అనీ, ఆ తరువాత కాలంలో జైనం అని పిలిచారని అనేక సారస్వత ఆధారాల వల్ల తెలుస్తోంది. బాహుబలి ఒక చారిత్రక పురుషుడని కానీ, లేక పౌరాణిక పురుషుడని కానీ ఇదమిత్థంగా చెప్పటం సాధ్యం కాదు
బాహుబలి పుట్టుక:
 విష్ణుపురాణం, జైన గ్రంథాలు, ప్రచారంలో ఉన్న కొన్ని కథలను బట్టి బాహుబలి చరిత్రను తెలుసుకోవచ్చు. జైనమతానికి సంబంధించిన మొదటి తీర్థంకరుడుగా పేరుగడించిన రిషభదేవుడు అయోధ్య రాజధానిగా రాజ్యపాలన చేశాడు. ఆయనే ఇక్ష్వాకు వంశాన్ని ప్రారంభించాడని జైన మతస్తులు విశ్వసిస్తున్నారు. సునందాదేవి, యశస్వతీ దేవి (సుమంగళీదేవి అని కొందరు ఉదహరిస్తున్నారు) అనే ఇద్దరు రాకుమార్తెలను రిషభదేవుడు వివాహమాడాడు. సుమంగళకు 99 మంది కుమారులు, బ్రహ్మి అనే కుమార్తె జన్మించారు. కుమారుల్లో పెద్దవాడి పేరు భరతుడు. సునందకు బాహుబలి అనే కుమారుడు, సుందరి అనే కుమార్తె జన్మించారు. (విష్ణుపురాణం భరతుడు, బాహుబలి ఇద్దరే రిషభదేవుని కుమారులని చెబుతోంది). భరతుడు గొప్ప వీరునిగాను, రాజనీతి కోవిదుడుగానూ తయారయ్యాడు. బాహుబలి చాలా పొడగరి. మంచి దేహదారుఢ్యంతో అత్యంత బలశాలిగా తయారయ్యాడు. అతడి భుజబలం అమోఘమయింది. బ్రహ్మి సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె పేరు మీదే అప్పట్లో 'బ్రాహ్మీ' లిపిని రిషభదేవుడు కనిపెట్టాడంటారు. అశోకుని కాలంలో దొరికిన తొలి శాసనాలు అత్యధికం బ్రాహ్మి లిపిలోనే ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. సుందరి గణితంలో దిట్టయింది. వృషభదేవుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు.ఒకరోజు రాజనర్తకి అయిన 'నీరాంజన' నిండుకొలువులో ప్రభువు సన్నిధిలో నాట్యం చేస్తూ హఠాత్తుగా కిందపడి మరణిస్తుంది. ఈ మృతితో 'జీవితం క్షణభంగురం' అని అర్థమైన ఋషభనాథుడు విరక్తుడవుతాడు. తన రాజ్యంలోని అయోధ్యకు భరతుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి, పోదనపురానికి రాజుగా బాహుబలిని ప్రకటించి- తాను సర్వసంగపరిత్యాగిగా మారి జనారణ్యంలోకి వెళ్లిపోతాడు. తన రాజ్యాన్ని నూరుగురు కుమారులకు పంచిపెట్టాడు. తరువాత సన్యాస దీక్ష తీసుకుని వస్త్రభూషణాదులను త్యజించి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. అనేక ఏళ్ళ తపస్సు అనంతరం ఆయనకు జ్ఞానోదయం అయింది. దీన్నే 'జినత్వం' పొందడం అంటారు. తాను తెలుసుకున్న సత్యాలను దేశాటన చేస్తూ ప్రజలకు తెలియ చేశాడు రిషభుడు. ప్రజల్లో ఆయనకు మంచి ఆదరణ లభించింది. అనేకమంది రాజులు, వ్యాపారులు, సాధార ప్రజలు రిషభుని మతాన్ని స్వీకరించారు.

చక్రరత్న ఆయుధం

రిషభుడు లేదా రిషభదేవుడు అడవులకు వెళ్ళిన తరువాత అతని కుమారుడు భరతుడు ఓ గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం బలమైన సైన్యాన్ని నిర్మించడంతో పాటు కొత్త కొత్త ఆయుధాలను తయారుచెయ్యడం ప్రారంభించాడు. అతడి సైన్యం 'చక్రరత్న' అనే ఆయుధాన్ని తయారు చేసింది. దీన్ని భరతుడే ప్రయోగిస్తాడు. ఇది గురితప్పదు. అప్పటి ప్రపంచంలో భరతుని చేతుల్లో ఉన్న ఆయుధాలు మరెవరి దగ్గరాలేవు. అందుకే అతడు పాలిస్తున్న అయోధ్య చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ లొంగిపోయాయి. చివరికి తన 98 మంది సోదరుల రాజ్యాలను కూడా ఆక్రమించుకున్నాడు. తమ్ముళ్ళందరూ తమ రాజ్య భాగాలను అన్నగారికి అప్పగించి తమ తండ్రి ఉంటున్న అడవులకు వెళ్ళి ఆయన శిష్యులుగా మారారు. ఇలా మహా సామ్రాజ్యం స్థాపించడం వల్లనే ఈ భరతుని పేరుమీదుగా భారతదేశానికి ఆ పేరు వచ్చింది అని జైనమతం ఆధారంగా చెపుతారు. శకుంతల,దుశ్యంతుల కుమారుడైన భరతుని పేరుమీదుగా ఈ పేరు రాలేదన్నది ఈ వాదనలోని ముఖ్యాంశం అయితే భరతుని జైత్ర యాత్రను అడ్డుకుంటూ ముందుకు వచ్చిన వీరుడు మాత్రం బాహుబలి

భరతుడు, బాహుబలి ల యుద్ధం


భరతుడు బాహుబలి ఇద్దరూ బలశాలురే, ఇద్దరి బలగాలూ బలమైనవే కాబట్టి ఈ యుద్ధంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు మంత్రులు ఒక ఒప్పందం చేసారు. యుద్ధరంగంలో పోరుకు సిద్ధమైన అన్నదమ్ముల దగ్గరకు వచ్చి తమ ఒక ప్రతిపాదన వారి ముందు ఉంచారు. ఇరు సైన్యాలు తలపడితే అపార ప్రాణ నష్టం జరుగుతుందని కాబట్టి, సైన్యాలను యుద్ధంలో దించకుండా అన్నదమ్ములిద్దరే యుద్ధం చెయ్యాలని, ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోతే వారి రాజ్యం గెలిచినవారికి ఇచ్చివెయ్యాలనేది మంత్రుల ప్రతిపాదన సారాంశం. ఈ ప్రతిపాదనకు ఇద్దరూ సమ్మతించారు. వీరిద్దరి మధ్య దృష్టి యుద్ధం, జలయుద్ధం, మల్ల యుద్ధం (ద్వంద్వ యుద్ధం) అనే మూడు రకాల యుద్ధాలు జరగాలని మంత్రులు నిర్ణయించారు. అయితే ఎవ్వరూ ఆయుధం ప్రయోగించరాదనే షరతు విధించారు. ఆయుధాలు లేకుండా పోరాడి విజయం సాధించిన సమరం మానవచరిత్రలో ఇదే మొదటిది. అందుకే దీన్ని 'నిశస్త్రీకరణ' అన్నాడు. దీన్నే ఈరోజుల్లో మనం 'నిరాయుధీకరణ'గా అంటున్నాం.
ముందుగా దృష్టి యుద్ధం ప్రారంభమయింది. ఈ యుద్ధ నియమం ప్రకారం ఒకరి కళ్ళలోకి ఒకరు తీక్షణంగా చూస్తూ ఉండాలి. కళ్ళార్పకూడదు. ఎవరు ముందు కళ్ళు ఆర్పుతారో వారు ఓడిపోయినట్లు లెక్క. బాహుబలి తన అన్న భరతుని కళ్ళలోకి తీక్షణంగా చూస్తున్నాడు. అతడిలో ఏవేవో ఆలోచనలు చెలరేగుతున్నాయి. చిన్నప్పటి నుంచి తాను చూస్తున్న ఈ కళ్ళలోకి క్రోధాగ్నుల్ని ఎలా విరజిమ్మడం... అనుకుంటూ ప్రసన్నవదనంతో అన్నగారి కళ్ళలోకి చూస్తున్నాడు బాహుబలి. భరతుని పరిస్థితీ అలాగే ఉంది. తమ్ముడి ముఖంలో కనిపిస్తున్న ప్రేమ మమకార వాత్సల్యాలకు తనలో ఉన్న కోపాన్ని మరిచిపోయి ప్రశాంత చిత్తుడై కళ్ళు మూసుకున్నాడు. అంతే భరతుడు దృష్టి యుద్ధంలో ఓడిపోయినట్లు మధ్యవర్తులు ప్రకటించారు. కళ్ళుమూసి తెరిచేలోపల ఓటమి పాలవ్వడంతో భరతుడు నివ్వెరపోయాడు. రెండవదైన జలయుద్ధం ప్రారంభమయింది. నదిలో దిగి ఒకరిపై ఒకరు నీటిని చిమ్ముకోవడం ఈ యుద్ధం ప్రత్యేకత. యుద్ధం ప్రారంభమైన కొంతసేపటికి భరతుడు అలిసిపోయాడు. ఈసారి కూడా అమేయ భుజబల సంపన్నుడైన బాహుబలినే విజయం వరించింది.
రెండు యుద్ధాల్లో ఓడిపోయిన భరతుడు మల్ల యుద్ధంలోనైనా గెలవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఆ యుద్ధమూ ప్రారంభమయింది. ముందుగా భరతుడు బాహుబలునిపై పిడిగుద్దులు కురిపించాడు. రెండో గుద్దుకే బాహుబలి కిందపడిపోయాడు. తమ్ముడు కిందపడిపోవడంతో కంగారు పడ్డాడు భరతుడు. తమ్ముడు మరణిస్తున్నాడేమోనని బాధపడ్డాడు. ఇంతలో తెప్పరిల్లి పైకి లేచాడు బాహుబలి. ఇప్పుడు గుద్దే వంతు అతడిదే. అన్నను రెండు చేతుల్తో పైకి లేపి గిరగిరా తిప్పి జాగ్రత్తగా కిందకు దించాడు. గట్టిగా గుద్దటానికి చెయ్యి పైకి లేపాడు. ఈ దెబ్బతో భరతుడు చనిపోవడం ఖాయమని అక్కడ చేరిన వారందరూ హాహాకారాలు చేశారు. భరతుడు కూడా ప్రాణ భయంతో ఒణికిపోయాడు. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఆయుధాన్ని వాడరాదనే నియమాన్ని పక్కనబెట్టి తన చక్రరత్న ఆయుధాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు. కానీ అది పనిచెయ్యలేదని జైన గ్రంథాలు చెబుతున్నాయి. నియమ విరుద్ధంగా ఆయుధాన్ని ప్రయోగించాడనే కోపంతో బాహుబలి అన్నను గుద్దటానికి పిడికిలి ఎత్తాడు. చెయ్యి ఎత్తిన వెంటనే అతడి మనసులో రకరకాల ఆలోచనలు చెలరేగాయి. నేనేం చేస్తున్నాను. నా తండ్రి తృణప్రాయంగా భావించి త్యజించిన రాజ్యాధికారం కోసమా తోబుట్టువును చంపబోతున్నాను...తుచ్ఛమైన ఈ రాజ్య భోగభాగ్యాలు వద్దు. తండ్రిగారు, తమ్ముళ్ళ లాగే నేనూ సన్యాసం స్వీకరించి శాశ్వితానందాన్ని విశ్వప్రేమను పొందుతాను... ఇలా సాగింది బాహుబలి ఆలోచన. అంతే తనను క్షమించమని అన్న భరతుని కోరాడు. తన రాజ్య భాగాన్ని కూడా అన్నగారికి ఇస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటికప్పుడు సన్యాస దీక్ష తీసుకుంటున్నట్లు చెప్పి ఆభరణాలు, దుస్తులను తొలగించుకుని వెంట్రుకలను చేత్తో పీక్కున్నాడు. (జైన మతంలో దీక్ష తీసున్నవారు వెంట్రుకలను పీకడం ద్వారా తొలగించడం ఇప్పటికీ చూడవచ్చు). భరతుడు ఎంత వారిస్తున్నా వినకుండా బాహుబలి దీక్ష తీసుకున్నాడు.
తెలంగాణలో బాహుబలి

బాహుబలుడు రాజ్యం చేసింది  తెలంగాణలోనే. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న బోధన్‌ను పూర్వం పౌదన్యపురం అనీ, పోదన పురం అనీ పిలిచేవారు. ఇదే బాహుబలుని రాజధాని. ఈ విషయాన్ని చెప్పే కొన్ని ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. పోదనపురం గురించి మహాభారతంలో కూడా ఉంది. అక్కడ జైన, బౌద్ధ, వైదిక మతాలు సమానంగా విలసిల్లాయి. అటువంటి పట్టణాన్ని బాహుబలుడు తన రాజధానిగా చేసుకున్నట్లు జైన గ్రంథాలు, విష్ణుపురాణం చెబుతున్నాయి. బోధన్‌లో అనేక జైన విగ్రహాలు, ఆలయాలు కనిపించడంతో బాహుబలుని రాజధానిగా నిజంగానే ఈ పట్టణం విలసిల్లిందేమో అని కొందరు చరిత్రకారులు అంటున్నారు.


Monday, July 6, 2015

HIstory of Telangana


Telangana has been the homeland for Sathavahanas and Kakatiyas . Kotilingala in Karimnagar was the first capital of the Sathavahanas before Dharanikota . Excavations at Kotilingala revealed coinage of Simukha, a Satavahana emperor.
The region experienced its golden age during the reign of the Kakatiyas, a Telugu dynasty that ruled most parts of what is now Andhra Pradesh, India from 1083 CE to 1323. Ganapatideva was known as the greatest of the Kakatiyas and the first after the Satavahanas to bring the entire Telugu area under one rule. He put an end to the rule of the Cholas in the year 1210 who accepted his suzerainty. He established order in his vast dominion that stretched from the Godavari delta and Anakapalle in the east to Raichur (in modern day Karnataka ) in the west and from Karimnagar & Bastar (in modern day Chattisgarh ) in the north to Srisailam & Tripurantakam, near Ongole in the south. It was also during his reign that the Golkonda fort was first constructed by the Kakatiyas.
Telangana, then came under Muslim rule in 14th century for the first time by Delhi Sultanate followed by Bahmanis, Qutb Shahis and Moghals. As the Mughal Empire began to disintegrate in the early 18th century, the Muslim Asafjahi dynasty established a separate state known as Hyderabad. Later, Hyderabad entered into a treaty of subsidiary alliance with the British Empire , and was the largest and most populous princely state in India. Telangana was never under direct British rule, unlike Coastal Andhra and Rayalaseema regions of Andhra Pradesh, which were part of British India 's Madras Presidency.

Post-independence history (1948-1952)

When India became independent from the British Empire, the Nizam of Hyderabad wanted to retain his independence, but the Government of India amalgamated his state by force on September 17, 1948; after executing Operation Polo by the Indian Army. When India became independent, the Telugu -speaking people were distributed in about 22 districts ; 9 of them in the Telangana region of Nizam's Dominions ( Hyderabad State ), 12 in the Madras Presidency ( Andhra region ) and one in French-controlled Yanam. A Communist led peasant revolt started in 1946, lasted until 1951.
The central government appointed a civil servant, Keralite, Vellodi Narayana Menon K as Chief Minister of Hyderabad state on 26 January 1950. He administered the state with the help of bureaucrats from Madras state and Bombay state . In 1952, Telangana had tasted democracy for the first time when it participated in general elections and elected Dr. Burgula Ramakrishna Rao as the Chief minister of Hyderabad State . The Telugu speaking people in Madras state , enjoyed some form of democracy since 1920. During this time there was violent Mulki agitation by some Telanganites to send back bureaucrats from Madras state and to implement Mulki rules strictly.

1948-1952 Influx of Andhra People

It has to be noted that with no such precedence in Independent Indian political history, for four years, civil and military administrators ruled Hyderabad State. This period saw a huge influx of Andhra people into this region taking up all the new positions that the new India was throwing open to its people. With the pretext that people of Telangana were not educated in English or Telugu, the positions were filled up people from Andhra region. Once these people occupied these vital positions, they in turn invited many of their kith and kin to fill in many other positions. The history of Telangana Movement owes its origin to a certain extent to this period. During this time, it became evident to the people of Telangana that future holds complete marginalization of its people.
We don't make a record of migrations within the state, but if there is such a statistic, it will clearly reveal that millions of Andhra people migrate to Telangana occupying many positions in the government offices, banks, schools, colleges, universities, etc. Also, there was a great influx of businessmen from Andhra who had sold off their lands and assets in Andhra and setup business in Telangana region. We will also notice almost negligible migration happened from Telangana to Andhra regions during this period.

Mulki Rules Flouted

The Nizam set up schools, colleges, madrasas and a University that imparted education in Urdu. Nizam, who had great admiration for British, started Hyderabad Civil Service (HCS) similar to Indian Civil Service (ICS). Though Nizam had three different regions in his kingdom - Telugu, Kannada and Marathi regions - he managed the conflicts that could arise between these regions by implementing 'Mulki Rules'. Mulki Rules provide 80% reservation for local people in all recruitments for C and D posts at district level and 60% reservation for local people in Class A and B posts at divisional level. This system ensured that people of the each region got access to opportunities. The Mulki Rules came into existence in 1928.
During the influx after Independence, most of these rules were flouted using fake certificates that gave people of Andhra region a local status. When the people of Telangana realized how Andhra people were able to take up the jobs using these fake certificates, they started a protest called 'Gair Mulki Go Back!' [Non-Mulki Go Back]

1952 Hyderabad State Elections

And contrary to the contemporary belief that Telangana was never a state before, Burgula Ramakrishna Rao was elected the Chief Minister of Hyderabad State in 1952. Telangana was part of a state called Hyderabad state in India, before it became a part of Andhra Pradesh against its will.

Creation of Andhra State

While Hyderabad State came into existence on its own which included Telangana only in 1948, Telugu-speaking Andhra region was a part of Madras Presidency. This region became independent on August 15, 1947 along with rest of India as Madras Presidency.
Fearing that most of the newly created jobs and opportunities would be taken up by Tamils since they were more educated and had access to opportunities, Andhra people started a protest. Potti Sriramulu, the leader of this agitation started a 'hunger strike till death' on 19 th October 1952. Even though New Delhi surmised that these people could be given a new state with a new capital to take care of academic and government jobs and other economic opportunities, Potti Sriramulu fought for Madras city (now called Chennai) as their capital city. The recommendations given to New Delhi suggested that Madras will belong to Tamils and not to Andhra People. Potti Sriramulu died on 15 th December 1952 after 63 days of fasting.
His actions resulted in formation of First  State Reorganization Committee (SRC)  which divided the nation along linguistic lines, though Nehru was quite averse to such organization based on language.
New Delhi approved for creation of a new state called Andhra on 1 st October 1953 for the people of Andhra region carved out of erstwhile Madras Presidency.
One of the misconceptions that are flouted nowadays is that Potti Sriramulu fought for a greater and unified Vishalandhra comprising all Telugu people under one state. There is no truth to this. He had in fact fought for extremely local demands for his own people of Andhra region, and not Telangana people.

Prevailing mood before Creation of Andhra Pradesh

Hyderabad State was created in 1948, Andhra was created in 1953. Andhra people won themselves a state but not Madras. Their capital city was an unknown city called Kurnool. They were still scouting for a much needed capital city that can rival Madras. The death of Potti Sriramulu put agitation of Andhra People on the national scene. With the creation of Andhra, legitimacy for creating states on linguistic lines was gaining ground.
The same bystanders from Andhra region, who stood by while Telangana went through Razakar Movement and who later on took up many positions in the Hyderabad state now started to vie for Hyderabad city.
It should be known that Hyderabad was a very famous city in the world already. It was considered the second most important city in the Muslim World where one of the world's richest men resided. It was known for architecture marvels and international businesses. Hyderabad state was the biggest princely state in India who had direct access to British Crown.
People of Andhra now caught a new slogan to create a new state for all Telugu people, including people of Telangana. The reality had set in New Delhi that creation of states along linguistic lines could not be avoided. During First  SRC  headed by Fazal Ali, states like Kerala, Madras State (Tamil Nadu), Mysore state (later named to Karnataka), were all created based on linguistic lines. Andhra people vied for Hyderabad and hence whole of Telangana, and campaigned under the slogan that the binding factor was the common language Telugu. Though Telangana was unimpressed by such placatory moves because of the experiences of 1948-52, and though Telangana was least interested in joining Andhra, and though Telangana bitterly opposed it when it came to happen, Andhra prevailed and they were successful in annexing Telangana to form Andhra Pradesh thereby winning the crown jewel Hyderabad.
Another misconception that is flouted now is that First  SRC  has definitely agreed for creation of Andhra Pradesh from Telangana and Andhra State. That is not the case. In fact, the First  SRC clearly makes a case of Telangana. Here are the excerpts from the text:

The Case for Telangana

  • The considerations which have been argued in favour of a separate Telangana State are, however, not such as may be lightly brushed aside.
  • Some Telangana leaders seem to fear that the result of unification will be to exchange some settled sources of revenue, out of which development schemes may be financed, for financial uncertainty similar to that which Andhra is now faced. Telangana claims to be progressive and from an administrative point of view, unification it is contended is not likely to confer any benefits on this area.
  • When plans for future development are taken into account, Telangana fears that the claims of this area may not receive adequate consideration in Vishalandhra. .does not wish to lose its present independent rights in relation to the utilization of the waters of Krishna and Godavari.
  • One of the principal causes of opposition of Vishalandhra also seems to be the apprehension felt by the educationally backward people of Telangana that they may be swamped and exploited by the more advanced people of the coastal areas. In the Telangana districts outside the city of Hyderabad, education is woefully backward. While Telangana, itself may be converted into a colony by the enterprising coastal Andhra.
  • 'The Telangana' it has further been argued, can be stable and viable, unit considered by itself





ఓరుగల్లులోని పద్మాక్షి ఆలయ నిర్మాత ? పోటీ పరీక్షల ప్రత్యేకం



  పోటీ పరీక్షల ప్రత్యేకం
1. ఏ సంవత్సరంలో ఆంధ్ర జన సంఘం పేరు నిజాం రాజ్య ఆంధ్రజన సంఘంగా మార్చారు ?
- 1922
2.పాలేరు నుంచి పద్మశ్రీ వరకూ అన్న పేరుతో తన జీవిత చరిత్ర రాసుకున్నది ?
- బోయి భీమన్న
3. కుతుబ్‌షాహీల కాలంలో శిస్తు వసూలుకు ప్రమాణం ?
- సర్కార్లు (జిల్లాలు)
4. మహాతలవరి బిరుదుతో వ్యవహారం పొందిన ఇక్ష్వాక వంశ స్త్రీ ?
- శాంతిశ్రీ
5. ఏ రాజు 108 యుద్ధాలు చేసి పాపపరిహారంగా 108 శివాలయాలు నిర్మించాడు ?
- విజయాధిత్యుడు
6. రాష్ట్ర స్థాయిలో లోక్‌దళ్‌ పార్టీని ఏర్పాటు చేసిన వారు ?
- గౌతు లచ్చన్న
7.స్వారాజ్య సంపాదన కరపత్రం ఎవరిది ?
- లక్కరాజు బసవయ్య
8. కాకతీయుల కాలంలో నియోగులు అంటే ఎవరు ?
- గ్రామాధికారులు
9. పాశ్చాత్య యాత్రికులు దేన్ని రెండో ఈజిప్ట్‌గా కీర్తించారు ?
- గోల్కొండ
10. ఆంధ్రలో జైనపంచలోహ విగ్రహాలు లభించిన ప్రదేశం ?
- బాపట్ల
11. వజ్ర కరూర్‌ బంగారు గనులు ఏ జిల్లాలో ఉన్నాయి ?
- అనంతపురం
12.స్వాతంత్య్రం లేని జీవనం జీవచ్చవం లాంటిది అని చాటి చెప్పింది ?
- అనిబిసెంట్‌
13. విద్యానాధుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు ?
- రెండో ప్రతాపరుద్రుని ఆస్థానంలో
14. సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథం రచించింది ఎవరు ?
- రుద్రదేవుడు
15. హన్మకొండలో వేయి స్థంబాలగుడిని 1162లో నిర్మించింది ఎవరు ?
-కాకతీయ రుద్రదేవుడు
16. శ్రీనాథునికి కనకాభిషేకం చేసిన విజయనగర రాజు ఎవరు ?
- రెండో దేవరాయులు
17. తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో పట్టాభిషేకం చేసుకొన్నది ?
- అచ్యుతరాయలు
18. తిలక్‌ స్వరాజ్యనిధికి తన నగలనిచ్చి, విదేశీ వస్త్రాలను త్యజించి, ఖద్దరు ధరించి జాతీయోద్యంలో పాల్గొన్న తొలి మహిళ ?
- మాగంటి అన్నపూర్ణమ్మ
19.రాష్ట్రంలో ప్రాచీన శివలింగం ఎక్కడ ఉంది ?
-గుడిమల్లం
20. నరపతుల కెల్ల ఘోర దానవుడు వీడు అని నిజాంపై అగ్ని ధార కురిపించింది ? -దాశరది
21. 1857 తిరుగుబాటులో కడపప్రాంతం నుంచి పాల్గొన్న నాయకుడు ?
- పీర్‌సాహెబ్‌
22. నిమ్నజాతుల చరిత్ర రాసింది ?
-జాలా రంగస్వామి
23. ముత్యాలశాఖ సభా భవనం ఎవరిది ?
-దేవరాయలు-2
24. ప్రతి సంవత్సరం భద్రాచలం రాముని కళ్యాణ మహోత్సవానికి కానుకలు (తలంబ్రాలు) పంపే సంప్రదాయాన్ని ఏ నిజాం ప్రవేశపెట్టాడు ?
-నసీరుద్దౌలా
25. పంచతంత్రం తెలుగులో రచించింది ?
-దూబగుంట నారాయణ
26. ఆంధ్రలో ఆంగ్లేయుల మొదటి స్థావరం ?
- మచిలీపట్నం
27.చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది ?
- 1758 డిసెంబర్‌ 7
28.ఆంధ్ర భాషా సంజీవని పత్రిక స్థాపకుడు ?
- కొక్కొండ వెంకటరత్నం పంతులు
29. దేశాభిమాన పత్రిక ఎక్కడి నుంచి వెలువడింది ?
- గుంటూరు
30. ఆంధ్ర కేసరి పత్రిక సంపాదకుడు ?
- చిలుకూరి వీరభద్రరావు
31.ఓరుగల్లులోని పద్మాక్షి ఆలయ నిర్మాత ?
- మొదటి ప్రోలరాజు
32. మారన మార్కండేయ పురాణం అంకితం పొందింది ఎవరు ?
- గోన గన్నారెడ్డి
33. భాస్కర రామాయణం రచయిత ?
- హుళక్కి భాస్కరుడు
34. కేశవ దేవాలయాన్ని నిర్మించింది ?
- గంగాధరుడు(ఓరుగల్లులో)
35. సిద్దేశ్వర నిర్మాత ?
- పోలరాజు-2(హన్మకొండ)
36. వృషాధి శతకం రచయిత ?
- పాల్కురికి సోమనాథుడు
37. కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదు పొందింది ?
- రేచర్ల ప్రాసాదాదిత్యుడు
38.అశితివరాల సింగమ అని ప్రసిద్ధి చెందినవారు ?
- రేచర్ల సింగమ నాయకుడు
39. పద్మనాయకుల మొదటి రాజధాని ?
- రాచకొండ (నల్గొండ)
40. ధర్మ ప్రతిష్టాగురు, చెంచుమలచూరకార అనే బిరుదులు పొందినవాడు ?
- ప్రోలయ వేమారెడ్డి
41.విజయనగర రాజులను ఓడించి నెల్లూరును స్వాధీనం చేసుకున్నది ఎవరు ?
- అనవేమారెడ్డి
42. పురుటి సుంకం విధించి ప్రజల చేతిలో హతమైంది ఎవరు ?
- రాచవేమారెడ్డి
43. శంభుదాసుడు ప్రబంధపరమేశ్వరుడు అనే బిరుదులున్న ఎర్రన ఎవరి ఆస్థానంలోని వాడు ?
-ప్రోలయ వేమారెడ్డి
44. మధురను ఎవరి కాలంలో జయించారు ?
- బుక్కరాయలు
45. మొదటిసారిగా విజయనగర, బహ్మనీ రాజ్యాల మధ్య విభేదాలు ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి ?
- మొదటి బుక్కరాయలు
46. కన్యాశుల్కం స్థానంలో కాన్యదానాన్ని (వరకట్నం) ప్రోత్సహించిన రాజు ?
- రెండో దేవరాయలు
47. శ్రీభండారు అంటే ?
- కోశాధికారి
48. ఏకశిలారథం సప్తస్వరాల మండపాలున్న ఆలయం ?
- విఠలస్వామి ఆలయం
49.విజయనగరం వీధులలో బంగారం, రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారని చెప్పింది ఎవరు ?
- రజాక్‌
50. కళింగలో గణపతి రాజ్యస్థాపకుడు ?
- కపిలేశ్వర గణపతి
51.గీత రత్నావళి వాద్య రత్నావళి సృత్త రత్నావళి గ్రంథాల రచయిత ఎవరు ?
- జాయవసేనాని
52. ఫటోదృతి అనే బిరుదున్న కాకతీయ రాజు ?
- రుద్రమదేవి
53. ప్రతాపరుద్రుడు నర్మదానదీ తీరంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఏ శాసనాల ద్వారా తెలుస్తుంది ?
- ముసునూరి ప్రోలయ నాయకుడు, అతడి తల్లి వేయించిన కలువచేరు శాసనాల వల్ల
54. ప్రసిద్ధి చెందిన పాకాల చెరువును ఏ కాకతీయ రాజు కాలంలో సేనాని జగదల ముమ్మిడి తవ్వించాడు ?
- మొదటి ప్రోలరాజు
55. కాకతీయుల కాలంలో భూములను కొలిచే సాధనాలు ?
- గడ, లేదా కోలతో కొలిచేవారు
56. మెదడును కప్పి ఉండే వెలుపలి, మధ్య పొరల మధ్య ఉండే ద్రవం ?
- మస్తిష్క మేరుద్రవం
57. మెదడును కప్పి ఉండే మధ్య పొర ?
-లౌతికళ
58. మెదడును కప్పి ఉండే లోపలి పొర
- మృద్వి
59. మెదడును కప్పి ఉంచే, ఎముకలతో ఏర్పడిన పెట్టి లాంటి నిర్మాణం ?
- కపాలం
60. మానవుడిలో వెన్నునాడుల జతల సంఖ్య ?
-31
61. మానవుడిలో కపాల నాడుల జతల సంఖ్య ?
- 12
62. వేరులో పెరిగే భాగం ?
-కొనకింది భాగం
63.మొక్కల్లో ఆక్సిజన్‌ తయరయ్యే స్థలం ?
-విభాజ్య కణాలు
64. మొక్కల్లో పెరుగుదల పదార్ధాలుంటాయని తొలిసారి ప్రతిపాదించిన వారు ఎవరు ?
- చార్లెస్‌ డార్విన్‌
65. పరిసరాల్లో కలిగే మార్పులకు ఒక జీవి అనుక్రియ చూపే లక్షణాన్ని ఏమంటారు ?
- క్షోభ్యత
66. అగ్రాధిక్యత అంటే?
- కొనమొగ్గ పార్శ్వపు మొగ్గలను అదుపు చేయడం
67. పొట్టి మొక్కలను పొడవుగా చేయడంలో సహాయపడే హార్మోన్‌ ?
- జిబ్బర్లిన్లు
68. కణ విభజనను ప్రేరేపించే హార్మోన్‌ ?
- సైటోకైనిన్లు
69. ఆకులు, ఫలాలు రాలడంతో ప్రభావం చూపే హార్మోన్‌ పేరు ?
- అబ్‌సిసిక్‌ ఆమ్లం
70. అనిషేక ఫలాలు అంటే ?
- విత్తనాల్లేని ఫలాలు


Tuesday, June 23, 2015

మానవ హక్కుల దివిటీ మాగ్నాకార్టా


maanava hakkula diviti maagnaakaarta

గోరంత దీపం కొండంత వెలుగు..ఇది అక్షర సత్యం. మానవ హక్కుల ఉద్యమాల చారిత్రక, మహోన్నత ప్రయాణానికి మార్గనిర్దేశన చేసిన స్వేచ్ఛాయుత సామాజిక నియమావళే మాగ్నాకార్టా. ఎనిమిది శతాబ్దాల క్రితం అప్పటి ఇంగ్లాండ్ రాజు జాన్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఫలితమే ఈ మహోత్కృష్ట నియమావళి. రాజైనా పేదైనా అందరూ చట్టం ముందు సమానమేనని నాటి ఇంగ్లాండ్ ప్రజానీకం నినదించింది. రాజరికం, నిరంకుశత్వం, అరాచక పాలనలపై తిరుగుబాటు చేసి అనంతర కాలంలో యావత్ ప్రపంచం మానవ హక్కులకు పట్టం కట్టడానికి దోహదం చేసింది. మానవ విలువలంటే ఏమిటో తెలియని..నిరంకుశ పాలనలో బతికేస్తూ రాజులకు సాగిలపడటమే దైనందిన జీవితంగా భావించిన రోజుల్లోనే భావి మానవ హక్కుల మహా ప్రయాణానికి ఈ నియమావళి నాందీ ప్రస్తావన చేసింది. ఆ తిరుగుబాటు మొదట్లో కొందరు వ్యక్తులు తమ హక్కుల కోసం చేసిన పోరాటమే అయినా అది అనంతర కాలంలో ఆధునిక ప్రజాస్వామ్య దేశాకు బలమైన విలువల పునాదిగా మారింది. కింగ్‌జాన్ సంతకం చేసిన మాగ్నాకార్టా ఎన్నో మార్పులకు, చేర్పులకు లోనైనా భారత్ సహా వందకు పైగా దేశాలకు విలువల కరపత్రమే అయింది. రెండు వందల కోట్ల మంది ప్రజల జీవితాలను, జీవనాన్నీ ప్రభావితం చేస్తూనే ఉంది. మానవ,ప్రజాస్వామ్య, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కుల పరిరక్షణోద్యమాలకు అనునిత్యం వెలుగుదివ్వెగా భాసిల్లుతోంది. మానవ హక్కులను ఎప్పటికప్పుడు శక్తివంతంగా తీర్చిదిద్దడానికి, సరికొత్త విలువలతో ఉన్నత భావనలను పాదుగొల్పడానికి ఇది ఆధునిక సమాజంలోనూ ఎంతగానో దోహదం చేస్తోంది. స్వేచ్ఛాయుత జీవన హక్కులతో ముడివడి ఉన్న మానవీయ కోణాలను విస్తృతం చేస్తోంది. ఈ ఎనిమిది శతాబ్దాల కాలగతిలో ఎన్నో మార్పులు, ఎన్నో పరిణామాలు, ఎన్నో ఉత్కృష్ఠ ఘట్టాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ప్రతీది కూడా మనిషి సాధించిన ఆలోచనాత్మక, విజ్ఞానదాయక పరిణతికి తోడ్పడింది. అందుకే..నిన్న మొన్న జరిగిన పరిణామాలనే మర్చిపోతున్న నేపథ్యంలో 1215 జూన్ 15నాటి మాగ్నాకార్టా ఇప్పటికీ నిరుపమానంగా, జాజ్వల్యంగా వెలుగుతోందంటే..ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించే దేశాలకు స్ఫూర్తిదాయక మార్గదర్శకమైందంటే..దీనికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెలుగు చిన్నదే అయినా శూన్యాన్ని తరిమికొట్టడంలో అజే య శక్తే అవుతుంది. తిరుగులేని ఇంగ్లాండ్ రాజే చట్టానికి లోబడి వ్యవహరించే అనివార్య పరిస్థితిని ఈ చారిత్రక ఒప్పందం కల్పించింది. ఆ పరిణామంతో నియంతృత్వ, తిరుగులేని అధికారాలు క్రమంగా పలుచబడుతూ ప్రస్తుతం ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఆవిర్భావానికి దారితీసింది. ఈ ఎనిమిది శతాబ్దాల్లో మాగ్నాకార్టా ఉద్దేశిత సిద్ధాంతాలు, నియమాలూ కాలానుగుణంగా మార్పులు చెందుతూ, హద్దులనూ చెరిపేసుకుని విశ్వ జనీనమైన మానవ హక్కులకు ఊతాన్నిచ్చాయి. న్యాయ, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగాలూ శక్తివంతం కావడానికి దోహదం చేశాయి. భారత రాజ్యాంగానికి, అందులోని అత్యంత వౌలికమైన ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ్భావనలకు మాగ్నాకార్టానే స్ఫూర్తిదాయకమని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఒక్క భారత దేశమే కాదు, ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న అమెరికా రాజ్యాంగ రూపకల్పనలోనూ మాగ్నాకార్టా ముద్ర స్పష్టం. మానవ హక్కులు, పౌర హక్కులకు అగ్రరాజ్య రాజ్యాంగం తిరుగులేని పునాదులు వేయగలిగిందంటే..వీటి పరిరక్షణ విషయంలో రాజీలేకుండానే కొనసాగుతోందంటే అందుకు మాగ్నాకార్టా అందించిన స్ఫూర్తే నిదర్శనం. చట్ట పాలన ఎలా ఉండాలో చెప్పడమే కాకుండా, నియంతల అధికారాలకూ ఈ మహా నియమావళి కత్తెర వేసింది. నేడు మనం చెప్పుకుంటున్న మహిళా సమానత్వ హక్కులకూ ఎనిమిది శతాబ్దాల క్రితమే పునాది పడిందన్న నిజం ఈ మహోన్నత హక్కుల పత్రాన్ని విశే్లషిస్తే స్పష్టమవుతుంది. అన్ని విధాలుగా ఎంతో పరిణతి చెందిన ప్రజాస్వామ్య వాతావరణంలో జీవిస్తున్న మానవాళికి హక్కుల పరంగా, అధికారాల పరంగా ఇతరత్రా కూడా వారి స్వేచ్ఛాయుత జీవనానికి గండి కొట్టే అవాంఛనీయ పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. మహిళలు రక్షణ కోసం, విద్యార్థులు హక్కుల కోసం, కార్మికులు వేతనాల కోసం, నిరుద్యోగులు ఉపాధి కోసం చేస్తున్న చేస్తున్న ఆక్రందనలకు మూలం మాగ్నాకార్టానే. భారత రాజ్యాంగం, పౌర హక్కుల రూపకల్పనలో మాగ్నాకార్టా కనబరిచిన ప్రభావం తిరుగులేనిదే. దేశ ప్రజలకు ప్రాధమిక హక్కులను, స్వేచ్ఛనూ కల్పిస్తున్న రాజ్యాంగ 21వ అధికరణకు మాగ్నాకార్టానే మూలమని ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఈ నేపథ్యంలో ప్రస్తావించడం ఎంతైనా సముచితం. 'న్యాయపాలనలో జాప్యం జరుగకూడదు.ఎవరికీ అన్యాయం జరుగకూడదు.న్యాయం అమ్ముడు పోకూడదు'అన్న ఉదాత్త భావనలను నాడే ప్రోదిచేసుకున్న మాగ్నాకార్టా ప్రపంచ హక్కుల ఉద్యమాలన్నింటికీ దివిటీగానే పని చేసింది. ప్రజాస్వామ్య ప్రస్థానాలనూ, రాజ్యాంగాల ఆవిర్భావాన్ని, అత్యంత వౌలికమైన మానవీయ భావనలను బలంగా పాదుగొల్పే ప్రయత్నంలో మార్గదర్శనే కాదు, నిర్దేశనా చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజల ప్రాథమిక హక్కులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, రాజ్యాంగ పరమైన, పాలనాపరమైన విధానాలను మానవీయ కోణంలో రూపొందించుకోవాల్సిన అవసరమూ అంతే ఉంటుంది. భారత దేశ చట్ట, న్యాయ పాలనకు సంబంధించి అనేక కోణాల్లో మాగ్నాకార్టా స్ఫూర్తిదాయకమే అయింది. మిగతా దేశాల మాట ఎలా ఉన్నా మాగ్నాకార్టా భారత స్వాతంత్య్రోద్యమానికి తిరుగులేని శక్తిని అందించింది. ఆంగ్ల పాలకులపై రాజకీయ స్వేచ్ఛ కోసం మహాత్మాగాంధీ సాగించిన పోరాటానికి మాగ్నాకార్టానే మూలం. రాజకీయ హక్కుల సాథన, స్వేచ్ఛ సముపార్జన తమకు ముఖ్యమని చాటిచెప్పిన గాంధీ ఆ దశగానే దేశాన్ని ముందుకు నడిపించారు. ఆ మహోద్యమం ఫలించి భారతావని సర్వసత్తాక గణతంత్య్ర ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడానికి మూలం కూడా మాగ్నాకార్టానే. మూడువేల పదాలు, ఎన్నో నిబంధనలతో కూడిన మాగ్నాకార్టా నుంచే భారత రాజ్యాంగం మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాసామ్య విలువల వంటి ఉన్నత భావనలను పుణికి పుచ్చుకోగలిగింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో అమలులో ఉన్న రాజ్యాంగాలను క్రోడీకరించే దేశ రాజ్యాంగాన్ని నిర్మించుకున్నా..ఈ మొత్తం ప్రయత్నం వెనుక మాగ్నాకార్టా ప్రభావం చాలా స్పష్టం. 12శతాబ్ద కాలం నాటి సామాజిక, ఆర్థిక,రాజరిక, నిరంకుశ పరిస్థితుల పరీక్షలు నెగ్గి ఎప్పటికప్పుడు పునీతమవుతున్న మాగ్నాకార్టా తరగని వెలుగు దివ్వె. మానవ జాతి ఉన్నంత వరకూ, ఆక్రమణలు, అణచివేతలు, హక్కుల ఉల్లంఘనలు పేట్రేగుతున్నంత వరకూ ఇది తిరుగులేని స్ఫూర్తి మంత్రమే అవుతుంది. అంతిమంగా మానవ జాతి నాగరికంగా పరిణతి చెందడానికి, మానవీక కోణంలో రాణించడానికీ మాగ్నాకార్టా సాగించిన శతాబ్దాల ప్రయాణం నిరంతరం వెలుగుబాటను పట్టిస్తూనే వచ్చింది. మార్పు గుణాత్మకమైతే అది విలువలను ప్రోది చేస్తుంది. పరివర్తనాయుతమైన జీవన విధానానికి ప్రేరణ అవుతుంది. మాగ్నాకార్టాను ఈ కోణంలోనే పరిగణించాలి. అందులో ప్రవచించిన ప్రతి నిబంధన, ప్రతి డిమాండ్ ఆధునిక నాగరిక ప్రపంచావిష్కరణకు విశేషంగానే దోహదం చేసింది. మానవాళి చరిత్రలో ఎన్నో మధుర ఘట్టాలున్నాయి. ఎన్నో ఉత్కృష్ఠ పరిణామాలూ ఉన్నాయి. వీటిలో కొన్ని మాయని మచ్చలుగా మిగిలిపోతే ఇంకొన్ని సరికొత్త చరిత్రనే సృష్టించాయి. చారిత్రక గమనాన్ని నిర్దేశించడమే కాదు..అసలు ఉన్నతమైన జీవన ప్రమాణం ఏమిటో ప్రబోధించాయి. అదే క్రమంలో విలువలతో కూడిన ఉన్నత భావనలకూ ఉద్దీపనగా నిలిచాయి. ఇలాంటి ఘట్టాలెన్నింటినో తనలో ఇముడ్చుకుంటూ, ఎప్పటికప్పుడు నిగ్గుదేలుతూ సాగిన మానవ హక్కుల మహా ప్రయాణమే మాగ్నాకార్టా. కాలమేదైనా, పాలనా విధానమేదైనా..పాలకుల ధోరణులు ఒక్కటే రీతిలో ఉంటాయి. నాటి నిరంకుశ పాలకుడు కింగ్‌జాన్‌పై జరిగిన తిరుగుబాటుకు హక్కుల సాధనే కార ణం. చట్టాలు అందరికీ సమానమన్నదే మూ లం. నేడూ అలాంటి పరిస్థితులు,సవాళ్లనే మానవాళి ఎదుర్కొంటోంది. దేశమేదైనా హక్కులకు దిక్కులేని పరిస్థితులు నేడూ అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. ఎనిమిది శతాబ్దాలను పూర్తి చేసుకుంటున్న మాగ్నాకార్టానే ఇలాంటి హక్కుల ఉద్యమాలకు స్ఫూర్తి. ప్రాథమిక హక్కుల సాధనకు ఎనలేని దీృప్త. చిత్రం... మాగ్నాకార్టాపై సంతకం చేస్తున్న కింగ్ జాన్

Sunday, June 7, 2015

DSC History Study Material




DSC Study 2015  dsc study material in telugu  www.dsc-cgg.blogspot.com dsc study material  eenadu pratibha dsc study material  dsc study material in telugu pdf  dsc study material in telugu free download  dsc study material mathematics  dsc study material in english    2015 study material  dsc study material free download  dsc study material mathematics    dsc study material  dsc study material in telugu pdf   dsc study material  dsc study material in english medium  dsc study material for biology  dsc study material in hindi DSC Study Material