Showing posts with label తెలంగాణ. Show all posts
Showing posts with label తెలంగాణ. Show all posts

Friday, October 2, 2015

హైదరాబాద్ రాజ్య స్థాపన - నిజాంల పాలన


-నిజాం రాజ్యస్థాపకుడు: నిజాం ఉల్ ముల్క్. 1724లో
-రాజభాష: పర్షియా. కానీ 1893 నుంచి 1948 వరకు ఉర్దూ రాజభాషగా మారింది.
-ఉర్దూను రాజభాషగా మీర్ మహబూబ్ అలీఖాన్ మార్చాడు.
-గొప్పవాడు: మీర్ ఉస్మాన్ అలీఖాన్
-చివరివాడు: ముఖరం జాహి
-రాజముద్ర: కుల్చా (ఒక రకమైన రోటీ)

Nizam-paleces


గోల్కొండ రాజ్య పతనాంతరం మొగల్ రాజ్యంలో 21వ సుభా రాష్ట్రంగా ఔరంగజేబు కలిపివేశాడు (సుభాలు అంటే మొగల్స్ రాజ్యంలోని రాష్ర్టాలు). మొదట అక్బర్ 15 సుభాలుగా, జహంగీర్ 17 సుభాలుగా, షాజహాన్ 19 సుభాలుగా, ఔరంగజేబు 21 సుభాలుగా నెలకొల్పాడు. దీంతో మొగల్ రాజ్యంలో 1687 నుంచి 1724 వరకు గోల్కొండ ఒక రాష్ట్రంగా ఉంది. చివరికి నిజాం ఉల్‌ముల్క్ మొగల్ చక్రవర్తి మహ్మద్ షా ప్రమేయంతో స్వతంత్ర రాజ్యం నెలకొల్పాడు.

-1707లో ఔరంగజేబు మరణానంతరం భారతదేశంలో అనేక నూతన రాజ్యాలు ఏర్పడ్డాయి. దీనికి ఔరంగజేబు స్థాపించిన విశాల రాజ్యం, అతని వారసులు అసమర్ధులు కావడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. వీరు యోచన లేని రాజు, మూర్తీభవించిన మూర్ఖుడు, పిరికిపంద, రంగీలా రాజాలుగా ప్రసిద్ధి చెందారు.

ఔరంగజేబు కుమారులు

1. బహదూర్ షా-I (యోచనలేని రాజు)
2. జహందర్ షా (మూర్తీభవించిన మూర్ఖుడు)
3. ఫరూక్ సియర్ (పిరికివాడు)
4. మహ్మద్ షా (రంగీలా రాజా)

దక్కన్ విధానం

-దక్కన్ విధానం అనేది ఔరంగజేబుకు క్యాన్సర్ లాంటిది. మొగల్ సామ్రాజ్యాన్ని ఈ విధానమే నాశనం చేసిందని నాటి సమకాలీన చరిత్రకారుల అభిప్రాయం.

Mir_Nizam_Ali_Khan

-చివరికి మొగలుల కాలంలోనే బెంగాల్‌లో ముర్షీద్ ఖులీఖాన్, జేద్‌లో సాదత్ ఉల్లాఖాన్, హైదరాబాద్ (దక్కన్)లో మీర్‌కమ్రుద్దీన్ ఖాన్‌లు స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. ఇందులో హైదరాబాద్ సంస్థానమే ప్రత్యేకమైనది. ఎందుకంటే.. అది విశాలమైనది, సంపన్నమైంది, భారతదేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించింది. భారతదేశ చరిత్ర, హైదరాబాద్ చరిత్ర అనేంత వరకు వచ్చిన సందర్భాలున్నాయి. అసలు హైదరాబాద్ నగరానికి సింహాల నగరం అని పేరు. హైదర్ అంటే సింహమని, ఆబాద్ అంటే పట్టణమనే అర్థాలున్నాయి. హైదరాబాద్ మొదట అచలపురం అనే కుగ్రామంగా ఉండేది. ఇలాంటి చిన్న గ్రామాన్ని గొప్ప విశ్వనగరం (కాస్మోపాలిటన్)గా మారడానికి మహ్మద్‌కులీ కుతుబ్ షా హయాంలోని అష్రబాదీ అనే ఇంజినీర్ గొప్పతనమేనని చెప్పవచ్చు.

అష్రబాదీ ఇరాన్ నగరానికి చెందిన వ్యక్తి. హైదరాబాద్ నగర నిర్మాణ సమయంలో కుతుబ్ షా (మహ్మద్ కులీ) ఓ దేవుడా..! నేను నిర్మించే ఈ నగరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లేటట్లు, చెరువులో చేపలు వృద్ధిచెందినట్లుగా ఈ పట్టణం ప్రజలతో నిండిపోవా లని ఆశీర్వదించమని వేడుకున్నాడు. అయితే కుతుబ్ షా ప్రార్థ్ధనతో ప్రస్తుతం హైదరాబాద్ భారతదేశంలోనే గొప్ప ఆదర్శవంతమైన నగరంగా, విశ్వనగర స్థాయికి ఎదిగింది. అంటే ఒక మంచి మనస్సు, ఉన్నత ఆశయం, కృషితో మొదలు పెడితే అది విజయవంతం అవుతుందనే సూత్రం మనకు ఇందులో కన్పిస్తుంది.

హైదరాబాద్ రాజ్యం (1724-1948)


-1724లో హైదరాబాద్ రాజ్యంగా ఔరంగాబాద్‌లో రాజధానిని మీర్‌కమ్రుద్దీన్ నెలకొల్పాడు. ఇతనికే మొదటి అసఫ్‌జాహి అని, నిజాం ఉల్ ముల్క్ అని, చిన్ కిల్కిచ్ అనే బిరుదులున్నాయి. మొగల్ రాజు మహ్మద్ షా ఇతన్ని స్వతంత్ర రాజుగా గుర్తించాడు. అదే సమయంలో మరాఠాలో పీష్వాల పాలన మొదటి బాజీరావు నేతృత్వంలో హింద్ పద్‌పద్ షాహీగా భారతదేశంలో హైందవ సంస్కృతిని తిరిగి పునరుద్ధరించాలనే ఆశయం మొగలు రాజుకు తలనొప్పిగా తయారయ్యారనే ఉద్దేశంతోనే మహారాష్ట్రలో హైదరాబాద్ రాజ్యం నెలకొల్పడానికి సహాయం అందించాడు. చివరికి 1738లో హైదరాబాద్ నిజాం భోపాల్ యుద్ధంలో మొదటి బాజీరావు చేతిలో ఓడిపోయి దురై-సరై సంధితో యుద్ధం ముగించాడు. ఇతడు చివరికి 1739లో ఢిల్లీపైకి దండెత్తి నాదీర్షాకు, మొగలు రాజుకు మధ్య సయోధ్య వాతావరణాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించాడు. చివరకు 1748 లో బుర్హమ్‌పూర్‌లో మరణించాడు. ఇతని మరణంతో దక్కన్ ప్రాంతంలో సింహాసనం కోసం వారసత్వ యుద్ధ్దాలు ప్రారంభమయ్యాయి.

నిజాం ఉల్ ముల్క్ కుమారులు


1. ఘాజీఉద్దీన్
2. నాసర్ జంగ్
3. సలాబత్ జంగ్
4. బసాలత్ జంగ్
5. నిజాం అలీఖాన్
6. ముజఫర్ జంగ్
-నిజాం కుమార్తె కుమారుడు అంటే నిజాం ఉల్ ముల్క్‌కు మనవడు, నిజాం రెండో కుమారుడైన నాసర్ జంగ్‌కు మనవడు ముజఫర్ జంగ్‌కు మధ్య సింహాసనం కోసం పోటీ ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఐరోపా దేశస్తులైన ఫ్రెంచివారు ముజఫర్ జంగ్‌కు, బ్రిటీష్ వారు నాసర్ జంగ్‌కు సహాయంగా ఉన్నారు. ఇది రెండో కర్ణాటక యుద్ధానికి దారితీసింది.

నాసర్ జంగ్ (1748-50)


-నిజాం ఉల్ ముల్క్ రెండో కుమారుడు నాసర్ జంగ్. ఇతనికి మొగలు చక్రవర్తి మహ్మద్ షా నిజాం ఉద్దౌలా అనే బిరుదు ఇచ్చాడు. తన మేనల్లుడైన ముజఫర్ జంగ్‌తో వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. దీనికి బ్రిటీష్ వారి సహాయం తీసుకున్నాడు. అయితే వారికి ప్రతిఫలంగా కింది ప్రాంతాలు ఇవ్వడానికి ఇరువురి మధ్య ఒప్పందం జరిగింది.
1. ముర్తజానగర్ (గుంటూరు)
2. చికాకోల్ (శ్రీకాకుళం)
3. మచిలీపట్నం
4. ఏలూరు.
-ఈ ఒప్పందానికి నాసర్ జంగ్ ఒప్పుకోవడంతో అతనికి బ్రిటీష్‌వారు సహాయం చేశారు. అయితే కర్ణాటకలో ఫ్రెంచి గవర్నర్ డూప్లే ఆధ్వర్యంలో ఫ్రెంచి ప్రాబల్యం బలంగా ఉండటంతో వారితో జరిగిన అంబూరు యుద్ధంలో బ్రిటీష్ వారు ఓడిపోయారు. డూప్లే జీన్ ఆల్బర్ట్ అనే వితంతువును వివాహం చేసుకున్నాడు. భారతీయులకు తొలిసారిగా ఉద్యోగావకాశాలు కల్పించింది కూడా ఫ్రెంచివారే. డూప్లే రాజకీయ చతురత వల్ల హిమ్మత్‌ఖాన్‌తో నాజర్ జంగ్ చంపబడ్డాడు.

ముజఫర్ జంగ్ (1750-51)


-ఫ్రెంచివారు ఇతన్ని దక్కన్ సుబేదార్, హైదరాబాద్ నవాబ్‌గా నియమించారు. దీనికి ప్రతిఫలంగా ఫ్రెంచి గవర్నర్ డూప్లేకు జఫార్ జంగ్ (విజేత) అనే బిరుదు ఇచ్చి ముస్తఫానగర్, మచిలీపట్నం ప్రాంతాలను ధారాదత్తం చేశాడు. ఇది సహించని రాయలసీమ ముస్లిం పాళెగార్లు, నవనూర్ నవాబు (కడప జిల్లా) రాయచోటి దగ్గర్లోని లక్కిరెడ్డిపల్లి వద్ద ముజఫర్ జంగ్‌ను హతమార్చారు. (పాళేగార్ల వ్యవస్థను 1820లో థామస్ మన్రో అణిచివేశాడు)

సలాబత్ జంగ్ (1751-61)


-ఇతను నాజర్ జంగ్ సోదరుడు. హైదరాబాద్ నవాబుగా ఫ్రెంచి అధికారైన బుస్సీ నియమించాడు. ఇందుకు ప్రతిఫలంగా సలాబత్ జంగ్ ఉత్తర సర్కార్ జిల్లాలను (గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా, నెల్లూరు) కానుకగా ఇచ్చాడు. చివరికి ఫ్రెంచి ప్రాబల్యం గల 1758 చందుర్తి యుద్ధంలో, 1754లో మచిలీపట్నం యుద్ధంలో కాన్‌సాక్స్ సేనల చేతిలో ఓడిపోయాడు....... అనంతరం ఉత్తర సర్కార్ ప్రాంతాలను వెనక్కి తీసుకున్నాడు. తర్వాత 1766లో వాటిని నిజాం అలీఖాన్ బ్రిటీష్ వారికి ధారాదత్తం చేశాడు. బ్రిటీష్ వారికి ఇప్పించడంలో కాంట్రేగుల జోగి పం తులు గొప్ప దుబాసిగా (ట్రాన్సిలేటర్) ప్రసిద్ధి. ఇతను క్రియాశీలక పాత్ర పోషించాడు. ఇతనికాలంలో ఆంధ్రలో ముఖ్య సంఘటనలు..

బొబ్బిలి యుద్ధం (1757)


-బొబ్బిలి జమీందార్ విజయరంగారావుకు, విజయనగరం జమీందార్ విజయరామరాజుకు మధ్య ఉన్న వైరాన్ని బుస్సీ తనకు అనుకూలంగా మార్చుకొని, విజయనగరం జమీందార్‌తో కలిసి బొబ్బిలి రాజ్యాన్ని పతనం చేసి, విజయరంగారావును చంపివేశాడు. దీనికి కోపోద్రిక్తుడైన రంగారావు బావమర్ది తాండ్ర పాపారాయుడు (బొబ్బొలి పులి) విజయనగరంపై దండెత్తి విజయరామరాజును చంపివేశాడు. ఫ్రెంచి అధికారి బుస్సీ హైదరాబాద్‌కు పారిపోయాడు. దీంతో రెండు జమీందార్ రాజ్యాలు నాశనమయ్యాయి. చివరకు తాండ్ర పాపారాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

చందుర్తి యుద్ధం (1758)


-హైదరాబాద్ రాజ్యంలో బ్రిటీష్ వారికి, ఫ్రెంచి వారికి జరిగిన మొదటి యుద్ధం. ఈ యుద్ధంతో ఫ్రెంచివారి పతనం ప్రారంభమైంది.
పద్మనాభ యుద్ధం (1794)

-ఈ యుద్ధం బ్రిటీష్ వారికి, విజయనగర జమీందార్ అయిన చిన విజయరామరాజుకు మధ్య జరిగింది.

-ఈ యుద్ధాల తర్వాత సలాబత్‌జంగ్ పతనం చెందిన ప్రెంచివారిని కాదని బ్రిటీష్ వారికి పూర్తి మద్దతు ప్రకటించాడు.1759లో మచిలీపట్నం, నిజాంపట్నం, వక్కల్ మన్నారు, కొండవీడులను బ్రిటీష్ వారికి ఇచ్చాడు. కానీ అనంతరం జరిగిన పరిణామాల్లో సలాబత్ జంగ్‌ను నిజాంఅలీ బీదర్‌కోటలో బంధించి తనకు తానే హైదరాబాద్ పాలకుడిగా ప్రకటించుకున్నాడు.

నిజాం అలీఖాన్(1761-1803)


-ఇతన్ని రెండో అసఫ్ జా అంటారు. అలీఖాన్ కాలం నుంచే అసఫ్‌జాహీ రాజులను నిజాం అని పిలుస్తున్నారు.

-నిజాం అంటే అరబ్ భాషలో సిస్టమ్, ఆర్డర్ అని అర్థం. అంతేకాకుండా వీరు టర్కీలోని తురానీ తెగకు చెందినవారు. అక్కడి సిద్ధ సైన్యాన్ని కూడా నిజాం అంటారు. దీన్నే తమ బిరుదులుగా అసఫ్ జాహీ రాజులు ధరించారు. వీరిలో మహా ఘనత వహించిన నిజాం అని మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు పేరు ఉన్నది. నిజాం అలీఖాన్ నుంచి ఒక వ్యవస్థీకృతమైన పరిపాలనా విధానం, క్రమపద్ధతితో కూడిన పాలన ప్రారంభమైందని చెప్పవచ్చు. కాబట్టి నిజాం రాజు అని ఇతని నుంచే తొలిసారిగా పిలిచారు.

-నిజాం అలీఖాన్ ఉత్తర సర్కార్ జిల్లాలను బ్రిటీష్ వారికి 1766లో ఇచ్చివేశాడు. 1788లో గుంటూరు ప్రాంతాన్ని, 1802లో సీడెడ్ (రాయలసీమ) ప్రాంతాన్ని ధారాదత్తం చేయడం వల్ల వీటిని దత్తమండలాలు అంటారు.

వివరణ: 1808లో దత్తజిల్లాలకు అనంతపురం ముఖ్య కేంద్రప్రాంతం. అదే సంవత్సరంలో జిల్లాలుగా కడప, బళ్లారి, 1858లో కర్నూల్ జిల్లా, 1882లో అనంతపురం, 1911లో చిత్తూరు జిల్లాలుగా ఏర్పడ్డాయి. 1935లో నంద్యాల సమావేశంలో గాడిచర్ల హరిసర్వోత్తమ రావు సీడెడ్ జిల్లాలకు రాయలసీమగా పేరు పెట్టాడు.

-ఫ్రెంచి సైన్యాధికారి పీటర్‌మాండ్ సహాయంతో ఆబిడ్స్‌లోని గన్‌ఫౌండ్రిని నిజాం అలీ నిర్మించాడు. పీటర్‌మాండ్ మూస రాముడుగా ప్రసిద్ధిగాంచాడు. ఇతడి సమాధి మలక్‌పేటలో ఉంది. అలాగే 1799లో సైన్య సహకార సంధిలో భాగంగా బ్రిటీష్ రెసిడెంట్‌గా జేమ్స్‌ప్యాట్రిక్‌ను నియమించాడు.
నిజాం అలీ నిర్మాణాలు:
i. మోతీమహాల్
ii. గుల్షన్ మహల్
iii. రోషన్ మహల్
- నిజాం అలీ తర్వాత సికిందర్ జా నిజామ్‌గా వచ్చాడు.

p-murali





ముల్కీ ఉద్యమం - తెలంగాణ చరిత్ర

ముల్కీ ఉద్యమం - తెలంగాణ చరిత్ర

నిజాం రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంత ప్రజలు జమిందారీ వ్యవస్థ కింద నలుగుతూ,సరైన అవకాశాలు పొందలేని పరిస్థితులలో వారికి అవకాశాలను కల్పించడానికని ముల్కి ఉద్యమం 1918 మొదలైంది. 1930 నుండి ఊపందుకొని, స్వతంత్ర భారతంలో కలసినతరువాత కూడా వినిపించింది
హైదరాబాద్ సంస్థానంలోనూ, సమగ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ “ముల్కీ” సమస్యపై చాలాసార్లు ఆందోళనలు, ఉద్యమాలు చెలరేగాయి. “ముల్కీ” అంటే స్థానికులు. హైదరాబాద్ రాష్ట్ర అధికార భాష ఉర్దూ కావడంతో అసఫ్‌జాహీ పాలన కాలంలో ఇతర ప్రాంతాల్లో నివసించే ముస్లింలు, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, ఇతర వృత్తులు నిర్వహించుకోవడానికి అనుకూలంగా భావించి ఈ ప్రాంతానికి వలస వచ్చేవారు. ఇంకొకవైపు సంస్థానంలో జాగీర్‌దారీ వ్యవస్థ అమలులో ఉండటంతో, విద్యావకాశాలు అధికంగా లేకపోవడంతో స్థానిక ఉద్యోగాల్లో వారికి అవసరమైన అర్హతలు లేకుండాపోయాయి. దీంతో స్థానికులకు ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతూ వచ్చాయి. ఈ పరిస్థితులలో అసంతృప్తికి లోనైన స్థానికులు, బయటివారి నియామకాలకు వ్యతిరేకంగా ఆనాటి నిజాం నవాబుకు విన్నవించుకున్నారు. ఇదే ముల్కీ ఉద్యమానికి నాంది.
1918 గెజిట్ లో ప్రథమంగా ఉద్యోగాల నియామకం విషయంలో ముల్కీ ప్రస్తావన వచ్చింది. సంస్థానంలోని ఉద్యోగాలన్నీ అర్హులైన స్థానికులకే ఇవ్వాలని, విదేశీయులు – అంటే సంస్థానం బయటి నుండి వచ్చేవారు ఉద్యోగం పొందాలంటే ప్రధానమంత్రి ప్రత్యేక అనుమతి అవసరమని ప్రకటించింది. 1918లో నైజాం ప్రభుత్వం “ముల్కీ” ఫర్మానాను జారీ చేసింది. దాని ప్రకారం నిజాం ప్రభుత్వం ప్రత్యేక అనుమతి లేకుండా ముల్కీలు (స్థానికులు) కానివారిని ఏ ఉద్యోగంలో కూడా నియమించగూడదని ఆ ఫర్మానా అర్ధం. ముల్కీ అర్హతలను నాలుగు విధాలుగా రూపొందించారు.
ముల్కీ పురుషునికి కలిగిన సంతానం ముల్కీ అవుతారు.
ఇతర ప్రాంతాల నుండి వచ్చి కనీసం 15 సంవత్సరాలు సంస్థానంలో స్థిర నివాసం ఏర్పరుచుకొని, తిరిగి తమ ప్రాంతానికి పోనని ప్రమాణ పత్రం సమర్పించిన వారు.
హైదరాబాద్ సంస్థానంలో 15 సంవత్సరాలు ఉద్యోగ చేసినవారి సంతానం.
ముల్కీ పురుషుని భార్య.
1930 ప్రాంతంలో ముల్కీ ఉద్యమం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ముల్కీ నిబంధనలు అమలులో వున్నా ప్రభుత్వ ఉద్యోగాలలో చాలామంది నాన్‌ముల్కీలు (స్థానికేతరులు) ఉండేవారు. స్థానికులలో ఉన్న నిరుద్యోగ సమస్య కారణంగా అసంతృప్తి చోటు చేసుకుంది. అదేసమయంలో పరిపాలనా సంస్కరణల సూచన కొరకు నిజాం ప్రభుత్వం అరముర్ అయ్యంగార్‌తో ఒక కమీషన్‌ను నియమించింది. నాన్‌ముల్కీలను ప్రభుత్వం ఉద్యోగాలలో నియమించటం నిలిపివేయాలని స్థానికులు ఈ సంఘానికి విన్నవించుకొన్నారు. స్థానికుల విజ్ఞప్తులను దృష్టిలో వుంచుకొని, ఆ తరువాత రూపొందించిన సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్లలో నాన్‌ముల్కీలను నిజాం నవాబు ప్రత్యేక అనుమతి లేనిదే ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించరాదని నిర్దేశించారు. నైజాం సంస్థానంలో ఉద్యోగస్తులలో ముస్లిములే ఎక్కువ. కాబట్టి ముల్కీ, నాన్ ముల్కీ విభేదాలు వారి మధ్యనే ఎక్కువగా ఉండేవి.
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తరువాత ముస్లిం ఉద్యోగస్తులు చాలామంది పాకిస్తాన్ కు వలసపోయారు. సెప్టెంబర్ 1948కి ఒకటి రెండు సంవత్సరాల ముందు సంస్థానంలో నియమితులైన సంస్థానేతర ఉద్యోగస్తులు చాలామంది వారి ఉద్యోగాలను కోల్పోయారు.
హైదరాబాద్ రాష్ట్రప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, ఎన్నో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, విద్యా సౌకర్యాల కల్పన కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు సుశిక్షితులైన ఉద్యోగస్తుల కొరత ఏర్పడింది. ఇంతేకాకుండా 1949 జూన్ విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని సెకండరీ పాఠశాలలన్నింటిలోనూ ప్రాంతీయ భాషలోనే విద్యాబోధన జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం అమలు చేయడానికి కూడా తెలుగులో బోధించే, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత కూడా ఏర్పడింది. ఈ కొరతను భర్తీ చేయడానికి ఇతర ప్రాంతాల నుండి (నాన్ ముల్కీలను) ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే ప్రాంతాల నుండి అర్హులైన వారిని ఉద్యోగాలలో నియమించారు.
ఈ విధంగా పాత వ్యవస్థలో ఉద్యోగావకాశాలు లేక, కొత్త వ్యవస్థలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆశించిన స్థానిక విద్యావంతులు నిరాశకు లోనయ్యారు. పెద్ద సంఖ్యలో స్థానికేతరులకు ఉద్యోగాలు కట్టబెట్టడం వల్ల స్థానికులలో ఏర్పడ్డ అసంతృప్తి, నిరాశలను గమనించి 1950 సంవత్సరంలోనే హైదరాబద్ కాంగ్రెస్ కమిటీ హైదరాబాద్ రాష్ట్రం నుండి నాన్ ముల్కీలను వెనక్కి పంపివేయాలని ప్రభుత్వాన్ని కోరింది. 1952లో హైదరాబాద్‌లోనూ, తెలంగాణా ప్రాంతంలోనూ నాన్-ముల్కీల పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. “నాన్-ముల్కీ గో బ్యాక్”, “ఇడ్లీ – సాంబార్ గో బ్యాక్” అన్న నినాదాలు గోడలపైకి ఎక్కాయి. అక్కడక్కడా నాన్-ముల్ల్కీ ఉద్యోగులపై, వ్యాపార సంస్థలపై దాడులు కూడా జరిగాయి. హైదరాబాద్‌లో ఆందోళనకారులపై కాల్పులు కూడా జరిగాయి. ఆరుగురు విద్యార్థులు ప్రాణాలర్పించారు. అదే ఆతరువత విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమంగా రూపు దిద్దుకొంది.
1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణా జిల్లాలలో, అటు మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే జిల్లాలలో కమ్యూనిష్టులు మంచి విజయాలు సాధించారు. విశాలాంధ్ర ఏర్పడితే అధికారాన్ని చేపట్టగల అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించిన కమ్యూనిష్టులు విశాలాంధ్ర ఏర్పాటుకు ప్రచారం తీవ్రతరం చేశారు.
దేశంలోని మిగిలిన ప్రాంతాల కోరికలను పరిశీలించడానికి భారత ప్రభుత్వం 1953 ఫిబ్రవరిలో ఫజల్ ఆలీ ఆధ్వర్యంలో ఒక కమీషన్‌ను నియమించింది. ఈ కమీషన్‌లో హ్రిదయనాథ్ కుంజ్రూ, సర్దార్ కె.యం. ఫణిక్కర్‌లు ఇతర సభ్యులు. రాష్ట్రాల పునర్విభజన సంఘం (state reorganisation commission) నియమింపబడిన తరువాత విశాలాంధ్ర ఉద్యమం ఊపందుకొంది. తెలంగాణా కాంగ్రెస్ నాయకులలో మాత్రం రెండు వర్గాలు ఏర్పడి ఒక వర్గం ప్రత్యేక తెలంగాణాను కోరగా, ఇంకొక వర్గం విశాలాంధ్ర రాష్ట్రాన్ని సమర్థించింది.
బ్రిటిష్ ఇండియాలో జరిగిన 1946 ఎన్నికలకు ముందు విడుదల చేసిన ఎన్నికల ప్రణాలికలో కాంగ్రెస్ భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం జరగాలని అభిప్రాయ పడింది. స్వాతంత్ర్యం రాబోయే తరుణంలో ఆంధ్ర నాయకులు, నెహ్రూ, సర్దార్ పటేల్లను కలిసి కొత్త రాజ్యాంగం అమలులోకి రాకముందే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించుకొన్నారు. వివిధ కారణాలవల్ల ఆంధ్ర నాయకుల కోరిక ఫలించలేదు. 1948 జూన్ 17న భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు, భాషా రాష్ట్రాల కమిటీని నియమించారు. ఈ కమిటీకీ అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ధార్ అధ్యక్షుడిగా, డా|| పన్నాలాల్, జగత్ నారాయణ్ లాల్ సభ్యులుగా నియమితులైనారు.
ధార్ కమీషన్ మద్రాసు సందర్శించినప్పుడు నీలం సంజీవ రెడ్డి 20మంది శాసన సభ్యులతో సహా కమీషన్‌ను కలసి, భాషా రాష్ట్రాల ఏర్పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే పక్షంలో రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక రాజ్యాంగ రక్షణలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యాంనాయంగా, మద్రాసు రాజధానిగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.
ధార్ కమీషన్ 1948 చివరిలో తన నివేదికను సమర్పించింది. ప్రస్తుత పరిస్థితులలో భాషా రాష్ట్రాల ఏర్పాటు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని భావించి, ఆ ప్రతిపాదనను వాయిదా వేయాలని సూచించింది.

తెలంగాణ చరిత్ర




















తెలంగాణ చరిత్ర ,తెలంగాణ ఉద్యమ చరిత్ర

Thursday, October 1, 2015

తెలంగాణ చరిత్ర



తెలంగాణ చరిత్ర

1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు భౌగోళిక విభాగాలలో తెలంగాణా ఒకటి. ఈ ప్రాంతం 1948 సెప్టెంబరు 17న నిజాం పాలన నుంచి విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు ఆంధ్రరాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ ప్రాంతములో 10 జిల్లాలు కలవు. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. దేశంలోనే పొడవైన 7వ (కొత్త పేరు 44వ) నెంబరు జాతీయ రహదారి మరియి 9వ నెంబరు (పూనె-విజయవాడ) జాతీయ రహదారి, హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి,  తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి తెలుగు రామాయణ కర్త గోన బుద్దారెడ్డి, సహజకవి బమ్మెరపోతన, దక్షిణా భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి,  ప్రధానమంత్రిగా పనిచేసిన పివి.నరసింహారావు తెలంగాణకు చెందినవారు. చకాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారతం కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ మొత్తం వైశాల్యం 114,840 చకిమీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757 (రాష్ట్ర జనాభాలో 41.6%)గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ లో 5వ శక్తిపీఠం, భద్రాచలంలో ప్రముఖమైన రామాలయం, బాసరలో సరస్వతీ దేవాలయం ఉన్నాయి.

 భౌగోళిక స్వరూపము - నదులు


తెలంగాణ ప్రాంతము దక్కను పీఠభూమిలో  భాగంగా, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉన్నది. ఈ ప్రాంతము సరాసరిన సముద్రమట్టం నుంచి 1500 అడుగుల ఎత్తును కలిగియుండి తూర్పు వైపునకు వాలి ఉంది. తెలంగాణాలో దక్షిణ భాగంలో ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణమున ఈ ప్రాంతాన్ని రాయలసీమ నుంచి వేరుచేస్తున్నవి. ఈ ప్రాంతం విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పెద్దది కాగా, హైదరాబాదు చిన్నది. ఈ ప్రాంతానికి సముద్రతీరం లేదు. రాష్ట్రం మొత్తంగా చూస్తే కృష్ణానది పరీవాహకప్రాంతంలో 69%, గోదావరి నది పరీవాహకప్రాంతంలో 79% ఈ ప్రాంతంలోనే ఉంది.

నదులు


గోదావరి, కృష్ణా నదులతో సహా పలు నదులు తెలంగాణలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. తుంగభద్రనది మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. భీమా నది మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. దుందుభి నది మహబూబ్‌నగర్ మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. ప్రాణహిత నది ఆదిలాబాదు జిల్లా సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. మూసీ నది రంగారెడ్డి, హైదరాబాదు మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. పాలేరు నది నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమౌతుంది. కాగ్నా నది  రంగారెడ్డి జిల్లాలో పశ్చిమం దిశగా ప్రవహించి కర్ణాటకలో కృష్ణాలో సంగమిస్తుంది. మంజీరా నది మెదక్, నిజామాబాదు జిల్లాలలో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది.

తెలంగాణ చరిత్ర ఎలా చదవాలి?

మొదటి దశలో (1948-1970)
అసఫ్‌జాహీల కాలం నాటి సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ పరిస్థితులు, భౌగోళిక అంశాలు కలవు. తెలంగాణ ప్రజలు, కులాలు, మతాలు, కళలు, పండుగలు, భాషలు 1948-52 కాలంలో పరిపాలనా విధానం నిజాం రాజుల ప్రధాని సాలార్‌జంగ్‌ సంస్కరణలు ముల్కీ (లోకల్‌), నాన్‌ ముల్కీ ఉద్యమాల గురించి చదవాలి.
పై అంశాలు ఒక మెట్టు అయితే 2వ మెట్టుగా భూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా వారి మంత్రివర్గం 1952లో ముల్కీ, నాన్‌ ముల్కీ ఉద్యమాలు, 1953లోనే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై చర్చ, రాష్ట్రాల పునర్విభజన కమిటీ, ఫజల్‌ అలీ కమిటీ, సూచనలు, 1956లో జరిగిన (ఫిబ్రవరి 20న) పెద్దమనుషుల ఒప్పందం, అందులో అంశాలు ఉల్లంఘనలు 1969లో జై తెలంగాణా ఉద్యమం, అష్టసూత్రాలు, అయిదు సూత్రాలు. వాటి ప్రభావం ఎలా ఉంది, మొదలైన అంశాలు చదవాలి. ఇంకా తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు అంశం, జిఒ నెం. 36, 8, 5 సూత్రాల పథకాలు తెలుసుకోవాలి.
II 1971-90 దశ
ఇది కొంచం కష్టమైన అంశం. అభ్యర్థులు దీని కోసం కష్టపడాల్సి ఉంటుంది. జై ఆంధ్ర ఉద్యమం 1973లో రాష్ట్రపతి పాలన, షట్‌(6)సూత్ర పథకం తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన చర్యలు. రాష్ట్రపతి ఆజ్ఞలు, 1973 రాష్ట్రపతి పాలన మొదలైన అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం 312వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 371.డిలోని, జిఒ-610, ఉల్లంఘనలు పర్యవసానంగా నక్సలైట్ల ఉద్యమం, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, రైతుకూలీ ఉద్యమాలు, గిరిజనుల భూముల ఆక్రమణలు, ఆదివాసీల తిరుగుబాటు, నీరు, భూమి, అడవుల చరిత్రను తెలుసుకోవడం.
1980లో ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో వచ్చిన అనేక రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక మార్పులు-తెలంగాణ అనే భావాన్ని అణచివేయడానికి (ఆంధ్రుల విచక్షణతో కూడిన పాలన) భాషా సంస్కృతులపై దాడి తదితర అంశాలపై అవగాహన అవసరం.
1990లో ప్రపంచంలో అనేక మార్పులు వచ్చాయి. అవి గ్లోబలైజేషన్‌ (ప్రపంచీకరణ), లిబరలైజేషన్‌(సరళీకరణ), ప్రైవేటైజేషన్‌ (ప్రైవేటీకరణ) విధానాలతో తెలంగాణలో వచ్చిన మార్పులు. అనేక రంగాల్లో వచ్చిన ప్రాంతీయ అసమానతలు (ఉదాహరణ :- వ్యవసాయ రంగం, చేతివృత్తుల రంగం) వాటి ప్రభావం గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
III. మూడో దశ (1991-2014)తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ:
ఈ దశ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో చాలా కీలకమైన దశ. గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు 1991 నుండి 2014 వరకూ వరకు ఉన్న దశను క్షుణ్ణంగా, జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు (1990-2014) గురించి అభ్యర్థులు బాగా లోతుగా చదవాలి. ఆ కాలంలో ఏర్పడిన సంస్థల గురించి, రాజకీయ పార్టీల గురించి తెలుసుకోవాలి.
టిఆర్‌ఎస్‌ :
ఉద్యమాలను తేదీల వారీగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందుకు గ్రంథాలయాలకు వెళ్లి ఉద్యమ కాలం నాటి దినపత్రికలను తప్పకుండా తిప్పివేయాలి. ప్రజాశక్తి, నమస్తే తెలంగాణ, సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతిలను చదవాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమాల కోసం, ఆ ఉద్యమాల ప్రభావం ప్రజలపై ఎలా ఉంది, ఆంధ్రుల పక్షపాత పరిపాలన అంశాల అవగాహనకు తప్పనిసరిగా దినపత్రికలే శరణ్యం. తెలంగాణ ఐక్యవేదిక, భువనగిరి వేదిక, వరంగల్‌ సభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ విద్యార్థుల ఐక్యవేదిక మొదలైన అంశాలు కూడా ఇందులోకి వస్తాయి. 2001 లో కెసిఆర్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేయడానికి దారి తీసిన పరిస్థితులు, తెలంగాణకు వ్యతిరేక పవనాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, కెసిఆర్‌ 2009లో ఆమరణ నిరాహార దీక్ష (నవంబర్‌-29), అప్పటి కేంద్ర హౌంమంత్రి చిదంబరం డిసెంబర్‌-9న చేసిన తెలంగాణ ప్రకటన వరకూ క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
తెలంగాణలో పునరుజ్జీవన సాహిత్యం, కళలు, కవులు, రచయితలు, మేధావులు,
ఉద్యోగులు, కళాకారులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, మహిళలు మొదలైనవారి పాత్రలను గురించి కూడా చదవాలి.
సకలజనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌, సాగరహారం, సడక్‌ బంద్‌, పల్లెపల్లెకు మార్చ్‌, కేంద్రం ప్రకటన, పార్లమెంట్‌, అఖిలపక్ష సమావేశం, (తెలంగాణ ప్రకటన సోనియాగాంధీ), ఏపి రాష్ట్ర పునర్విభజన బిల్లు 2014 ఆమోదం, అంతకుముందు లగడపాటి దుశ్చర్యలు (పెప్పర్‌ స్ప్రే), ఆ తదుపరి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం వంటి అంశాలను అధ్యయనం చేయాలి.