Tuesday, September 29, 2015

తెలంగాణ సహాయ నిరాకరణ- మిలియన్ మార్చ్



17 ఫిబ్రవరి 2011 లో మొదలు పెట్టి తెలంగాణ ప్రాంత ఉద్యోగులు 16 రోజులు సహాయ నిరాకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు దీనిలో పాల్గోన్నారు. దీని తరువాత తెలంగాణ JAC ఒక మిలియన్ జనాలను హైదరాబాద్ ర్యాలీగా తరలి రమ్మని పిలుపునిచ్చింది. అదే సంవత్సరం ఈజిప్ట్ లో లక్షలాది మంది ప్రజలు కైరోను దిగ్బంధించి అధికార మార్పుకోసం చేసిన పోరాటం స్ఫూర్తిగా దానికి మిలియన్ మార్చి అని పేరు పెట్టారు. మార్చ్ 10, 2011 న హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ జరిగింది.