Sunday, September 12, 2021

Airtel కొత్తగా మరొక 4G డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది

 


ఇండియాలో రెండవ అతి పెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క వినియోగదారుల కోసం కొత్తగా సరసమైన ధర వద్ద 4G డేటా రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ రూ.119 ధర వద్ద లభిస్తుంది. ఇది ఇప్పటికే టెల్కో యొక్క వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. కంపెనీ ఈ ప్లాన్‌ను నిశ్శబ్దంగా ప్రారంభించింది. ఈ ప్యాక్‌తో వినియోగదారులు 15GB డేటాను పొందుతారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క చెల్లుబాటు వినియోగదారుల ప్రస్తుత అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్ వలె ఉంటుంది. రూ.119 ప్లాన్‌తో అదనంగా 30 రోజుల పాటు 'ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్' యొక్క ప్రయోజనం కూడా పొందవచ్చు.