Monday, November 30, 2015

జాతీయ మానవ హక్కుల కమీషన్



  


జాతీయ మానవ హక్కుల కమీషన్ చట్టబద్దమైన, స్వయం ప్రతిపత్తి సంస్థ, కాని రాజ్యాంగబధ్ధమైన సంస్థ కాదు. "మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993" ప్రకారం జాతీయ మానవ హక్కుల కమీషన్ అక్టోబర్ 12 , 1993 న ఏర్పడింది. కాంగ్రేస్ పార్టీ అధికారంలో పి.వి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ కమీషన్ ను ఏర్పాటు చేశారు. 1993  మానవ హక్కుల చట్టాన్ని 2006 సంవత్సరంలో సవరించి ఈ  కమీషన్ లో కోన్ని మార్పులు చేశారు.
  • దీన్ని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
  • జాతీయ మానవ హక్కుల కమీషన్ లో ఒక చైర్మన్, నలుగురు ఇతర సభ్యులు ఉంటారు.
సభ్యులకు ఉండవలసిన అర్హతలు: 
  • చైర్మన్ గా నియమించబడే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి.
  • ఒక సభ్యుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా పనిచేస్తున్న లేదా పదవి విరమణ చేసిన వారై ఉండాలి.
  • మరోక సభ్యుడు ఏదైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పదవి విరమణ చేసిన వారై ఉండాలి.
  • మిగిలిన ఇద్దరు సభ్యులు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్న వారై ఉండాలి











 UPLOAD అవుతుంది.......