Notification,Syllabus,Model Papers, SBI Jobs, Material, SI, E Books Download, Online Results, Mobile Useful , Android, New Apps,Tech News,apk file,
Tuesday, June 6, 2023
TSPSC Group I & II Study Material PDF
Telangana Movements download pdf
Telangana Movement Book pdf
Polity Book Download -pdf
Indian Constitution - pdf
Wednesday, May 24, 2023
Group I, II, III, IV - Political Science Video Links
Group I, II, III, IV - Political Science Video Links
Parts of Indian Constitution | Indian Polity Tips & Tricks | Indian Polity Classes In Telugu
Delimitation of Parliamentary Assembly Constituencies | Delimitation Commission | Indian Polityn
INDIAN CONSTITUTION ARTICLES EASY TECHNIQUES TO REMEMBER
President Election Procedure, Calculation Explained I Polity Classes In Telugu
Indian Constitution Schedules Tips in Telugu | Trick to Remember 12 Schedules
Amending Procedure of Indian Constitution | Part 1
INDIAN CONSTITUTION - TIPS & TRICKS | POLITY CLASSES IN TELUGU KRISHNA REDDY
Monday, February 27, 2023
పార్లమెంటులోని బిల్లుల రకాలు
రాజ్యాంగంలో పేర్కొన్న నాలుగు రకాల బిల్లులు:
1. సాధారణ బిల్లు
2. ద్రవ్య బిల్లు
3. ఆర్థిక బిల్లు
4. రాజ్యాంగ సవరణ బిల్లు
1.సాధారణ బిల్లు
డబ్బు, ఆర్థిక లేదా రాజ్యాంగ సవరణ బిల్లు కాకుండా వేరే ఏదైనా బిల్లును సాధారణ బిల్లు అంటారు. దీనిని పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టవచ్చు. దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి సిఫారసు అవసరం లేదు (ఆర్టికల్ 3 ప్రకారం బిల్లు మినహా). ఇది ఉభయ సభల ద్వారా సాధారణ మెజారిటీతో ఆమోదించబడుతుంది. వారు సాధారణ బిల్లు ఆమోదంపై సమాన శాసన అధికారాలను పొందుతారు. బిల్లుపై ప్రతిష్టంభన ఉంటే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో పరిష్కరించవచ్చు.
సాధారణ బిల్లులో వివిధ దశలు ఉంటాయి. అవి..
ప్రవేశ దశ : ఒక బిల్లును సభలో ప్రవేశపెడుతున్న సభ్యుడు, ఆ బిల్లు పేరును, ఆవశ్యకతను, ప్రాధాన్యతను వివరిస్తాడు. ఈ దశలో బిల్లుపైన ఎలాంటి చర్చ జరగదు.
పరిశీలన దశ : ఈ దశలో ముద్రించిన బిల్లుల పత్రాలను సభ్యులకు పంపిస్తారు. అనంతరం బిల్లుపైన సమగ్రమైన, విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఈ దశలో
-బిల్లును చర్చించి, వెంటనే ఆమోదించమని అడగవచ్చు.
-బిల్లును సెలెక్ట్ కమిటీకి లేదా రెండో సభ అంగీకారంతో జాయింట్ సెలక్ట్ కమిటీకి నివేదించవచ్చు
-బిల్లుపై ప్రజాభిప్రాయసేరకరణ జరపమని అడగవచ్చు.
కమిటీ దశ : బిల్లులను సెలెక్ట్ కమిటీ అభిప్రాయానికి పంపిస్తారు. సెలెక్ట్ కమిటీ సంఖ్యను ఆయా సభాధ్యక్షులు నిర్ణయిస్తారు. సాధారణంగా వీరి సంఖ్య 20 నుంచి 30 వరకు ఉంటుంది. ఉభయసభల సభ్యులతో కలిపి ఏర్పాటు చేస్తే దానిని జాయింట్ సెలెక్ట్ కమిటీ అంటారు. ఈ కమిటీ సూచించిన సవరణను, ప్రతిపాదనలను సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
ఆమోద దశ – ఈ దశలో బిల్లుపై పరిమితంగా చర్చించడాని సభ్యులకు అనుమతి లభిస్తుంది. బిల్లులను అంగీకరించడానికి, నిరాకరించడానికి మాత్రమే చర్చ పరిమితమవుతుంది. హాజరై ఓటు వేసిన సభ్యులలో మెజారిటీ సభ్యులు అంగీకరిస్తే ఆ బిల్లును సభ ఆమోదించినట్లు సభాపతి ప్రకటిస్తారు. దీంతో సభలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రక్రియ పూర్తవుతుంది.
a)రెండో సభలోకి బిల్లు వెళ్లడం: బిల్లు శాసనంగా మారడానికి ఉభయసభలు ఆమోందించాల్సి ఉంటుంది. బిల్లును ఏ సభలో ప్రవేశపెడుతారో అక్కడ అది ఆమోదంపొందిన తర్వాత దానిని రెండో సభ ఆమోదం కోసం పంపిస్తారు. ఇలా పంపిన బిల్లును -సభ పూర్తిగా తిరస్కరించవచ్చు
-బిల్లులో కొన్ని సవరణలు ప్రతిపాదించి, ప్రవేశపెట్టిన సభకు పునఃపరిశీలనకు పంపవచ్చు. రెండో సభ చేసిన సవరణను మొదటి సభ అంగీకరించకపోతే ఆ బిల్లు సవరణలకు అనుగుణంగా రెండు సభలు ఆమోదించినట్లుగా పరిగణిస్తారు. అలాకాకుండా రెండో సభ సూచించిన సవరణను మొదటి సభ వ్యతిరేకిస్తే బిల్లు విషయంలో ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడుతుంది.
-రెండోసభకు పంపిన బిల్లులపై ఆ సభ ఎలాంటి చర్య తీసుకోకుండా అలాగే ఉండవచ్చు. ఏ అభిప్రాయాన్ని వ్యక్తీకరించకుండా బిల్లును వాయిదావేయడం, ఆ బిల్లును 6 నెలల కంటే ఎక్కువ కాలం తన దగ్గరే ఉంచుకున్న సందర్భంలో కూడా ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉభయసభలను సంయుక్తంగా సమావేశ పరుస్తారు.
b)ఉభయ సభల సంయుక్త సమావేశం: ఒక బిల్లు ఆమోదం విషయంలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన నెలకొంటే దానిని తొలగించడానికి ప్రకరణ 108 ప్రకారం, రాష్ట్రపతి ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఉభయసభల్లో మెజారిటీ సభ్యులు బిల్లును ఆమోదిస్తే అది పార్లమెంటు చేత అంగీకరించినట్లుగా భావిస్తారు.
c)రాష్ట్రపతి ఆమోదం: ఉభయసభలు వేర్వేరుగా గాని, సంయుక్తంగా గాని ఆమోదించిన తరువాత ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తే అది చట్టంగా మారుతుంది. అయితే అది ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి అమలులోకి వస్తుంది. రాష్ట్రపతి బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అలాకాకుండా పార్లమెంటు పరిశీలనకు పంపించవచ్చు. దీనితర్వాత పంపించిన బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది
2. ద్రవ్య బిల్లు
ప్రకరణ 110 లో ద్రవ్యబిల్లు గురించి వివరించబడినది. దీని ప్రకారం పన్ను విధించడం, తగ్గించడం, క్రమబద్దీకరణ చేయడం, ప్రభుత్వ రుణాలను క్రమబద్దీకరించడం, భారత సంఘటిత నిధి, అగంతక నిధి నుంచి జమ చేయడం – తీసుకోవడం, ఆ నిధిని వినియోగించుకోవడం, ఏ వ్యయాన్నయినా భారత సంఘటిత నిధికి వ్యయంగా ప్రకటించడం, సంఘటిత నిధి లేదా ప్రభుత్వ ఖాతాలకు ద్రవ్యం స్వీకరించడం, ఖాతాల నుంచి విడుదల, తనిఖీ చేయడం వంటి అంశాలు ద్రవ్యబిల్లుల పరిధిలోకి వస్తాయి. కానీ, అవి ద్రవ్యబిల్లు కాదు. ఏదైనా బిల్లు ద్రవ్యబిల్లా కాదా అనే ప్రశ్నతలెత్తితే స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారు. దానిని ఏ న్యాయస్థానం ప్రశ్నించడానికి వీల్లేదు.
ద్రవ్యబిల్లును రాష్ట్రపతి సిఫారుసుపై లోక్సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ ధృవపత్రంతో దానిని రాజ్యసభకు పంపిస్తారు.
ద్రవ్యబిల్లుపై రాజ్యసభ అధికారాలు
ద్రవ్యబిల్లుపై రాజ్యసభకు అధికారాలు ఈ కింది విధంగా ఉంటాయి. అవి..
-బిల్లును ఆమోదించవచ్చు
-బిల్లుపై చర్చ జరపవచ్చు
-కొన్ని సిఫారసులు చేయవచ్చు.
ఈ అంశాలన్నింటిపైన రాజ్యసభ 14 రోజుల్లోపు తన నిర్ణయాన్ని తెలపాలి.
అయితే రాజ్యసభకు ద్రవ్యబిల్లును తిరస్కరించే అధికారంగానీ, సవరించే అధికారం గానీ లేదు. అందువల్ల ద్రవ్యబిల్లు ఆమోదం విషయంలో లోక్సభదే అంతిమ అధికారం అవుతుంది. ఉభయసభల మధ్య ఎలాంటి ప్రతిష్టంభన ఉండదు. ఇలాంటి బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. పునఃపరిశీలనకు గాని, నిలిపివేయడం వంటి అధికారాలు రాష్ట్రపతికి ఉండవు.
3. ఆర్థిక బిల్లు .
ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ప్రస్తావన ఉన్న బిల్లులను ఆర్థిక బిల్లులు అంటారు. అయితే ఆర్థిక బిల్లు అనే పదాన్ని కేవలం సాంకేతిక అర్థంతో ఉపయోగించారు. అందువల్ల ఆర్థిక బిల్లును ద్రవ్యబిల్లులు (ప్రకరణ 110) అంటారు.
ఆర్థిక బిల్లులను రెండు రకాలుగా వర్గీకరించారు. మొదటి రకం (ప్రకరణ 117(1), రెండోరకం (ప్రకరణ 118(3))
ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులో భాగమే. ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కాదు. స్పీకర్ ధృవీకరించిన ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు అవుతాయి. అంటే ఆర్థిక, ద్రవ్య బిల్లులకు మధ్య తేడా స్పీకర్ ధృవీకరణ మాత్రమే. దీనిని సాంకేతికపరమైన తేడా అంటారు. ఈ విధమైన ఆర్థిక బిల్లులో ప్రకరణ 110లో పేర్కొన్న అంశాలే కాకుండా ఇతర సాధారణ విషయాలు కూడా ఉంటాయి. వీటిని కూడా రాష్ట్రపతి ఆమోదంతోనే లోక్సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
ఇక రెండో రకమైన ఆర్థిక బిల్లులో కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే అంశాలు ఉంటాయి. ప్రకరణ 110లో పేర్కొన్న అంశాలు ఇక్కడ ఉండవు. కాబట్టి దీనిని సాధారణ బిల్లుగానే పరిగణిస్తారు. దీనిని ఉభయ సభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. కానీ రాష్ట్రపతి ఆనుమతించాల్సిన అవసరముంటుంది. ఈ బిల్లులను రాజ్యసభ ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. దీంతో ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడి సంయుక్త సమావేశానికి అవకాశం ఉండవచ్చు
4. రాజ్యాంగ సవరణ బిల్లు
రాజ్యాంగంలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నిబంధనలను సవరించడానికి ఆర్టికల్ 368 కింద ప్రవేశపెట్టిన బిల్లును రాజ్యాంగ సవరణ బిల్లు అంటారు. దీనిని పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. దీని ప్రవేశానికి రాష్ట్రపతి సిఫారసు అవసరం లేదు. ఇది పార్లమెంటు ఉభయ సభల ద్వారా విడివిడిగా ఆమోదం పొంది, మెజారిటీ సభ్యులలో 2/3 వంతు కంటే తక్కువ కాకుండా హాజరు మరియు ఓటింగ్ & సభ యొక్క మొత్తం బలం మెజారిటీతో ఆమోదించబడుతుంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంపై ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి రాజ్యాంగం ఆమోదించదు.
Monday, July 13, 2020
Political Science E Books Download
- ( RC Reddy ) ఇండియన్ పాలిటీ .pdf - 10 MB
- (GROUP 2 ) ఇండియన్ పాలిటి (ప్రభాకర్ రెడ్డి).pdf - 10 MB
- ఐక్యరాజ్య సమితి .pdf - 5 MB
- పంచాయతీరాజ్_వ్యవస్థ_పరిణామ_క్రమం.pdf - 12 MB
- భారత_రాజ్యాంగం_&_రాజకీయ_వ్యవస్థ.pdf - 11 MB
- మీరు_విజయాన్ని_సాధించగలరు_YOU_CAN(1)(1).pdf - 9 MB
- రాజ్యాంగ - నిర్మాణము.pdf - 2 MB
Saturday, January 25, 2020
భారత రాజ్యాంగం అమలు
*భారత రాజ్యాంగం*
*26 , నవంబర్*
*Constitution Day*
■ భారత రాజ్యంగo అమలు●
1858 నుంచి 1947 వరకూ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు, తరువాత 1947 August 15 న మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళడo జరిగింది.
తరువాత మన దేశానికి రాజ్యాంగo కావాలి ఎవరు రాయగలరు అని ఒక చిన్న సందేశం వఛింది. మన మొదటి ప్రదాని మంత్రి అయిన నెహ్రూ గారు మన దేశం నుంచి కొంతమందిని అమెరికా లో ఉన్న కొలoబియా యూనివర్సిటీకి పoపారు, వాళ్ళు మన వాళ్ళకి మీ దేశం లోనే ఒక ప్రపంచ మేధావి అయిన Dr B.R అంబేద్కర్ గారిని పెట్టుకుని ఇక్కడి వరకూ ఎందుకు వచ్చారు అని చెప్పి తిరిగి మన దేశానికి పoపారు. తరువాత రాజ్యాంగ ముసాయిదా కమిటీ వేసి ఆ కమిటీకి Dr B.R అంబేద్కర్ గారిని చైర్మన్ గా నియమించారు...
👉🏼 ఈ విషయాల నుంచి ప్రతీమనిషీ ప్రత్యేకించి దళిత జాతులు నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి.
అప్పటికి ఉన్నతవర్గాల ప్రజలూ, మరికొంతమంది మాత్రమే ఓటు హక్కును కలిగి ఉండి, మిగతా పౌరులకు ఏమాత్రం ప్రాతినిధ్యం లేని పరిస్థితి భారతదేశంలో నెలకొనిఉంది. *ఆర్ధిక అసమానతలెన్ని ఉన్నా, రాజకీయంగా ప్రతీ పౌరునికీ ఒకే విలువ ఉండాలనీ, లేని పక్షంలో అసమానతల వల్ల లబ్ధిపొందుతున్న శక్తులు వ్యవస్థను నాశనం చేస్తాయనీ గ్రహించిన బాబాసాహెబ్, తాను రాజ్యాంగ రచనా కమిటీలో ఉండాలనీ, అసమానతలకు తావులేని రాజ్యాంగాన్ని సిద్ధం చేయాలనీ తపనపడడం వల్లే అంతగా శ్రమించి స్థానం సంపాదించుకున్నారు.*
ఐతే, *రాజ్యాంగం ఎంత గొప్పగా రాయబడినా.. రాజ్యాంగం ఎలాంటి శక్తుల చేతిలో ఉంది అన్న విషయం మీద రాజ్యాంగం మంచిదిగా గానీ, చెడ్డదిగా గానీ పరిణమిస్తుంది కనుక, రాజ్యాంగం తన విధిని చక్కగా నిర్వర్తించాలంటే అది ఈ దేశ పౌరులమీదా, వారు ఎన్నుకునే రాజకీయ ప్రతినిధుల చేతుల్లోనూ ఉంటుందని* తేట తెల్లం చేసారు అంబేద్కర్.
*“తాను రాసిన రాజ్యాంగం అణిచివేయబడ్డ జాతుల హక్కులను నిలబెట్టలేక విఫలమైన పక్షంలో, దాన్ని తగలబెట్టే మొదటి వ్యక్తిని కూడా తానే ఔతాన”ని 1949 నవంబరు 25 న, రాజ్యాంగ పరిషత్ నుద్దేశించి తానుచేసిన చివరి ప్రసంగంలో నిష్కర్షగా ప్రకటించారు.*
దాన్నిబట్టి ,ఈనాడు మనం అనుభవిస్తున్న వివక్షకు కారణం మనం ఎన్నుకున్న తప్పుడు నాయకులే అన్నది ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన ముఖ్య విషయం.
ఈ మాటలనుంచి, తాననుకున్నది ఎంత కష్టమైనదైనా సాధించడంలో అంబేద్కర్ చూపించిన బాధ్యత నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి అనే విషయం ఇప్పుడు మనమందరం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న.
తనజాతి ప్రశాంతంగా హక్కులతో అందరితో సమానంగా బ్రతకాలని ఇంత శ్రమించిన బాబాసాహెబ్ కు మనం సరైన గౌరవం ఎప్పుడైనా ఇచ్చామా?
రిజర్వేషన్ల సృష్టికర్తను అన్నం పెట్టినవాడిగా మాత్రమే జమకట్టి, పే బ్యాక్ టు ద సొసైటీని తుంగలో తొక్కిన దొంగలం మనం కామా?
రిజర్వేషన్ వల్ల జీతాలు సంపాదించుకుంటూ, తమ కుటుంబాలకు మాత్రం అంబేద్కర్ చేసిన త్యాగాలను ఏమాత్రం తెలియజేయకుండా వెన్నుపోటు పొడిచిన వారమేకదా మనమంతా?
తాముకూడా మనువాదుల గుంపులో చేరి, తన పక్కింటివాడు బాగుపడితే తనతో సమానమైపోతాడని, దుర్బుద్ధితో ఆలోచించిన వాళ్ళ వల్లే కదా.. ఈరోజు అంబేద్కర్ అంటే ఒక కులనాయకుడిగా మిగిలి, చాందసుల చేతిలో వివాదాస్పద వ్యక్తిగా ముద్రవేయబడ్డాడు?
ఈ క్లర్కుల గుంపు నావల్ల లభ్దిపొంది నన్ను మోసం చేసింది అని బాబాసాహెబ్ కళ్ళ నీళ్ళపర్యంతమైంది ఎవరుచేసిన ద్రోహం వల్ల?
బాబాసాహెబ్ ను కులనాయకుడిగా చేసి ఆ మహా మేధావిని స్థానిక నేతకు కుదించే ద్రోహాలు ఇక మానేద్దాం.
ఆయన ఆశయ సాధన అంటే చుట్టూ ఉన్న బడుగుజాతుల బిడ్డలకు విద్యతో పాటూ, కనీస ప్రాధమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా, అవి కల్పించేలా ప్రభుత్వాలను ఒత్తిడి చేయడం.
బడుగులందరినీ జ్ఞానవంతులను చేయడం, హెచ్చుతగ్గులు లేని వ్యవస్థ అందరి హక్కు అనే భావజాలాన్ని వీలైనంతగా సమాజానికి చేరవేసి, ఈ దేశపు ప్రతీ పౌరుడికీ ఒకటే విలువ కలిగి ఉండేలా ఇప్పటి యువ సమాజాన్నైనా తీర్చిదిద్దాల్సిన బాధ్యత.. బాబాసాహెబ్ అంబేద్కర్ ను అర్ధంచేసుకున్న, అభిమానిస్తున్న ప్రతీ వ్యక్తిమీదా ఉంది. అలా చేయగలిగినప్పుడే ఆయన విగ్రహానికి దండ వేసి గౌరవించే స్థాయిని మనం సంపాదించుకున్న వారమౌతాం.
కానీ భారతజాతికి దిశను చూపించే రాజ్యాంగ రచనకు అంబేద్కర్ మాత్రమే సరైనవ్యక్తి అని నాటి సభ్యులు చెప్పడము జరిగింది, తర్వాత రాజ్యాంగ రచన మొదలుపెట్టారు...
అంబేద్కర్ గారు మన బారత *రాజ్యాంగoను రాయడనికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది.*
అమెరికా రాజ్యాంగo లో కెవలం 7 ఆర్టికల్స్ ఉన్నయ్. మొత్తం మన బారత రాజ్యాంగo లో 395 ఆర్టికల్స్ 12 షెడ్యూల్లు ఉన్నాయి.
ప్రపoచoలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగo మనది.
*భారత దేశ రాజ్యాంగం మన దేశానికి పవిత్ర గ్రంథం. దేశభక్తి గురించి, నినాదాల గురించి, స్వేచ్ఛ గురించి ఎన్నిరకాల అభిప్రాయాలున్నా… అన్నిoటికీ రాజ్యాంగమే ఆదర్శం.... భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది కాబట్టే రాజ్యాంగం అంటే అందరికీ అంత గౌరవం....అలాంటి రాజ్యాంగానికి కర్తకర్మ అన్నీ అంబేద్కరే....*
త్ర భారతదేశం భవిష్యత్ కు దిక్సూచిగా తన ఆత్మనే రాజ్యాంగ గ్రంథంగా రాసుకున్నారు అంబేద్కర్..
*భారతజాతికి ఆయన ఇచ్చిన ఈ బహుమతి మతాలు, కులాలు, వర్గాలన్నిటినీ ఏకంగా చేసింది. ఏతేడా లేకుండా ప్రతి పౌరుడికీ సమానమైన గుర్తింపు ఇచ్చింది. అందుకే అంబేద్కర్ అందరివాడయ్యారు...*
★అంబేద్కర్ ఆలోచనలే భారతీయులందరి ఆత్మగౌరవం..★
అందుకే తరాలుగా అట్టడుగున ఉండిపోయిన ప్రజలకు ఆయన దేవుడు. *ఆయన ఆలోచనలను కాదనేవాళ్లకు కూడా ఆయనే ఆదర్శం.* అందరికీ కలిసి ఆయన శాశ్వత అవసరం. ఆ అవసరం అనివార్యంగా మారడానికి కారణం… మన రాజ్యాంగం.
ఏ భేదం లేకుండా… *"భారత ప్రజలమైన మేము…"* అంటూ మొదలవుతుంది మన రాజ్యాంగం.
ఈ ఒక్కమాటతో భారత నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే అని చెప్పారు అంబేద్కర్.
అప్పటికే కులాలుగా, మతాలుగా విడిపోయిన భారతీయులను ఒకే ఒక్క మాటతో ఒక్కటి చేశారు.
ఈ సమానత్వంతోనే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు...
మనదేశం కంటే ముందే చాలా దేశాలు రాజ్యాంగాలు రాసుకున్నాయి.... అలా 130కి పైగా దేశాల రాజ్యాంగాలను చదివారు అంబేద్కర్. అవన్నీ అధ్యయనం చేసి మనకు అవసరం అనుకున్నవి, మన దేశ పరిస్థితులకు తగినట్టుగా మార్పులు చేశారు....
మనదేశంలోని రకరకాల సమాజాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందో చాలా ముందుగానే అంచనా వేసి, వాటికి పరిష్కారాలు చూపించేలా రాజ్యాంగ రచన చేశారు అంబేద్కర్....
*దేశంలో పటిష్ఠమైన వ్యవస్థల్ని నిర్మించేలా రాజ్యాంగంలో నిర్దేశించారు అంబేద్కర్. ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దేలా అద్భుతమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఏ వర్గాన్నీ పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా చేశారు. పాలకులు దారితప్పితే ప్రజలు ప్రశ్నించే హక్కు ఇచ్చారు. హక్కులతో పాటు ప్రభుత్వాలను గైడ్ చేసేలా ఆదేశిక సూత్రాలను ఇచ్చారు. మనకంటే చాలా ముందుగా రాజ్యాంగం రాసుకున్న అమెరికా వ్యవస్థ కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించలేకపోయింది.... కొన్ని పరిష్కారం లేని సమస్యల్ని సృష్టించింది. కానీ మన రాజ్యాంగం భవిష్యత్ ను చాలా ముందుగా ఊహించి పరిష్కారాలు చూపేలా రచించారు అంబేద్కర్...*
కొన్ని దేశాల్లో పన్ను కట్టేవాళ్లే ఓటర్లు. కొన్ని దేశాల్లో ఇంకొన్ని అర్హతలున్నవాళ్లకే ఓటు. వాటన్నిటికీ భిన్నంగా… దేశంలో ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించారు అంబేద్కర్.
టాటా, బిర్లా అయినా… రోజు కూలీ అయినా ఓటుకు ఒకటే విలువ. ఇదే అంబేద్కర్ ప్రతిపాదించిన అసలైన ప్రజాస్వామిక సిద్ధాంతం....
అంబేద్కర్ న్యాయశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు.... మనదేశంలో సామాజిక వివక్ష ఎలా ఉంటుందో, ఎదగడానికి ఎన్ని కష్టాలుంటాయో ఆయనకు బాగా తెలుసు. అందుకే పౌరహక్కుల విలువను బాగా అర్థం చేసుకున్న వ్యక్తిగా… వాటిని రాజ్యాంగంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వాటిని ఎవరూ కాదనే అవకాశం లేకుండా తిరుగులేని రక్షణ కల్పించారు. ప్రజల చుట్టూనే వ్యవస్థ పనిచేసేలా చేశారు.
*ప్రతి పౌరుడూ తన ఆలోచనలు చెప్పుకోగలిగేలా భావప్రకటనా స్వేచ్ఛను ఇస్తూ ఆర్టికల్ 19 రూపొందించారు.* అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాథమిక హక్కుల్ని పార్లమెంట్ కూడా ఉల్లంఘించే పరిస్థితి లేకుండా చేశారు అంబేద్కర్....
*దేశంలో మత, కుల, లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు బాబా సాహెబ్. అర్టికల్స్ 14, 15, 16లలో సమానత్వ హక్కులు కల్పించారు. ఇవే దశాబ్దాలుగా దేశంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణకవచాలుగా నిలుస్తున్నాయి.*
దేశంలోని ప్రజలకు తిండి, బట్ట, ఉద్యోగం ఇవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలపైనే పెట్టారు అంబేద్కర్.
అందరికీ సమాన అవకాశాలుండాలని చెప్పారు. మహిళలకు రాజకీయ స్వాతంత్ర్యం ఉండాలని చెప్పిన అరుదైననేత అంబేద్కర్.
*దళితుల కోసం మాత్రమే కాదు దేశంలోని అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన అసమాన నాయకుడు బాబా సాహెబ్. అంబేద్కర్ ను చదవకుండానే ఆయన్ను దళిత నాయకుడిగా ముద్రవేసిన చాలామందికి ఆయన చెప్పిన సమానత్వం ఎప్పటికీ అర్థం కుండానే ఉండిపోయింది.*
దేశంలో ఎన్ని మతాలు, కులాలు, జాతులు, భాషలు ఉన్నా భారతజాతి సమైక్యతను, సమగ్రతను కోరుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు....
ప్రాథమిక హక్కుల పరిపూర్ణతత్వానికి, ఆదేశిక సూత్రాలు జీవనాధారంగా ఉన్నపుడే సంక్షేమరాజ్యం సాధ్యం అవుతుంది ...
*ఐక్యరాజ్య సమితి (UNO) పౌరుల ఎదుగుదల వారి వికాసము అవిభాజ్యము, అనుఉల్లంఘనీయమైన " మానవ హక్కులు " అని ప్రకటించడానికంటే ముందే ఈ ఆదేశిక సూత్రాలును రూపొందించిన ఘనత అంబెడ్కర్ గారికీ చెల్లుతుంది*.
(26th November, రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా)
Thursday, June 6, 2019
All Study Material of subjects related to India
All Study Material of subjects related to India are given below:
India |
1. Indian Polity |
2. Indian Economy |
3. Indian History |
4. Modern Indian History |
5. Modern Indian History |
Telangana |
1. Telangana Geography |
2. Telangana History |
3. Telangana Movement |
4. Telangana Economy |
5. Telangana SCERT Textbooks – Telugu |
Miscellaneous Topics |
1. Disaster Management |
2. Environment & Ecology |
3. General Science |
4. Current Affairs |
5. Online Practice Tests |
Andhra Pradesh |
1. AP History |
2. AP Geography |
3. AP Reorganisation Act, 2014 |
4. AP SCERT Textbooks |
Monday, September 4, 2017
Sunday, September 3, 2017
ఆదేశిక_సూత్రాలు Political Science - Civics Study E Books
Free Indian Political System PDF Download, Indian Political System PDF Download, Political Science E books Download, Political Science PDF E books Download Free Indian Political System PDF Download, Indian Political System PDF Download, Political Science E books Download, Political Science PDF E books Download Download, Political Science PDF E books
Political Science - Civics Study E Books Download, Political Science PDF E books
Political Science - Civics Study E Books Download, Political Science PDF E books
Political Science - Civics Study E Books Download, Political Science PDF E books
Political Science - Civics Study E Books Download, Political Science PDF E books
Political Science - Civics Study E Books Download, Political Science PDF E books
Indian Political System PDF Download
Free Indian Political System PDF Download, Indian Political System PDF Download, Political Science E books Download, Political Science PDF E books Download
Saturday, August 20, 2016
High Courts in the State
Important Committees of India
Following are the Important Committees
1 | Finance Committees | PAC, Estimates Committee, Public Undertakings |
2 | House Committees | Business Advisory, Rules, Pvt Members Bills, Absent of Members |
3 | Enquiry Committee | Privilege, Petitions |
4 | Scrutiny Committees | Subordinate Legislation, SC/ST, Papers laid on the Table, |
5 | DeptRelatedCommittees to scrutinize Demands of various Depts | 17 – consist of 30 from Lok Sabha and 15 from Rajya Sabha—6 constituted by Chairman Rajya Sabha and 15 by Speaker. |
Monday, November 30, 2015
జాతీయ మానవ హక్కుల కమీషన్
జాతీయ మానవ హక్కుల కమీషన్ చట్టబద్దమైన, స్వయం ప్రతిపత్తి సంస్థ, కాని రాజ్యాంగబధ్ధమైన సంస్థ కాదు. "మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993" ప్రకారం జాతీయ మానవ హక్కుల కమీషన్ అక్టోబర్ 12 , 1993 న ఏర్పడింది. కాంగ్రేస్ పార్టీ అధికారంలో పి.వి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ కమీషన్ ను ఏర్పాటు చేశారు. 1993 మానవ హక్కుల చట్టాన్ని 2006 సంవత్సరంలో సవరించి ఈ కమీషన్ లో కోన్ని మార్పులు చేశారు.
- దీన్ని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
- జాతీయ మానవ హక్కుల కమీషన్ లో ఒక చైర్మన్, నలుగురు ఇతర సభ్యులు ఉంటారు.
- చైర్మన్ గా నియమించబడే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి.
- ఒక సభ్యుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా పనిచేస్తున్న లేదా పదవి విరమణ చేసిన వారై ఉండాలి.
- మరోక సభ్యుడు ఏదైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పదవి విరమణ చేసిన వారై ఉండాలి.
- మిగిలిన ఇద్దరు సభ్యులు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్న వారై ఉండాలి
Tuesday, July 14, 2015
Indian Polity Groups Telugu Audio Study Material
Tuesday, June 2, 2015
శ్రీలంక తెరపై తమిళ కూటమి
Monday, January 26, 2015
Constitution of India in Telugu
Sunday, January 25, 2015
బాలల హక్కులు - బాధ్యతలు
- ప్రస్తుత సదస్సు ప్రకారం 18 సంవత్సరాల వయసులోపు మానవులు బాలలుగా పరిగణించబడతారు
- ఈ సదస్సులో తీర్మానించిన బాలల హక్కులను భాగస్వామ్య దేశాలు - ఆ పిల్లల తల్లిదండ్రుల, వారి సంరక్షకుల, కులం, జాతి, వర్గం, భాష, మతం, రాజకీయాభిప్రాయం, జాతీయత, తెగ, అంతస్తు, సామర్ధ్యం, పుట్టుక మరే ఇతర హొదాలను బట్టి వివక్ష చూపకుండా బాలలందరికీ సమానంగా అందించాలి.• పిల్లల తల్లిదండ్రుల, వారి చట్టబద్ధ సంరక్షకుల లేదా కుటుంబ సభ్యుల హొదా, కార్యకలాపాలు, వారి అబిప్రాయాలు లేదా నమ్మకాలను బట్టి పాటించే వివక్ష, శిక్షల నుండి బిడ్డను కాపాడేందుకు భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు తీసుకుంటాయి.
- ప్రభుత్వంగానీ, ప్రైవేట్ సాంఘిక సంక్షేమ సంస్ధలుగానీ, కోర్టులుగానీ, పాలక సంస్ధలుగానీ లేదా బాలలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే సంస్ధలుగానీ అన్నింటికీ బిడ్డ ప్రయోజనాలే ముఖ్య కర్తవ్యంగా ఉండాలి.
- భాగస్వామ్య దేశాలు బిడ్డ శ్రేయస్సుకు అవసరమైన శ్రద్ధ, సంరక్షణా బాధ్యత తీసుకోవాలి. దానితో పాటు బిడ్డ యొక్క తల్లిదండ్రుల, చట్టబద్ధ సంరక్షకుల, చట్టపరంగా బిడ్డకు బాధ్యులైన ఇతర వ్యక్తుల యొక్క హక్కులు విధులను దృష్టిలో పెట్టుకొని ఉంచుకోవాలి. అంతిమంగా అందుకోసం తగిన శాసనపరమైన, పాలనపరమైన చర్యలను తీసుకోవాలి.
- బిడ్డల శ్రద్ధ, సంరక్షణకు ఉద్దేశించిన సంస్ధలు, సేవలు సదుపాయాలను నిపుణులు నిర్దేశించిన ప్రమాణాలను బట్టి ( ముఖ్యంగా ఆరోగ్యం పారిశుద్ధ్యం విషయంలో) పనిచేసే విధంగా భాగస్వామ్య దేశాలు జాగ్రత్త తీసుకోవాలి.
- ఈ సదస్సులో గుర్తించిన హక్కులను అమలు జరపటం కోసం భాగస్వామ్య దేశాలు తగిన శాసనపరమైన, పాలకపరమైన కార్యక్రమాలను చేపట్టాలి. ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల విషయంలో భాగస్వామ్య దేశాలు తమ శక్తి మేరకు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అంతర్జాతీయ సహకారాన్ని తీసుకోవాలి.
- జీవించే హక్కు బాలల జన్మహక్కుగా భాగస్వామ్య దేశాలు గుర్తిస్తున్నాయి.
- పిల్లల మనుగడకు వారి అభివృద్ధికి భాగస్వామ్య దేశాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి.
- అందుకోసం, జాతీయ చట్ట నిబంధనల పరిధిలో బిడ్డ ప్రత్యక్షంగాగానీ, వేరొక ప్రతినిధి ద్వారాగాన, ఒక సంస్ధ ద్వారాగానీ కోర్టులో పాలకవ్యవస్ధలో తన గోడు వినిపించుకొనే అవకాశం బిడ్డకు ఇవ్వబడుతుంది.
- బిడ్డ పుట్టగానే పేరు నమోదు చేయించుకునే హక్కు ఉంది. పుట్టగానే పేరు కలిగి ఉండే హక్కు ఉంది. జాతీయతను పొందే హక్కు ఉంది. వీలైనంత వరకు జ్ఞానం పొందే హక్కు ఉంది. తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు ఉంది.
- కుటుంబ జీవనం కోల్పోయిన బిడ్డలకు, లేదా కుటుంబ వాతావరణంలో తమ ఇష్టాయిష్టాలకు అవకాశం లేని పిల్లలకు ప్రభుత్వం రక్షణ, సహాయం కల్పించాలి.
- అలాంటి పిల్లలకు భాగస్వామ్య దేశాలు తమ జాతీయ చట్టాల ననుసరించి ప్రత్యామ్నయ సంరక్షణ కల్పించాలి.
- ఆ రక్షణ అనేది బిడ్డ భద్రత కోసం - పోషణ స్ధానం, ఇస్లామిక్ చట్టంలో కఫాలా, ఇతర సమాజాల్లో దత్తత, ఇంటర్ ఏలియా మొదలైన అంశాలకూ సంబంధించి ఉంటుంది.
- మానసికంగా, శారీరకంగా వికలాంగులైన పిల్లలు సంపూర్ణమైన గౌరవమైన జీవితాన్ని గడపాలి. వారి గౌరవాన్ని ఆత్మ విశ్వాసాన్ని పెంచాలి. అలాంటి శిశువుల జనజీవనంలో చురుకుగా పాల్గొనేలా వీలు కల్పించాలి. అది భాగస్వామ్య దేశాలు గుర్తించాలి.
- శిశు మరణాలు, పిల్లల మరణాల్ని తగ్గించేందుకు,
- ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేస్తూ పిల్లలలందరికీ అవసరమైన వైద్య సహాయం, ఆరోగ్య రక్షణలు కల్పించేందుకు,
- ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు తగిన పౌష్టికాహారం, పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం ద్వారా, పర్యావరణ కాలుష్యం వల్ల ఏర్పడే ఇబ్బందులు ప్రమాదాలను గుర్తించడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని, వ్యాధులను ఎదుర్కొనేందుకు,
- తల్లులకు ప్రసవానికి ముందు, ప్రసవానంతరం తగిన ఆరోగ్య సంరక్షణలు అందించేందుకు,
- సమాజంలో అన్ని శాఖలకు ప్రత్యేకించి తల్లిదండ్రులకు, పిల్లలకు విద్య పొందేందుకు, పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం గురించిన ప్రాధమిక విజ్ఞాన్నాన్ని వినియోగించటంలో సహకరించేందుకు, తల్లి పాల వల్ల ప్రయోజనాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రమాదాల నివారణ గురించి వివరించేందుకు
- వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణ, తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
- పిల్లల ఆరోగ్యం గురించిన సంప్రదాయ విధానాలను నిర్మూలించేందుకు భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు తీసుకోవాలి.
- శారీరక, మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం సంబంధిత అధికారులు నిర్దేశించిన ఒక శిశువుకు చికిత్స చేసే క్రమంలో భాగస్వామ్య దేశాలు ఆ బిడ్డకు ఉన్న హక్కును ఇతర పరిస్ధితులను గుర్తించాలి.
- బిడ్డ యొక్క శారీరక, మానసిక, భౌతిక, నైతిక, సాంఘిక అభివృద్ధికి అనువుగా జీవన ప్రమాణాన్ని కలిగియుండటం అనేది ప్రతీ బిడ్డకూ ఉండే హక్కుగా భాగస్వామ్య దేశాలు గుర్తించాలి.
- బిడ్డ తల్లిదండ్రులు, సంరక్షక బాధ్యులు తమకు ఉన్న ఆర్ధిక స్థోమత, సామర్ధ్యం, జీవన పరిస్ధితుల్ని బిడ్డ అభివృద్ధి కోసం వినియోగించటం వారి ప్రాథమిక బాధ్యత.
- ఈ హక్కు అమలు కోసం బిడ్డ తల్లిదండ్రులు, బాధ్యులకు సహాయపడేందుకు భాగస్వామ్య దేశాలు తమ దేశ స్ధితిగతులు విధానాల బట్టి తగిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే మంచి తిండి, బట్ట వసతి కోసం వస్తురూంగా కార్యక్రమాల రూపం గా సహాయం చేయాలి.
- బిడ్డ తల్లిదండ్రులు లేదా సంరక్షక బాధ్యులు వేరే దేశంలో నివసిస్తున్నట్లయితే బిడ్డకు రావలసిన భరణాన్ని ఇప్పించేందుకు భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి.
- బిడ్డకు చదువుకొనే హక్కు ఉంది. ఈ హక్కు సమాన అవకాశాల ప్రాతిపదికతో ప్రగతిశీలంగా ఉండాలి. దీన్ని భాగస్వామ్య దేశాలు గుర్తించాలి.
- బాలలందరికీ నిర్భంధ ఉచిత ప్రాథమిక విద్య.
- సాధారణ విద్య, వృత్తివిద్యలతో ఉండే వివిధ రూపాల సెకండరీ విద్యాభివృద్ధిని ప్రోత్సహించటం, వాటిని బాలలందరికీ అందుబాటులో ఉండేలా అవసరమైతే ఆర్ధిక సహాయం, ఉచిత విద్య అందించటం వంటి చర్యలు తీసుకోవాలి.
- ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- విద్యాపరమైన, వృత్తిపరమైన సమాచారాన్ని, మార్గదర్శకత్వాన్ని బాలలందరికీ అందుబాటులో ఉంచాలి.
- పాఠశాలల్లో రోజువారీ హాజరు సరిగా ఉండేలా, బడి మానేసి విద్యార్థుల శాతం తగ్గేలా చర్యలు తీసుకోవాలి.
- పాఠశాల క్రమశిక్షణ అనేది బాలుని ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఉండేలా, ప్రస్తుత సదస్సు నిర్దేశాలకు అనుగుణమన విధానాలతో ఉండేలా భాగస్వామ్య దేశాలు అన్ని చర్యలు తీసుకోవాలి.
- విద్యకు సంబంధించి, ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా అజ్ఞానం, నిరక్షరాస్యత నిర్మూలన కృషిలో పాలు పంచుకునేందుకు భాగస్వామ్య దేశాలు అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించాలి. అలాగే శాస్త్రీయత, సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆధునిక బోధనా పద్ధతులను సమకూర్చాలి. ఈ విషయంలో వర్ధమాన దేశాల అవసరాలను ప్రత్యేకించి పరిగణించాలి.
- ఏ దేశంలో నైనా తెగపరంగా, మతపరంగా, భాషాపరంగా మైనారిటీ ప్రజలు ఉంటే అలాంటి మైనారిటీ వర్గానికి చెందిన బిడ్డకు ఆ మైనారిటీ వల్ల ఒనగూడే ప్రయోజనాలను, ఆచరించే హక్కు ఉంటుంది. తన సంస్కృతి అనుభవించేందుకు, తన మతాన్ని కలిగి ఉండేందుకు, ఆచరించేందుకు, తన భాషను కాపాడుకునే హక్కు ఉంటుంది.
- విశ్రాంతి, విరామాలకు, ఆడుకొనేందుకు, వినోదించేందుకు, వయసుకు తగ్గట్లుగా కళలు సాంస్కృతిక జీవనంలో స్వేచ్ఛగా పాల్గొనేందుకు బిడ్డకు హక్కు ఉందన్నది భాగస్వామ్య దేశాలు గుర్తించాలి.
- కళా సాంస్కృతిక జీవనంలో బిడ్డ పూర్తిగా పాల్గొనేందుకు ఉన్న హక్కును భాగస్వామ్య దేశాలు గౌరవించాలి.
- తల్లిదండ్రులుగానీ, చట్టబద్ధ సంరక్షకులుగానీ, పిల్లల పెంపకం చూస్తున్న ఏ వ్యక్తిగానీ పెంచేటప్పుడు తిట్టినా, కొట్టినా, అసభ్యంగా ప్రవర్తించినా, లైంగికదూషణ చేసినా, దోపిడీ చేసినా, గాయ పరచినా, దౌర్జన్యం చేసినా, ఎలాంటి మానసిక శారీరక హింస నుంచి హింస అయినా సరే బిడ్డను సంరక్షించేందుకు భాగస్వామ్య దేశాలు చట్టపరంగా, పాలనాపరంగా తగు చర్యలన్నీ చేపట్టాలి.
- పిల్లలకు వారి పెంపకందారులకు సహాయంగా కొన్ని సామాజిక కార్యక్రమాలను నెలకొల్పే విధానాలు కూడా తగు విధంగా చేపట్టాలి. పైన వివరించిన దౌర్జన్యం, దౌష్ట్యాల సంఘటనల వివరాలను న్యాయస్ధానాల జోక్యం కోసం పరిశోధించటం, అన్వేషించటం, నివేదించడం మొదలైన వాటికోసం భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు చేపట్టాలి.
- ఆర్ధిక దోపిడీ నుండి బిడ్డను రక్షించాలి. తన చదువుకు, ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఉండే పనుల నుండి బిడ్డను రక్షించాలి. లేదా బిడ్డ శారీరక, మానసిక, భౌతిక, నైతిక, సాంఘిక అభివృద్ధిని ఆటంకపరిచే పనుల నుండి బిడ్డను రక్షించాలి.
- బిడ్డ సంక్షేమానికి సంబంధించిన అంశాలకు ఏ రూపంలో ఉన్న హానినైనా దోపిడీనైనా ఎదుర్కొని భాగస్వామ్య దేశాలు బిడ్డను రక్షించాలి.
- భాగస్వామ్య దేశాలు అన్ని రకాల లైంగిక దూషణ, లైంగిక దోపిడీ నుండి బిడ్డను రక్షించే చర్యలు తీసుకోవాలి.
- వ్యభిచారం, తదితర అక్రమ లైంగిక వ్యవహారాల్లో పిల్లలను వినియోగించే దోపిడీని.
- బూతుబొమ్మలు, బూతు విషయాల్లో పిల్లలను వినియోగించుకొనే దోపిడీని అడ్డుకొనేందుకు భాగస్వామ్య దేశాలు తగిన జాతీయ, ద్వైపాక్షిక, బహూపాక్షిక పద్ధతులన్నిటినీ వినియోగించాలి.
- పిల్లలను శారీరకంగా హింసించరాదు. క్రూరంగా అమానుషంగా, నికృష్టంగా శిక్షించరాదు. 18 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలకు విడుదల చేయడానికి వీల్లేని నేరాల్లో ఉరిశిక్షగానీ, యావజ్జీవశిక్షగానీ విధించరాదు.
- చట్టరహితంగా లేదా నిరంకుశంగా బిడ్డ స్వేచ్ఛను అరికట్టరాదు. బిడ్డను అరెస్టు చేయటంగానీ, నిర్భంధించటంగానీ, జైలులో ఉంచటంగానీ చట్టబద్ధంగానే చేయాలి. అది కూడా తప్పని పరిస్ధితుల్లోనే చేయాలి. అలాగే కొద్ది కాలం మాత్రమే ఉంచాలి.
- స్వేచ్ఛను అరికట్టవలసి వచ్చిన ప్రతీ బిడ్డనూ మానవతా దృష్టితో చూడాలి. ఆ వయసులో పిల్లలకు ఉండే అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని భర్తీ చేయాలి. నిర్భంధిచిన బిడ్డను అవసరమైతే తప్ప, వయోజనుల నుంచి వేరు చేయాలి. అలాగే బిడ్డ ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సందర్శన ద్వారా తన కుటుంబ సభ్యులతో సంబంధాలు కలిగియుండే ఏర్పాట్లు చేయాలి.
- నిర్భంధంలో ఉన్న బిడ్డ తన నిర్భంధం గురించి న్యాయస్ధానంలో చట్టబద్ధంగా పోరాడేందుకు, చట్టాన్ని ఇతర సహాయాన్ని తీసుకునే హక్కు ఉంది.
- భావ ప్రకటన స్వాతంత్ర్యం పిల్లల హక్కుగా ఉంటుంది. నేర్చుకొనేందుకు స్వేచ్ఛ, సరిహద్దులతో పనిలేకుండా ముఖ్య సమాచారాన్ని అన్ని రకాలైన అభిప్రాయాలను అందుకొనేందుకు స్వేచ్ఛ కూడా ఆ హక్కులో అంతర్భాగమై ఉంటాయి. మౌఖికంగాగానీ, లిఖితరూపంలోగానీ, ముద్రణరూపంలోగానీ, కళారూపంలోగానీ బిడ్డ ఎంచుకునే ఏ ఇతర మాధ్యమం ద్వారానైనా జ్ఞానాన్ని పొందవచ్చు.
- పిల్లల భావ ప్రకటన స్వాతంత్ర్యహక్కును, ఆత్మాభిమాన్నాన్ని, మత స్వాతంత్ర్యహక్కును భాగస్వామ్య దేశాలు గౌరవించాలి.
- బిడ్డ సామర్ధ్యాన్ని బట్టి తన హక్కులను వినియోగించుకొనేలా చేసేందుకు వారి తల్లిదండ్రులకు, చట్టబద్ధ సంరక్షకులకు ఉన్న హక్కులను, బాధ్యతలను భాగస్వామ్య దేశాలు గౌరవించాలి.
- మతం లేదా విశ్వాసాలను ప్రచారం చేసుకొనేందుకు ఉన్న హక్కుకు చట్టపరంగా కొన్ని నియంత్రణలున్నాయి. ప్రజల రక్షణ కోసం, శాంతిభద్రతల కోసం, లేదా ఆరోగ్యం, నైతిక విలువలు, ఇతరుల హక్కులు, ప్రాధమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఆ హక్కుకు నిరోధం ఉంటుంది.
- పిల్లల పట్ల నిరంకుశంగా ప్రవర్తించరాదు. పిల్లల ఏకాంతంలో, కుటుంబంలో, గృహవాతావరణంలో వారి సంప్రదింపుల్లో చట్ట విరుద్ధంగా దాడి చేయరాదు. అలాంటి జోక్యానికి దాడులకు వ్యతిరేఖంగా న్యాయాన్ని కాపాడుకొనే హక్కు పిల్లలకు ఉంది.
- ఆర్టికల్ 29 కి అనుగుణంగా బిడ్డకు సామాజిక, సాంస్కృతిక పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని ప్రసారం చేసేందుకు భాగస్వామ్య దేశాలు ప్రచార సాధనాలను ప్రోత్సహించాలి.
- విభిన్న సాంస్కృతిక, జాతీయ, అంతర్జాతీయ వనరుల నుండి అలాంటి సమాచారాన్ని పరిజ్ఞానాన్ని రూపకల్పన చేయడానికి, ప్రచారం చేయడానికి, ఇచ్చి పుచ్చుకోడానికి భాగస్వామ్య దేశాలు అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించాలి.
- పిల్లల పుస్తకాలను తయారుచేయడానికి, ప్రచురించడానికి ప్రోత్సహించాలి.
- మైనారిటీ భాషకు లేదా మాండలికానికి చెందిన పిల్లల భాషా అవసరాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేలా ప్రసార మాధ్యమాన్ని ప్రోత్సహించాలి.
- ఆర్టికల్ 13, ఆర్టికల్ 8 నిబంధనలను దృష్టిలో ఉంచుకొని, పిల్లల శ్రేయస్సుకు హానికరమైన సమాచారం పరిజ్ఞానాల హాని నుండి పిల్లలను రక్షించేందుకు తగిన మార్గదర్శకత్వాన్ని అభివృద్ధి చేయడానికి భాగస్వామ్య దేశాలు ప్రోత్సహించాలి.
- సురక్షిత వాతావరణంలో పిల్లలు ఉండేలా చూడటం.
- వీలున్నంత ఎక్కువగా పిల్లలతో సంభాషిస్తూ వారి మనసు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడం.
- పిల్లలకు సురక్షిత బాల్యమే కాక ఇంకా ఎన్నో రకాల హక్కులు ఉన్నాయని పెద్దలందరికీ తెలియజేసి, వాటిని సంరక్షించేలా చూడటం.
- పిల్లలకి, వారి కుటుంబానికి వీలున్నంతగా సాయపడటం.
- పిల్లల రక్షణకి ప్రమాదం కలిగించే వాటిని తెలుసుకుని, అలాంటి ప్రమాదాల నివారణకి కృషి చెయ్యటం.
- అవసర సమయాల్లో పోలీసులకి / పిల్లల సంరక్షణా సంస్ధలకి ఫిర్యాదు చేసి అవసరమైన చట్టబద్ధ భద్రతని కలిగించటం. పిల్లలు కష్టపడుతున్నప్పుడు అది వారి ఖర్మ అని బావించకూడదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఇబ్బందులతోనే పెరిగారు అన్న ఉదాసీనత ఉండకూడదు. ఇది మన సంప్రదాయం. ఎప్పట్నుంచో ఇలాగే జరుగుతోందన్న ధోరణి ఉండకూడదు. పేదరికం, లంచగొండితనం వల్లే పిల్లలకి బాధలు అన్న అలక్ష్య ధోరణి పనికిరాదు. పిల్లల కష్టాలకు తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబమే కారణం అన్న భావన సరైంది కాదు. ఆ పిల్లలకి మనకి ఏం సంబంధం లేదు అన్న ఉదాసీనతా కూడదు.