Wednesday, August 2, 2023

ESIC జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీ.. పూర్తి వివరాలివే

 

ఈఎస్‌ఐసీ ఈ నోటిఫికేషన్ ద్వారా హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ గ్రేడ్-2 (Seniar Scale & Junior Scale) పోస్టులను భర్తీ చేయనుంది.
ప్రధానాంశాలు:
  • ఈఎస్‌ఐసీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌
  • పలు విభాగాల్లో 47 పోస్టుల భర్తీ
  • నవంబర్‌ 1 దరఖాస్తులకు చివరితేది
ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) తాజాగా 47 స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ గ్రేడ్-2 (Seniar Scale & Junior Scale) పోస్టులను భర్తీ చేయనుంది.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://www.esic.nic.in/recruitments లో ఉన్న దరఖాస్తు ఫామ్‌లను పొందవచ్చు. అభ్యర్థులు స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నవంబర్ 1 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, లడఖ్, లాహౌల్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లోని చంబా జిల్లాలో నివసిస్తున్న అభ్యర్థులకు నవంబర్ 8 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సెలక్షన్ బోర్డు నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక ఉంటుంది.

ఏపీలో భారీ జాబ్ మేళా.. హాజరుకానున్న 18 ప్రముఖ కంపెనీలు.. భారీ సంఖ్యలో ఉద్యోగాలు
ముఖ్య సమాచారం:
ఈఎస్‌ఐసీ నిబంధనల ప్రకారం ఆసక్తి గల అభ్యర్థులు స్థానిక భాషలో మాట్లాడగలగాలి. సీనియర్ స్కేల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు నవంబర్ 1 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.78,800 ప్రారంభ వేతనం ఉంటుంది. గుర్తింపు పొందిన మెడికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. జాబ్ నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత స్పెషాలిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి.

జూనియర్ స్కేల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నవంబర్ 1 నాటికి 40 ఏళ్లు మించకూడదు. వీరికి ప్రారంభ వేతనం రూ.69,700 ఉంటుంది. వీరు తప్పనిసరిగా లాంగ్వేజ్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో లోకల్ లాంగ్వేజ్ తెలిసిన ఉద్యోగాలు పొందొచ్చు. అదనపు సమాచారం కోసం లింక్‌ పై క్లిక్‌ చేయవచ్చు.