Thursday, September 30, 2021

సీఎం కేసీఆర్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారా?

 


 

 టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్క టీకా తయారీ కంపెనీ ఐనా వచ్చిందా? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ పుట్టడానికి ముందు నుంచే రాష్ట్రంలో, హైదరాబాద్‌లో పలు ఫార్మా కంపెనీలున్నాయన్న సంగతి గుర్తెరగాలన్నారు. ‘కేసీఆర్‌ వచ్చాకే తెలంగాణ ప్రజలు భోజనం చేస్తున్నారు. పోలియో టీకాలు వేసుకుంటున్నారు అన్న విధంగా టీఆర్‌ఎస్‌ వ్యవహారం ఉంది’అని రఘునందన్‌ ఎద్దేవాచేశారు. అసలు సీఎం కేసీఆర్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారా? అని ప్రశ్నించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణను అవమానపరిచినట్లు అని కేటీఆర్‌ మాట్లాడడడం సరైందికాదన్నారు. ఫార్మాసిటీకి సంబంధించి ముచ్చర్లలో పది వేల ఎకరాలు సేకరించినప్పుడు రాని ఇబ్బందులు మిగిలిన రెండు వేల ఎకరాలకు ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. ఐటీఐఆర్‌ రీజియన్‌ని ఎందుకు ఏర్పాటు చేయలేదో గత యూపీఏ ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. పరిశ్రమల మంత్రిగా రేయాన్‌ ఫ్యాక్టరీ, నిజాంషుగర్, అజంజాహిమిల్, ప్రాగా టూల్స్, ఆల్విన్‌ కంపెనీలను తెరిపించే సంగతేంటో కేటీఆర్‌ చెప్పాలని డిమాండ్‌చేశారు. సిరిసిల్లకు ఎన్ని లక్షల బతుకమ్మ చీరలకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారో, దుబ్బాక నుంచి ఎన్ని తెచ్చారో చెప్పాలని రఘునందన్‌ డిమాండ్‌చేశారు.  

కేటీఆర్‌ పుట్టకముందే రాష్ట్రంలో ఫార్మా అభివృద్ధి 
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లేనిది చూసి మంత్రి కేటీఆర్‌ ఎగిరెగిరి పడ్డారని, ఆయన పుట్టకముందే తెలంగాణలో ఫార్మారంగం అభివృద్ధి చెందిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఏఐసీసీ కిసాన్‌సెల్‌ వైస్‌చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి హితవుపలికారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. మంగళవారం గాం«దీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కాకముందే ప్రపంచ ప్రసిద్ధి చెందిన భారత్‌ బయోటెక్, ఐడీపీఎల్, రెడ్డి ల్యాబ్స్‌ లాంటి ఫార్మా పరిశ్రమలు హైదరాబాద్‌లో ఏర్పడ్డాయని చెప్పారు.

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక 36 లక్షల మంది పారిశ్రామిక రంగంలో ఉద్యోగాలు కోల్పోయారని, అనేక పరిశ్రమలు మూతపడ్డాయని, పఠాన్‌చెరు లాంటి ఇండ్రస్టియల్‌ జోన్‌లో 50 శాతం కాలుష్యం పెరిగిందని విమర్శించారు. కాలుష్య నియంత్రణ మండలిని పనిచేయనీయకుండా పరిశ్రమల యాజమాన్యాలను బెదిరించి టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సు«దీర్‌రెడ్డి మాట్లాడుతూ మొన్న కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్తే హుజూరాబాద్‌ ఎన్నికలు ఆగిపోయాయని, ఇప్పుడు ఢిల్లీ వెళ్లి రాగానే అదే హుజూరాబాద్‌కు నోటిఫికేషన్‌ వచి్చందని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే కేసీఆర్‌ చేతిలో బీజేపీ కీలు»ొమ్మ అయిందని, ఈ ఎపిసోడ్‌లో ఈటల రాజేందర్‌ బకరా అయ్యారని సు«దీర్‌రెడ్డి ఎద్దేవాచేశారు.