Monday, July 6, 2015

కాకతీయుల కాలంలో నియోగులు అంటే ఎవరు ? పోటీ పరీక్షల ప్రత్యేకం



  పోటీ పరీక్షల ప్రత్యేకం
1. ఏ సంవత్సరంలో ఆంధ్ర జన సంఘం పేరు నిజాం రాజ్య ఆంధ్రజన సంఘంగా మార్చారు ?
- 1922
2.పాలేరు నుంచి పద్మశ్రీ వరకూ అన్న పేరుతో తన జీవిత చరిత్ర రాసుకున్నది ?
- బోయి భీమన్న
3. కుతుబ్‌షాహీల కాలంలో శిస్తు వసూలుకు ప్రమాణం ?
- సర్కార్లు (జిల్లాలు)
4. మహాతలవరి బిరుదుతో వ్యవహారం పొందిన ఇక్ష్వాక వంశ స్త్రీ ?
- శాంతిశ్రీ
5. ఏ రాజు 108 యుద్ధాలు చేసి పాపపరిహారంగా 108 శివాలయాలు నిర్మించాడు ?
- విజయాధిత్యుడు
6. రాష్ట్ర స్థాయిలో లోక్‌దళ్‌ పార్టీని ఏర్పాటు చేసిన వారు ?
- గౌతు లచ్చన్న
7.స్వారాజ్య సంపాదన కరపత్రం ఎవరిది ?
- లక్కరాజు బసవయ్య
8. కాకతీయుల కాలంలో నియోగులు అంటే ఎవరు ?
- గ్రామాధికారులు
9. పాశ్చాత్య యాత్రికులు దేన్ని రెండో ఈజిప్ట్‌గా కీర్తించారు ?
- గోల్కొండ
10. ఆంధ్రలో జైనపంచలోహ విగ్రహాలు లభించిన ప్రదేశం ?
- బాపట్ల
11. వజ్ర కరూర్‌ బంగారు గనులు ఏ జిల్లాలో ఉన్నాయి ?
- అనంతపురం
12.స్వాతంత్య్రం లేని జీవనం జీవచ్చవం లాంటిది అని చాటి చెప్పింది ?
- అనిబిసెంట్‌
13. విద్యానాధుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు ?
- రెండో ప్రతాపరుద్రుని ఆస్థానంలో
14. సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథం రచించింది ఎవరు ?
- రుద్రదేవుడు
15. హన్మకొండలో వేయి స్థంబాలగుడిని 1162లో నిర్మించింది ఎవరు ?
-కాకతీయ రుద్రదేవుడు
16. శ్రీనాథునికి కనకాభిషేకం చేసిన విజయనగర రాజు ఎవరు ?
- రెండో దేవరాయులు
17. తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో పట్టాభిషేకం చేసుకొన్నది ?
- అచ్యుతరాయలు
18. తిలక్‌ స్వరాజ్యనిధికి తన నగలనిచ్చి, విదేశీ వస్త్రాలను త్యజించి, ఖద్దరు ధరించి జాతీయోద్యంలో పాల్గొన్న తొలి మహిళ ?
- మాగంటి అన్నపూర్ణమ్మ
19.రాష్ట్రంలో ప్రాచీన శివలింగం ఎక్కడ ఉంది ?
-గుడిమల్లం
20. నరపతుల కెల్ల ఘోర దానవుడు వీడు అని నిజాంపై అగ్ని ధార కురిపించింది ? -దాశరది
21. 1857 తిరుగుబాటులో కడపప్రాంతం నుంచి పాల్గొన్న నాయకుడు ?
- పీర్‌సాహెబ్‌
22. నిమ్నజాతుల చరిత్ర రాసింది ?
-జాలా రంగస్వామి
23. ముత్యాలశాఖ సభా భవనం ఎవరిది ?
-దేవరాయలు-2
24. ప్రతి సంవత్సరం భద్రాచలం రాముని కళ్యాణ మహోత్సవానికి కానుకలు (తలంబ్రాలు) పంపే సంప్రదాయాన్ని ఏ నిజాం ప్రవేశపెట్టాడు ?
-నసీరుద్దౌలా
25. పంచతంత్రం తెలుగులో రచించింది ?
-దూబగుంట నారాయణ
26. ఆంధ్రలో ఆంగ్లేయుల మొదటి స్థావరం ?
- మచిలీపట్నం
27.చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది ?
- 1758 డిసెంబర్‌ 7
28.ఆంధ్ర భాషా సంజీవని పత్రిక స్థాపకుడు ?
- కొక్కొండ వెంకటరత్నం పంతులు
29. దేశాభిమాన పత్రిక ఎక్కడి నుంచి వెలువడింది ?
- గుంటూరు
30. ఆంధ్ర కేసరి పత్రిక సంపాదకుడు ?
- చిలుకూరి వీరభద్రరావు
31.ఓరుగల్లులోని పద్మాక్షి ఆలయ నిర్మాత ?
- మొదటి ప్రోలరాజు
32. మారన మార్కండేయ పురాణం అంకితం పొందింది ఎవరు ?
- గోన గన్నారెడ్డి
33. భాస్కర రామాయణం రచయిత ?
- హుళక్కి భాస్కరుడు
34. కేశవ దేవాలయాన్ని నిర్మించింది ?
- గంగాధరుడు(ఓరుగల్లులో)
35. సిద్దేశ్వర నిర్మాత ?
- పోలరాజు-2(హన్మకొండ)
36. వృషాధి శతకం రచయిత ?
- పాల్కురికి సోమనాథుడు
37. కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదు పొందింది ?
- రేచర్ల ప్రాసాదాదిత్యుడు
38.అశితివరాల సింగమ అని ప్రసిద్ధి చెందినవారు ?
- రేచర్ల సింగమ నాయకుడు
39. పద్మనాయకుల మొదటి రాజధాని ?
- రాచకొండ (నల్గొండ)
40. ధర్మ ప్రతిష్టాగురు, చెంచుమలచూరకార అనే బిరుదులు పొందినవాడు ?
- ప్రోలయ వేమారెడ్డి
41.విజయనగర రాజులను ఓడించి నెల్లూరును స్వాధీనం చేసుకున్నది ఎవరు ?
- అనవేమారెడ్డి
42. పురుటి సుంకం విధించి ప్రజల చేతిలో హతమైంది ఎవరు ?
- రాచవేమారెడ్డి
43. శంభుదాసుడు ప్రబంధపరమేశ్వరుడు అనే బిరుదులున్న ఎర్రన ఎవరి ఆస్థానంలోని వాడు ?
-ప్రోలయ వేమారెడ్డి
44. మధురను ఎవరి కాలంలో జయించారు ?
- బుక్కరాయలు
45. మొదటిసారిగా విజయనగర, బహ్మనీ రాజ్యాల మధ్య విభేదాలు ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి ?
- మొదటి బుక్కరాయలు
46. కన్యాశుల్కం స్థానంలో కాన్యదానాన్ని (వరకట్నం) ప్రోత్సహించిన రాజు ?
- రెండో దేవరాయలు
47. శ్రీభండారు అంటే ?
- కోశాధికారి
48. ఏకశిలారథం సప్తస్వరాల మండపాలున్న ఆలయం ?
- విఠలస్వామి ఆలయం
49.విజయనగరం వీధులలో బంగారం, రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారని చెప్పింది ఎవరు ?
- రజాక్‌
50. కళింగలో గణపతి రాజ్యస్థాపకుడు ?
- కపిలేశ్వర గణపతి
51.గీత రత్నావళి వాద్య రత్నావళి సృత్త రత్నావళి గ్రంథాల రచయిత ఎవరు ?
- జాయవసేనాని
52. ఫటోదృతి అనే బిరుదున్న కాకతీయ రాజు ?
- రుద్రమదేవి
53. ప్రతాపరుద్రుడు నర్మదానదీ తీరంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఏ శాసనాల ద్వారా తెలుస్తుంది ?
- ముసునూరి ప్రోలయ నాయకుడు, అతడి తల్లి వేయించిన కలువచేరు శాసనాల వల్ల
54. ప్రసిద్ధి చెందిన పాకాల చెరువును ఏ కాకతీయ రాజు కాలంలో సేనాని జగదల ముమ్మిడి తవ్వించాడు ?
- మొదటి ప్రోలరాజు
55. కాకతీయుల కాలంలో భూములను కొలిచే సాధనాలు ?
- గడ, లేదా కోలతో కొలిచేవారు
56. మెదడును కప్పి ఉండే వెలుపలి, మధ్య పొరల మధ్య ఉండే ద్రవం ?
- మస్తిష్క మేరుద్రవం
57. మెదడును కప్పి ఉండే మధ్య పొర ?
-లౌతికళ
58. మెదడును కప్పి ఉండే లోపలి పొర
- మృద్వి
59. మెదడును కప్పి ఉంచే, ఎముకలతో ఏర్పడిన పెట్టి లాంటి నిర్మాణం ?
- కపాలం
60. మానవుడిలో వెన్నునాడుల జతల సంఖ్య ?
-31
61. మానవుడిలో కపాల నాడుల జతల సంఖ్య ?
- 12
62. వేరులో పెరిగే భాగం ?
-కొనకింది భాగం
63.మొక్కల్లో ఆక్సిజన్‌ తయరయ్యే స్థలం ?
-విభాజ్య కణాలు
64. మొక్కల్లో పెరుగుదల పదార్ధాలుంటాయని తొలిసారి ప్రతిపాదించిన వారు ఎవరు ?
- చార్లెస్‌ డార్విన్‌
65. పరిసరాల్లో కలిగే మార్పులకు ఒక జీవి అనుక్రియ చూపే లక్షణాన్ని ఏమంటారు ?
- క్షోభ్యత
66. అగ్రాధిక్యత అంటే?
- కొనమొగ్గ పార్శ్వపు మొగ్గలను అదుపు చేయడం
67. పొట్టి మొక్కలను పొడవుగా చేయడంలో సహాయపడే హార్మోన్‌ ?
- జిబ్బర్లిన్లు
68. కణ విభజనను ప్రేరేపించే హార్మోన్‌ ?
- సైటోకైనిన్లు
69. ఆకులు, ఫలాలు రాలడంతో ప్రభావం చూపే హార్మోన్‌ పేరు ?
- అబ్‌సిసిక్‌ ఆమ్లం
70. అనిషేక ఫలాలు అంటే ?
- విత్తనాల్లేని ఫలాలు