Saturday, April 30, 2022

తాగొచ్చి కొడుతున్నాడని భర్తను హతమార్చిన భార్య

 పెద్దపల్లి: కట్టుకున్న భర్తను ఇటుక పెల్లతో బాది హతమార్చిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం మద్యం మత్తులో విలేజ్‌ రామగుండం గ్రామానికి చెందిన కల్లెడ మల్లేశం (42) తలపై భార్య స్వరూప సిమెంట్‌ ఇటుక పెల్లతో బలంగా బాదంది.
ఈ ఘటనలో భర్త మల్లేశం అక్కడికక్కడే మృతి చెందాడు. గత కొన్నేళ్లుగా మల్లేశం మద్యానికి బానిసై ప్రతిరోజు భార్యను చిత్రహింసలు పెట్టేవాడని స్థానికులు పేర్కొన్నారు. గురువారం రాత్రి సైతం ఇంట్లో గొడవ జరగడంతో స్వరూప తల్లిగారింటికి వెళ్లి తలదాచుకొని శుక్రవారం ఉదయం వచ్చిందని తెలిపారు. రాగానే స్వరూపతో మల్లేశం మళ్లీ గొడవకు దిగడంతో క్షణికావేశంలో సిమెంట్ ఇటుకతో హతమార్చినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న 1 టౌన్ సీఐ రాజ్ కుమార్, 2 టౌన్ ఎస్ఐ శరణ్య, అంతర్గాం ఎస్ఐ శ్రీధర్ సంఘటనా స్థలానికి చేరుకొని. పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.