Tuesday, March 9, 2021

Smartphone కొనబోతున్నారు.. ... ఇకపై ఈ ఫీచర్స్ ఉంటేనే ... లేటెస్ట్ ట్రెండ్స్ ఇవి!

 

 


కొత్తగా smartphone కొనాలంటే అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఇవి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఈ సంవత్సరం నుండి రాబోయే కొన్నేళ్లలో ఏయే అంశాల ఆధారంగా వినియోగదారులు smartphone కొనుగోలు చేయబోతున్నారు అనే అంశం మీద ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ Flipkart కొన్ని వివరాలు వెల్లడించింది.

5G phoneలకు ఇటీవల విపరీతంగా ఆదరణ పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. రాబోయే కొన్నేళ్లపాటు 5G smartphone లకు ఎక్కువ గిరాకీ ఉంటుందని ఆ సంస్థ అంచనా వేస్తోంది. మరోవైపు ఇప్పటివరకు 64 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన ఫోన్లతో సరిపెట్టుకున్న వినియోగదారులు.. ఇప్పుడిప్పుడే 108 మెగాపిక్సెల్ రిసల్యూషన్ ఉన్న ఫోన్ల వైపు దృష్టి సారిస్తున్నారు. మున్ముందు ఇప్పటికన్నా మరింత ఎక్కువగా కెమెరా క్వాలిటీ గురించి వినియోగదారులు ఆలోచించే అవకాశం ఉంది.

 

ఇదిలా ఉంటే మరోవైపు బ్యాటరీల పరంగా కూడా నిన్న మొన్నటి వరకు 5000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీలు ప్రామాణికంగా ఉంటే ఇప్పుడు ఏకంగా 6000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీలు ప్రామాణికంగా మారుతున్నాయి. మరోవైపు ఇప్పుడు వాడకంలో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీల కంటే మరింత శక్తివంతమైన 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన ఫోన్లకి విపరీతంగా ఆదరణ పెరగబోతున్నట్లు తెలుస్తోంది.

 Under display selfie camera కలిగిన మొట్టమొదటి ఫోన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, ఇకమీదట ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే ఇలాంటి ఫీచర్లని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులు ఫోన్లను కొనే అవకాశం ఉందని Flipkart చెబుతోంది. దీంతోపాటు వినియోగదారుల ఎప్పటికప్పుడు ఫోన్ పనితీరు పట్ల కూడా ప్రత్యేకంగా దృష్టి నిలుపుతున్న ట్లు ఫ్లిప్కార్ట్ సంస్థ గమనించింది. 5nm ప్రాసెసర్లు అందుబాటులోకి రావడం, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఇతర ఫీచర్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుండడంతో కంప్యుటేషనల్ ఫోటోగ్రఫీ ప్రాధాన్యత సంతరించుకుంటోందని, ముందు ముందు ఫోన్ లలో ఇది కీలకంగా మారబోతోందని Flipkart భావిస్తోంది.

 


ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మనం phoneలను వాడుతున్న తీరుకి భిన్నమైన, మరింత శక్తివంతమైన phoneలను రాబోయే రెండు మూడేళ్లలో ఉపయోగించబోతున్నాం.